ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉదయమే దాదాపు 20 మంది పోలీసులు అర్నాబ్ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా అరెస్టు చేశారు. వారెంటుగానీ, నోటీసులు గానీ ఏమీ లేకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అర్నాబ్ పై పోలీసులు దాడి కూడా చేశారు. ఆయన కుమారుడి పైనా దాడికి దిగారు. ఆ తరువాత రాయ్గడ్ కు తరలించారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు.
ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారు. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్గడ్కు తీసుకెళ్లారని ఆ టీవీ పేర్కొంది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది.
జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు
ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అర్నాబ్ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు, కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి దిగారని ఆమె ఆరోపించారు.
Comments
Post a Comment
Your Comments Please: