కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మరో దఫా లాక్ డౌన్ మరింత పకడ్బందీగా విధించడం తప్ప మార్గం లేదని అనేక వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం మీద అటు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ప్రచారం సాగుతోంది. మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదని, కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతన్న క్రమంలో లాక్ డౌనే శరణ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కేంద్రం కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా చర్చిస్తోందని, జూన్ 15 తరువాత గానీ, కాస్త అటుఇటుగా గానీ లాక్ డౌన్ విధించడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రం ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మరో దఫా సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు పుకార్లేనని తేల్చినట్లయింది.
ఆందోళనకరంగా కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజుకు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 276583కి చేరింది. మరో 279 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7745కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 5991 మంది కోలుకున్నారు. అందువల్ల కోలుకున్న వారి సంఖ్య 1,35,205కి చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఐదో స్థానంలో ఉంది.
Comments
Post a Comment
Your Comments Please: