Skip to main content

ఆ లోగుట్టు ఒవైసీకే ఎరుక



ఏ దారెటు పోతుందో ఎవరికెరుక? ఆ దారి వేసినవారికి తప్ప. ఎవరెన్ని పరుగులు కొట్టారన్న కొలబద్దే మ్యాజిక్ ఫిగర్ ను శాసిస్తున్న నడుస్తున్న రాజకీయాల్లో ఏ పార్టీ ప్రయాణం ఏ దిశగా సాగుతుందని ఆలోచించే తీరుబడి గానీ, అవసరం గానీ అటు ప్రజలకైనా, ఇటు పార్టీలకైనా అక్కర్లేని మ్యాటరైపోయింది. బిహార్లో 5 సీట్లు అందుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే జోష్ పెంచుకున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) పార్టీని లైట్ తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆవేశం కన్నా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ముందుకెళ్తుండడం జాతీయ పార్టీలకు సైతం కనువిప్పు కావాల్సిన సందర్భం. బిహార్లో ఎంఐఎం సూపర్ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా ఈ మాటే చెప్పుకుంటున్నారు.

మొదట్నుంచీ యాంటీ బీజేపీ, యాంటీ నేషనలిస్ట్ పాలసీలతో ముందుకెళ్తున్న ఎంఐఎం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు బహుదూరం జరిగిపోయింది. మునుగుతున్న నావలో ఎవరైనా ఎంతకాలం కొనసాగుతారు? ఆ పార్టీ నేతలే రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగిన బీజేపీ గూటిలో చేరిపోతున్నారు. మరికొందరేమో ప్రాంతీయ పార్టీలతో కలిసిపోతున్నారు. అలాంటప్పుడు కేవలం సెక్యులరిజం, భావసారూప్యం అనే పనికిమాలిన భుజ కిరీటాలు తగిలించుకోవడం కోసం... కాలిపోతున్న కొంపలో ఎవరైనా నిద్రపోతారా? అందుకే 2019 ఎన్నికల్లోనే సొంతంగా పోటీ చేసి సత్తా చాటుకోవాలని అసద్ భావించారు. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న సీమాంచల్ మీద కన్నేశారు. అప్పుడు స్కోర్ కార్డు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడదే సొంతింటి పాత చింతచెట్టు బిహార్లో 5 కాయలు కాసింది. ఇదే విషయం నిన్నటి మిత్రుడైన కాంగ్రెస్ కు ఓ పట్టాన బుర్రకెక్కడం లేదు. మనం కోల్పోయిందేంటి? లోపం ఎక్కడ జరిగింది? సరిదిద్దుకోవడం ఎలా? అనే అర్థం కాని ప్రశ్నల చిక్కుముళ్లు కాంగ్రెస్ శిబిరంలోని సీనియర్లను బేజారెత్తిస్తున్నాయి.

ఇస్లామిక్ మతవాదానికి సెక్యులరిజం రంగేసి శెభాష్ అనిపించుకోవడంలో ఆరితేరిన అసదుద్దీన్ కు.. బీజేపీ పొడ ఎలాగూ గిట్టదు. కానీ కాంగ్రెస్ కు కూడా దూరమై పెద్ద సాహసమే చేశారు. అయితే సాహసమైనా చేస్తాను గానీ.. మనసు చంపుకొని సర్దుబాటు చేసుకోవడం తన వల్ల కాదనే ఒవైసీ... సింగిల్ గానే ఎన్నికల గోదాలోకి దిగారు. అయితే ఫక్తు మతవాద పార్టీ అయిన మజ్లిస్ సింగిల్ గా దిగితే ప్రజలు హర్షించరనేది ఒవైసీకి బాగా తెలుసు. దానికి దళిత, బహుజన, సెక్యులర్ అనే కలర్ ఫుల్ కాంబినేషన్ కావాలి. అందుకే బీఎస్పీ, సమాజ్ వాదీ జనతాదళ్ డెమొక్రటిక్ (ఎస్జేడీడీ), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ), సుహేల్దేవ్ భారతీయ సమతా పార్టీ (ఎస్బీఎస్పీ), జనవాదీ సోషలిస్ట్ పార్టీ (జేపీఎస్) వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎస్ఎఫ్) అనే ఉమ్మడి దుకాణం తెరిచారు. ఆ కూటమి నుంచి బీఎస్పీ ఒక్క సీటు, ఎంఐఎం 5 సీట్లు గెల్చుకుంటే మిగతావేవీ ఖాతా తెరవలేదు. వాటికంత సీన్ లేదన్న విషయం కూడా ఒవైసీకి బాగానే తెలుసు. ఆయనకు కావాల్సింది తన సీట్ల సంఖ్య... తనకంటూ చెప్పుకోవడానికి ఓ సెక్యులర్ ఇమేజ్. సరిగ్గా ఈ దిశగానే ఒవైసీ ప్రయాణం సాగుతుందన్న విషయం.. ఎంఐఎం అధినేత కామెంట్లను, అప్పుడప్పుడూ వ్యక్తం చేసే అసహనాన్ని గమనిస్తే సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తో కలిసిపోతే సెక్యులర్ అనే ముద్ర ఉంటుందేమో తప్ప.. సీట్లు మాత్రం రావన్నది ఆయనకు కన్ఫామ్ అయిపోయింది. పైగా ఎప్పుడూ హిందూ వ్యతిరేక వైఖరిలో ముందుండే కాంగ్రెస్.. రామజన్మభూమి విషయంలో కొత్త స్టాండు తీసుకొని.. రామమందిరాన్ని స్వాగతించింది. అకస్మాత్తుగా కాంగ్రెస్ ఈ వైఖరి ఎందుకు ఎత్తుకుందో తెలియనంత అమాయకుడు కాదు అసద్. అధికారానికి దూరమై అల్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. అవసరమైతే మైనారిటీలను వదిలేసి మెజారిటీ పల్లవి అందుకుంటారని, భవిష్యత్తులో అదే జరిగితే మైనారిటీ వాయిస్ కు మెజారిటేరియన్ ప్లేస్ దక్కకుండా పోతుందని భయపడ్డారు. అందుకే ఎవరో ఒకరి ఊతంతో ఎన్నికల నదిని సింగిల్ గానే ఈదాలని డిసైడయ్యారు. మైనారిటీలు మెజారిటీగా ఉన్న సీమాంచల్ లో పోటీ చేశారు. 5 సీట్లు రాబట్టారు. జీడీఎస్ఎఫ్ కూటమిలో పెద్దన్నగా ఎదిగారు. అంతేకాదు.. ఇదే కూటమితో రేపు పశ్చిమబెంగాల్, యూపీ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసి జాతీయ పార్టీ అనిపించుకోవాలని తహతహలాడుతున్నారు.


ఇప్పుడందరి దృష్టీ అసదుద్దీన్ మీదే ఎందుకు ఫోకస్ అయిందంటే.. తన పంచె తాను సర్దుకుంటూ పక్కవాడి పంచె కూడా సర్దుతున్నట్టు కనిపించడంలో అసదుద్దీన్ అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచారు. బడుగులు, బలహీనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనే నినాదం ఎత్తుకుంటూనే తాను ఆధారపడింది మాత్రం పూర్తిగా మైనారిటీల ఓట్ల మీదనే. ఇంకా చెప్పాలంటే కేవలం ముస్లింల ఓట్ల మీదనే అనేది నిర్వివాదాంశం. అంటే ముస్లింల ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాక దాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో అసద్ భాయి చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారు. మొదట్నుంచీ మైనారిటీల కోసమే పుట్టి, మైనారిటీల కోసమే పనిచేస్తున్న పార్టీ... మెజారిటీ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను పట్టించుకుంటుందా? సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా, విదేశీ ముస్లింలు, అక్రమ చొరబాటుదార్లకైనా పౌరసత్వం నిరాకరించరాదంటూ దేశవ్యాప్త ఉద్యమాల్లో పాల్గొన్న ఎంఐఎం.. ఎప్పుడైనా హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల విషయంలో పల్లెత్తు మాట మాట్లాడిందా? అక్కడిదాకా ఎందుకు? ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ గానీ, ఆయన పార్టీ మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ గానీ నేరుగా హిందువులనే బెదిరించినప్పుడైనా, ఇంకా దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన ముస్లిం నాయకుల విషయంలోనైనా ఒవైసీ మాట్లాడారా? కనీసం మాటవరుసకైనా ఖండించాలని ఆయనకు అనిపించిందా? అంటే అర్థమేంటి? ఎంఐఎం ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? ఏ శక్తులను ఎందుకోసం కలుపుకుంటోంది? ఆయనకుండే మైనారిటీ ఓట్ల పాజిటివ్ స్ట్రెంగ్త్ ఆయన కూటమిలోని ఇతర పార్టీలకు ఉంటుందా? ఎంఐఎం ఏ దిశగా ప్రయాణిస్తుందో చూచాయగా చెబుతున్న బిహార్ ఫలితాలే రేపటి రాజకీయ సమీకరణాలను శాసించబోతున్న బిట్టర్ ఫ్యాక్టర్.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత