Skip to main content

Posts

Showing posts with the label NATIONAL

వీకెండ్ స్టోరీ: హండ్రెడ్ పర్సెంట్ హరామ్

ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది.  హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి దేశా

భారత్ ఆక్రమణలో మావో జెడాంగ్ థియరీనే చైనా అమలు చేస్తోందా?

అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని చైనా ఆక్రమించడం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇవాళ కొత్త కాదు. కానీ భారత్ చైనాను విజయవంతంగా నిలువరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే చైనా అరుణాచల్ మీద ఎందుకు కన్నేసిందనేదే ముఖ్యాంశం.  ఎలా బయటపడింది? అమెరికాలోని ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. ఆ ఇమేజెస్ గత నవంబర్ లోవి. తాజా ఫొటోల్లో కొత్త ఇళ్ల సముదాయం కనిపించింది. అదే చోట 2019 ఆగస్టులో ఇళ్లేవీ లేవు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం భారత్-చైనా సరిహద్దు నుంచి అరుణాచల్ భూభాగంలో దాదాపు 5 కి.మీ. లోపలికి వచ్చేసింది. అంటే ఏడాదిలో చైనా అక్కడ శాశ్వత మానవ నివాసాలను నిర్మించిందన్నమాట. సారీ చూ అనే నది ఒడ్డున చైనా పౌరులకు శాశ్వత నివాసాలు నిర్మిస్తోంది. చైనా పౌరులు కూడా ఇప్పుడక్కడ తరచుగా కనిపిస్తున్నారు. దీనిపై స్థానిక బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని అలర్ట్ చేశాడు.  చైనా ఎందుకిలా చేస్తోంది? చైనా భారత భూభాగం మీద కన్నేయడమనేది కొత్త కాదు. ఆక్రమించడానికి చైనా ఎప్పట్నుంచో కాచుకొని ఉంది. నెహ్రూ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్ట

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్".  Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ 1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు

జానారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జూనారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకంటే వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ దెబ్బతిన్న క్రమంలో ఢిల్లీలో ఆయనకంటూ పెద్దదిక్కు ఎవరూ లేకపోవడం ఆయనకు పెద్దమైనస్ పాయింట్. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక.. ఆ స్థానాన్ని రేవంత్ చేత భర్తీ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఎంపిక కూడా దాదాపుగా ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ దూకుడును, పోకడను, రాకడను ససేమిరా అంటున్న సీనియర్లు మాత్రం రేవంత్ వస్తే తాము పార్టీలో ఉండే ప్రశ్నే లేదని భీష్మించుక్కూర్చున్నారు. రేవంత్ వస్తే తమ ప్రాధాన్యత అసలు ఏమాత్రం లేకుండా పోతుందని, ఇన్నాళ్లూ ఉనికి చాటుకున్న పార్టీలో అసలు ఉనికే లేకుండా పడిఉండడం తమ వల్ల కాదని వారంటున్నారు. అందుకే దాదాపు గత ఏడాదిన్నరగా రేవంత్ టీ-పీసీసీ అనౌన్స్ మెంట్ ను తొక్కి పెట్టినట్లు సమాచారం. అయితే గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడే సూచనలేవీ కనిపించకపోవడంతో ఇదే అదనుగా ఉత్

న గల్లీ తుమ్హారా.. న ఢిల్లీ తుమ్హారా..

ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో  ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో క

రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

హైదరాబాద్ లో రోహింగ్యాల అంశం మరోసారి పెద్ద దుమారమే రేపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి వారి సంఖ్య ఎంతుందో హడావుడిగా ప్రకటించాల్సి రావడమే.. కేసీఆర్ సర్కారులో కలవరం ఏ స్థాయిలో రేగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‍లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల మీద, పాకిస్తాన్, బంగ్లాదేశీ చొరబాటుదార్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలెంజ్ చేయడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ తో ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రులు ఉలిక్కిపడ్డారు. అయితే ఉలికిపాటు బయటికి కనిపించనీయకుండా.. అసలు రోహింగ్యాలు కేంద్రం పరిధిలోని అంశం... దానికి రాష్ట్రంతో సంబంధమేంటని కేటీఆర్ బంతిని అవతలికి తోసేయగా.. మిత్రుడైన అసదుద్దీన్ రోహింగ్యాలకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల్లాంటివి ఒక్కటన్నా ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు ఉన్

మాదిగ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‍లో ఒత్తిడి తేవాలి

మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం అమరులైనవారికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు ఉడతా భక్తిగా సాయం చేసి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, అమరవీరుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు వాతావరణం అనుకూలిస్తున్నదని, సుప్రీంకోర్టు ఈమధ్య రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చని చెప్పడం శుభ పరిణామమని ఇటుక రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి డ్రాప్టింగ్ కమిటికి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన దర్మాసనం.. వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఎస్సీల్లో 108 కులాలు ఉన్నాయని కొన్ని కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని, వర్గీకరణ జరిగితే కింది కులాలకు కూడా ఫలాలు అందుతాయని రాజు ఆకాంక్షించారు.  జనాభా నిష్పత్తి ప్రకారం కులాలకు రిజర్వేషన్ల పంపిణీ జరగాలని డాక

ఆ లోగుట్టు ఒవైసీకే ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరికెరుక? ఆ దారి వేసినవారికి తప్ప. ఎవరెన్ని పరుగులు కొట్టారన్న కొలబద్దే మ్యాజిక్ ఫిగర్ ను శాసిస్తున్న నడుస్తున్న రాజకీయాల్లో ఏ పార్టీ ప్రయాణం ఏ దిశగా సాగుతుందని ఆలోచించే తీరుబడి గానీ, అవసరం గానీ అటు ప్రజలకైనా, ఇటు పార్టీలకైనా అక్కర్లేని మ్యాటరైపోయింది. బిహార్లో 5 సీట్లు అందుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే జోష్ పెంచుకున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) పార్టీని లైట్ తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆవేశం కన్నా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ముందుకెళ్తుండడం జాతీయ పార్టీలకు సైతం కనువిప్పు కావాల్సిన సందర్భం. బిహార్లో ఎంఐఎం సూపర్ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా ఈ మాటే చెప్పుకుంటున్నారు. మొదట్నుంచీ యాంటీ బీజేపీ, యాంటీ నేషనలిస్ట్ పాలసీలతో ముందుకెళ్తున్న ఎంఐఎం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు బహుదూరం జరిగిపోయింది. మునుగుతున్న నావలో ఎవరైనా ఎంతకాలం కొనసాగుతారు? ఆ పార్టీ నేతలే రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగిన బీజేపీ గూటిలో చేరిపోతున్నారు. మరికొందరేమో ప్రాంతీయ పార్టీలతో కలిసిపోతున్నారు. అలాంటప్పుడు కేవలం సెక్యులరిజం, భావస

నగ్రోటా చొరబాటు: 26/11 మోడల్ ఆపరేషన్ కోసమేనా?

   జమ్మూ జిల్లా నగ్రోటా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు టెర్రరిస్టులు భారీ కుట్రతోనే దేశంలోకి చొరబడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఇవే అంశాలు వెలుగుచూశాయి. హోంమంత్రి అమిత్ షా, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ ఎజిత్ దోవల్, ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లాతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు నగ్రోటా ఎన్ కౌంటర్ పై సమీక్షించారు. 2008 నవంబర్ 26న ముంబై మీద జరిగిన టెర్రరిస్టు దాడి తరహాలోనే తాజాగా కాశ్మీర్ లో భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతా దళాలు అంచనా వేశాయి. మరో వారం రోజుల్లో ఆనాటి భారీ అటాక్ జరిగిన దినం సమీపిస్తున్న దృష్ట్యా ఉగ్రవాదులు ట్రక్ లో దాక్కొని మళ్లీ అలాంటి భయానకమైన దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన విషయంపై చర్చించారు.  గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమవడం, ఆ తరువాత కొన్ని గంటల్లోనే పీఓకే లోని టెర్రరిస్టు స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేయడం గమనించాల్సిన అంశం. అలాగే జమ్మూ-కాశ్మీర్ లో జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా భీకరమైన దాడులకు పాల్పడి కాశ్మీర్ లో

అర్నాబ్‌ అరెస్టు: వరంగల్ జర్నలిస్టుల ధర్నా

ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉదయమే దాదాపు 20 మంది పోలీసులు అర్నాబ్ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా అరెస్టు చేశారు. వారెంటుగానీ, నోటీసులు గానీ ఏమీ లేకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అర్నాబ్ పై పోలీసులు దాడి కూడా చేశారు. ఆయన కుమారుడి పైనా దాడికి దిగారు. ఆ తరువాత రాయ్‌గడ్ కు తరలించారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు.  ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను  అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారు. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆ టీవీ పేర్కొంది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్  సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది. జుట్టు పట్టుక

బీజేపీతో షురూ.. ఆల్ స్టేట్స్ ఫాలోయింగ్

బిహార్ ఎన్నికల పుణ్యాన కోవిడ్-19 వ్యాక్సిన్ ఎన్నికల హామీగా మారిపోయింది. రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బిహార్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రకటించడం దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా చర్చాంశంగా మారింది. మరుసటి రోజు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఫ్రీ-వ్యాక్సిన్ నినాదాన్ని ఎత్తుకున్నాయి. తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ ను ఫ్రీ అంటూ ప్రకటించాయి. అదే బాటలో తెలంగాణ కూడా ఫ్రీ-వ్యాక్సిన్ కు ఓటేసింది. ఈటల రాజేందర్ ఇదే అంశాన్ని కన్ఫామ్ చేస్తూ ప్రజలందరికీ ఫ్రీ-వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని, పౌరుల ఆరోగ్య భద్రత అనేది రాష్ట్రాల బాధ్యతే అయినా.. కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి బయట పడాలంటే కేంద్ర, రాష్ట్రాలు కలిసి ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ తీసుకొచ్చిన ఫ్రీ-వ్యాక్సిన్ నినాదం మీద పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తినా... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ అంశాన్ని పాజిటివ్ తీసుకొని తమ విధానాలు ప్రకటించడం గమనించాల్సిన అంశం. తెలంగాణ మంత్రి ఈటల కూ

ఆ మావోయిస్టుపై రూ. 8 లక్షల రివార్డు-Xclusive Pics

మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన  ఎన్ కౌంటర్ లో పెరమిలి దళం కమాండర్  కోటె అభిలాష్ అలియాస్  చందర్, సోమా, శంకర్ అనే మావోయిస్ట్ మృతి చెందాడు. ఏటాపల్లి తాలుక హెడ్రీ పీయస్ పరిధిలోని  యెలదుడమి అటవీ ప్రాంతంలో సి60 కమాండోలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో  తెలంగాణ ములుగు జిల్లా కారపల్లి గ్రామానికి చెందిన అభిలాష్ అనే మావోయిస్టు మృతి చెందాడు. సోమ పై రూ. 8 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  సంఘటన స్థలంలో ఒక  తుపాకీ, వాకీటాకీలు, ప్రెసర్ కుక్కర్, 20 కిట్ బ్యాగులు, సామాగ్రి, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సి60 కమాండోలను జిల్లా ఎస్పీ శైలేష్ బల్కావుడే అభినందించారు.  

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మరో దఫా లాక్ డౌన్ మరింత పకడ్బందీగా విధించడం తప్ప మార్గం లేదని అనేక వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం మీద అటు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ప్రచారం సాగుతోంది. మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదని, కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతన్న క్రమంలో లాక్ డౌనే శరణ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కేంద్రం కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా చర్చిస్తోందని, జూన్ 15 తరువాత గానీ, కాస్త అటుఇటుగా గానీ లాక్ డౌన్ విధించడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రం ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మరో దఫా సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు పుకార్లేనని తేల్చినట్లయింది.  ఆందోళనకరంగా కేసులు భారత్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజుకు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడల

మతోన్మాదం పేదవారికి ప్రథమ శత్రువు

  ఆధ్యాత్మికత వేరు, మతం వేరు. ఆధ్యాత్మికతలో మనిషి తనను తాను పరిశీలించుకుని ఆత్మ దర్శనం కొరకు సాధన చేసి పరమాత్మను గురించి పరమాత్మ సంకల్పానుసారం సాధనలో ముందుకు వెళ్తాడు. ఆత్మ జ్ఞానానికి ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఋషులు, మునులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శిరిడి సాయిబాబా, బ్రహ్మంగారు ఈ కోవలోకి చెందినవారు. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో హిందూ మతం, హిందూ జాతి అనే పదాలను అర్థం తెలియకుండా వాడుతున్నారు. వేదాలలో భగవద్గీతలో హిందూ మతం అనే పదం లేదు. భరతజాతి అని కొన్ని చోట్ల ఉంది. మన దేశంలో కొందరు విష్ణు భక్తులు, వైష్ణవులు, కొందరు శివ భక్తులు, శైవులు కొందరు అద్వైతాన్ని మరికొందరు ద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. యజ్ఞాలలో జంతుబలిని హింసను వ్యతిరేకించి కరుణారస హృదయంతో బౌద్ధం వచ్చింది. శంకరుని మాయ వాదమైనా బౌద్ధంలోని నిరంతరం మారే ప్రపంచమన్న వాస్తవంగా ఒకే విషయాన్ని చెప్తున్నది.   యోగులు అందరూ అద్భుతమైన అనుభవాలు కలవారే. ఇహలోక సుఖాలను కాదని పరమాత్మ సన్నిధానానికై ప్రయత్నించినవారు అన్ని మతాల్లో ఉన్నారు. జైనులు, సిక్కులు, ఆర్య సమాజం వారు ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. వాస్తవంగా ఒక మతం, ఒక జాతి అంట

లిక్కర్ - యుద్ధం ముగిసిందా? చేతులెత్తేశామా?

బెంగళూరులో ఓ మద్యం షాపు ముందు మహిళల క్యూ భీకర యుద్ధం ముగియలేదు. శత్రువు ఓటమిపాలు కాలేదు. యుద్ధంలో కూరుకుపోయిన మనకు విజయం ప్రాప్తించనూలేదు. కానీ విజయోత్సాహాన్ని మించిన వేడుక జరుగుతోంది. నెలా పదిహేను రోజులుగా చుక్క మందుకు నోచుకోని సగటుజీవి గడపదాటి తెరిపిన పడేందుకు వైన్ షాపుల ముందు క్యూ కట్టాడు. ప్రేయసిని మించిన ప్రేయసి కోసం గంటలకొద్దీ వెయిట్ చేశాడు. ఎదురుచూపులు చూసిచూసి, యుగాలతో పోల్చదగిన ఎడబాటును ఎంతో ఓర్పుతో భరించిన మందుబాబు... చుక్కమ్మను అపురూపంగా అందుకున్న అరుదైన ఘట్టం భారతావని అంతటా ఆవిష్కృతమైంది. అంతేనా? మేమేం తక్కువ, ఎందులో తక్కువ అంటూ మహిళామణులు కూడా క్యూ కట్టడం విస్తుగొలిపే అంశం.  కర్నాటక, ఏపీ, గోవా, రాజస్థాన్, యూపీ.. ఇలా అనేక రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలకు ద్వారాలు తెరిచాయి. ఒకవైపు లాక్ డౌన్ ను మూడోసారి పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించిన కేంద్రం.. అందుకు పూర్తి విరుద్ధమైన మరో నిర్ణయం  తీసుకోవడం విడ్డూరం కాకపోయినా తెలివిలేని, పనికిమాలిన, సిగ్గుమాలిన నిర్ణయంగా రుజువైపోయింది. లాక్ డౌన్ కఠినతరం చేస్తూ పొడిగించడం ఏంటి? లిక్కర్ అమ్మకాలకు అనుమతులివ్వడమేంటి? మూడుసార్లు ప్రధాని మీడియా ముందుకొచ

"కరోనాతో సహజీవనమే పరిష్కారం"

శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను పూర్

ఆదిశంకరాచార్యుడి విజయంలో అసలు రహస్యం

(2530వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)   ద్వాపరయుగ అంతంలో ధర్మ సంరక్షణకు కురుక్షేత్రంలో జరిగిన సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ఆహుతి అయింది. భగవాన్ శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. క్రమంగా దేశమంతటా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలిపోయాయి. దేశం పతనం వైపు వేగంగా పరుగులిడుతుంది. ఇలాంటి సమయంలో దేశాన్ని సరియైన దిశవైపు నడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలకు ఆధారం వేదాలు. వేదాల్లోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించడం కోసం 3 కొత్త దర్శనాలు వెలుగులోకి వచ్చాయి. 1. పతంజిల యోగ దర్శనం, 2. జైమిని మీమాంస దర్శనం, 3. బాదరాయణ వేదాంత దర్శనం.  Readable: మీ ఇంటికే ఫుడ్ - డయల్...   వేదాల్లోని కర్మకాండకు వ్యతిరేకంగా భగవాన్ శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. కర్మకాండపై భాగవత ధర్మం తిరుగుబాటు చేసింది. దేశంలోని సాంఘిక వ్యవస్థకు దెబ్బ  తాకకుండా ఇంద్రుడు మొదలైన దేవతల పూజలు మాన్పించాడు శ్రీకృష్ణుడు. వేదాల మీద, వైదిక వ్యవస్థ మీద సంపూర్ణ ఆదర భావం కూడా చూపించాడు. అక్కడి నుండి భాగవత ధర్మం యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. ఆ మూడు దర్శనాలతో కొత్తపుంతలు తొక్కించింది. బాదరాయణు

ఫేస్ బుక్-జియో బంధంతో ట్విట్టర్ కు కష్టకాలమేనా?

దేశీయ టెలికాం రంగానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న జియో టెలికాం పంచన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ చేరడంతో రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్  రూ. 43, 574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని జియో టెలికాంలోకి పంపింగ్ చేస్తోంది. జియోలో దాదాపు 10 శాతాన్ని ఫేస్ బుక్ వాటాగా పొందుతుంది. దీంతో ఫేస్ బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ కూడా జియో చేపట్టబోయే ఆపరేషన్స్ కి బాసటగా నిలుస్తాయి. టెలికాం విభాగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉన్న జియో.. తాజాగా డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. జియో మార్ట్ పేరుతో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన ధీరూబాయి అంబానీ తనయుడు... అతిత్వరలోనే ఫేస్ బుక్, వాట్సాప్ ల సహకారంతో ఆ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబోవడం ఖాయంగా మారింది. జియో మార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని మైక్రో లెవల్లోకి తీసుకెళ్లనున్నట్టు దాదాపు 6 నెలల క్రితమే ముఖేశ్ బయటపెట్టుకున్నారు. అది కాస్తా ఇప్పటికి రూపం దాల్చింది. ఫేస్ బుక్ కి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారుల వివరాలు, అలాగే వ్యక్తిగత సమాచారం కోసం వా