Skip to main content

న గల్లీ తుమ్హారా.. న ఢిల్లీ తుమ్హారా..

ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో  ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా. 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీయేను దెబ్బ కొట్టేందుకు అక్కడ ఓ వారం రోజులపాటు ఠికానా వేసి శాయశక్తులా ప్రయత్నించి విఫలమైంది. అటువంటి బలుపును తగ్గించేందుకే మోడీ-షా కనుసన్నల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముంబైలో కాలు మోపారు. పలువురు బాలీవుడ్ పెద్దలతో భేటీ అయి చర్చించారు. బాలీవుడ్ కి దీటుగా యూపీలో ఇండస్ట్రీ తయారయ్యేందుకు తాయిలాలు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ యహా సే బాలీవుడ్ కో కోయీ నహీ లే జా సక్తా... అని అక్కసు వెళ్లగక్కాల్సి వచ్చింది. 

ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నప్పుడు.. బండి సంజయ్ ని, తెలంగాణ పర్యటించబోతున్న ఉత్తరాది నాయకుల టూర్ ను దృష్టిలో పెట్టుకొని.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మా హైదరాబాద్ ల మీ లొల్లేందిర బై అని అనడాన్ని గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ లో పుట్టి పెరిగినంత మాత్రాన మేం ఏం చేసినా చల్తా హై అనే యాటిట్యూడ్ ను ఏ విధంగా సమర్థించుకుంటారు? హైదరాబాద్ మీదైతే మీరేం చేసినా ఓకేనా? మీకు అవగాహన ఉన్నవారితో చీకటి ఒప్పందాలు చేసుకొని రాజ్యమేలుతామంటే ప్రజలకు ఓకేనా? ఈ వైఖరే మంచిది కాదు. హైదరాబాద్ లో పాదుకొని ఉన్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సర్కారు చెప్పినట్టు వింటారు.. మాదకద్రవ్యాల ఆరోపణల కేసును కూడా నీరుగార్చినా ఎవరేం మాట్లాడొద్దు.. వారు ఇక్కడే ఉండటానికి ఏమైనా చేస్తాం.. మేం చెప్పినట్టే వారు వింటారు.. వినాల్సిందే... అనే వైఖరి ఇక్కడ తెలంగాణ సర్కారులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 


రామోజీరావు ఫిల్మ్ సిటీ కి ప్రత్యామ్నాయంగా రాచకొండ గుట్టల మీద సువిశాలమైన భూమిలో ప్రపంచం నివ్వెరపోయే ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గర్వంగా ప్రకటించారు. అందరూ సంతోషించారు. చాలా మంది పేదలకు, తెలంగాణలో ఉన్న సినిమా ప్రియులకు మంచిరోజులు వచ్చాయని అంతా సంతోషించారు. కానీ అలాంటిదేదీ జరగలేదు. ఇక్కడివారు ఏపీకి వెళ్లలేదు. వెళ్లాలన్న ఆలోచన కూడా వారికి లేదు. ఇదే అదనుగా ఇక్కడే ఉన్న సినీ ప్రముఖులను ఎలా మేనేజ్ చేయాలో, వారితో ఎలా రాజకీయ ప్రయోజనాలు పొందాలో మాత్రం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా పని చేసుకుపోతున్నారు. 

Also Read: గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

                    గీ పట్నపోల్లకు ఏమైంది?

అయితే ముంబైలో పాతుకుపోయిన బాలీవుడ్ కీ-పర్సన్స్ ఒకవేళ నిజంగా యూపీకి తరలిపోతే.. తెలంగాణలో పాతుకుపోయిన టాలీవుడ్ కీ-పర్సన్స్ కూడా ఎక్కడికీ పోరని, లేక ఇక్కడే ఉంటారన్న గ్యారెంటీ ఏంటి? ఉండాలన్న కన్సర్న్ ఏంటి? శివసేన-కాంగ్రెస్ అవగాహనతో ఏమైనా చేద్దాం అనుకొని పథకరచన చేసుకున్నాయి. ఇక్కడా అలాంటిదే జరిగింది... జరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ ఆ ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తోంది. ఇక్కడ కూడా అదే బీజేపీ ఈ ఇద్దరినీ డిస్టర్బ్ చేయడం చూస్తూనే ఉన్నాం. మరి.. సొంతమని తెగ ఇదైపోతూ ఫీలైపోతున్న సొంత ఇలాకాలోకి ఇతరులు రాకుండా అడ్డుకునేదెవరు? రమ్మని తలుపులు తెరవాల్సిందెవరు? ఎవరి పని వారు చేసుకుపోవడమే రాజకీయ క్రీడ. ఆట ఇప్పుడు అంతటా మొదలవుతోంది. బీ కేర్‍ఫుల్. 


Comments

Popular posts from this blog

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.