మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో పెరమిలి దళం కమాండర్ కోటె అభిలాష్ అలియాస్ చందర్, సోమా, శంకర్ అనే మావోయిస్ట్ మృతి చెందాడు. ఏటాపల్లి తాలుక హెడ్రీ పీయస్ పరిధిలోని యెలదుడమి అటవీ ప్రాంతంలో సి60 కమాండోలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో తెలంగాణ ములుగు జిల్లా కారపల్లి గ్రామానికి చెందిన అభిలాష్ అనే మావోయిస్టు మృతి చెందాడు. సోమ పై రూ. 8 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఒక తుపాకీ, వాకీటాకీలు, ప్రెసర్ కుక్కర్, 20 కిట్ బ్యాగులు, సామాగ్రి, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. సి60 కమాండోలను జిల్లా ఎస్పీ శైలేష్ బల్కావుడే అభినందించారు.
Comments
Post a Comment
Your Comments Please: