Skip to main content

"కరోనాతో సహజీవనమే పరిష్కారం"


శత్రువును తుదముట్టించడం సాధ్యం కానప్పుడు లేదా శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు రాజీ మార్గమే పరిష్కారమనేది మన ప్రాచీన రాజనీతి. అదే సూత్రం యుద్ధనీతికీ వర్తిస్తుంది. రెండువర్గాలు ఎదురుబొదురు కూర్చొని ఏదోకటి సెటిల్ చేసుకునే సందర్భంలో ఎవరో ఒకరు తగ్గడం, ఇంకొకరు మొగ్గడం సాధారణమే. అయితే యుద్ధం మొదలై శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు ఆ శత్రువును కూడా చికాకు పరచకుండా కొంత సానుకూల వాతావరణం, కొంత అనుకూలమైన ప్రదేశం కల్పించి తనకు ఇబ్బంది రాకుండా చూస్తే శత్రువు దృష్టి మళ్లించినవాళ్లమవుతాం. తన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది రాకుండా చూస్తే మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు. అంటే ఒకరిని ఒకరు ఇబ్బందిపెట్టకుండా ఉండడం లేదా ఒకరికొకరు భయంతో కూడిన గౌరవ, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అన్నమాట. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పించారు. రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చూచాయగా చెప్పారు. తాము కోవిడ్-19 ని ఎదుర్కోవాలని నిశ్చయించామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చి ప్రకటించారు కేజ్రీవాల్. కరోనాను పూర్తిగా తుడిచేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, అప్పటిదాకా మనం ఇళ్లకే పరిమితమైతే జరగబోయే నష్టాన్ని ఊహించలేమన్నారు. అందుకని మధ్యేమార్గంగా.. కరోనాతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పడం విశేషం. అంటే సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్స్ వినియోగించడం, పని ప్రదేశాల్లో కేంద్రం నిర్దేశించిన నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించడం..  ఇలాంటివన్నమాట. అంతేకాదు.. కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ ను మరో రెండువారాలు పొడిగించడం విశేషం. అటు కేసులు పెరగడంతో కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. వాటి పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే నిబంధనలు పాటిస్తూనే.. ప్రొడక్షన్ ను మొదలు పెట్టడానికి ఉన్న అనువైన మార్గాల అన్వేషణలో పడ్డారన్నమాట. 


ప్రజల్ని ఎక్కువకాలం ఒకేచోట నిలిపి ఉంచడం సాధ్యం  కాదంటున్న కేజ్రీవాల్.. జోన్లవారీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. వ్యవసాయాన్ని, ప్రైవేటు పరిశ్రమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 33 శాతం వర్క్ ఫోర్స్ తో ప్రైవేటు కంపెనీలు పని చేయడానికి అనుమతిస్తామన్నారు. అలాగే వ్యవసాయరంగానికీ మినహాయింపులు ఇస్తామన్నారు. ప్రజారవాణాను కూడా షరతులకు  లోబడి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. ఫోర్ వీలర్స్ లో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే, టూ వీలర్ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించే నిబంధనలు కఠినంగా అమలు చేస్తామన్నారు. 


మొత్తానికి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నా కూడా ప్రజాజీవనానికి బ్రేకులు పడకుండా ఉండే మార్గాల్ని కేజ్రీవాల్ అమలు చేయబోతున్నారు. ఎందుకంటే ఢిల్లీలాంటి కాస్మొపాలిటన్ సిటీల్లో జనమంతా ఇళ్లకే పరిమితమైతే ప్రభుత్వ పాలన స్తంభించిపోవడం ఖాయం. రూ. 3200 కోట్ల నష్టం వాటిల్లిందంటూ కేజ్రీవాల్ ఓ ఉదాహరణగా చెప్పడాన్ని అర్థం చేసుకోవాలి. 


అటు మహారాష్ట్రలో పలు ప్రైవేటు కంపెనీలు చాలా జాగ్రత్తలు పాటిస్తూ పరిశ్రమలు తెరుస్తున్నాయి. ఇదే బాటలో మిగతా రాష్ట్రాలు కూడా కొనసాగే అవకాశాలు త్వరలోనే రావచ్చు. అయితే దీనికి బలమైన ప్రజా సంకల్పం ఉంటే తప్ప విజయవంతం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వాలు కూడా నిబంధనల అమలులో స్ట్రిక్టుగా ఉంటూనే ఉత్పత్తి వ్యూహాలు ప్రారంభించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 




 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత