ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు ఉన్నారని, వారిలో 4561 మందికి వేలుముద్రలు, ఐరిస్ సేకరించామని, ఎన్నికల తరువాత 274 మంది వివరాలు సేకరిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఎంతమంది ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ వోటర్ ఐడీస్, కొందరైతే బ్యాంక్ అకౌంట్లు కూడా కలిగి ఉన్నారని స్వయంగా ప్రకటించారు.
ఈ మధ్య ఏం జరిగిందో ఎవరైనా ఊహించుకోవచ్చు. గత ఫిబ్రవరిలో తాము రోహింగ్యాలను గానీ, అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ పౌరుల్ని, బంగ్లాదేశీయులను గానీ.. ఎవరినీ ఇక్కణ్నుంచి పంపించే ప్రశ్నే లేదని.. వారికి అన్ని సౌకర్యాలూ దగ్గరుండి చూసుకుంటామని, కేసీఆర్ రోహింగ్యాలను ఆదరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ చెప్పడం అప్పట్లో తీవ్రమైన విమర్శలకు తావిచ్చింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు అవసరమైతే తెలంగాణ మంత్రి, ఒవైసీతో కలిసి రోహింగ్యాలకు భరోసా ఇచ్చేందుకు సభ నిర్వహిస్తామని గాంధీ బాహాటంగా ప్రకటించారు.
అయితే నేషనల్ లెవల్ ఇష్యూ అయిన అక్రమ రోహింగ్యాలను దేశం కళ్లుకప్పి హైదరాబాద్ లో దాచిపెడతామన్న ధీమాతో ఉన్న కేసీఆర్ కాస్తా... ఇప్పుడు ఎన్నికల్లో సీన్ టిపికల్ గా మారుతుండడంతో తమ ప్రభుత్వం నిమిత్తమాత్రంగా ఉందని, చాలా క్లీన్ గా ఉన్నామని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడడం వల్లే సీపీ రంగంలోకి దిగి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. మరోవైపు 2 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే హుంకరించడం, వారితో పొత్తు లేదని కేటీఆర్ సన్నాయినొక్కులు నొక్కడం, దానికి అక్బరుద్దీన్ కూడా అదే లెవల్లో ఘాటుగా రియాక్టు కావడం.... ఈ సర్కస్ ఫీట్లు చూస్తుంటే.... రోహింగ్యాలతో తమకు ప్రమేయం లేదని చెప్పేందుకే కొత్త స్కెచ్ వేశారా అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ జరిగిన నష్టం ఎంతనేది ఈనెల 4న చూడాల్సిందే.
Read: గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?
Read: కేసీఆర్ ఎదుర్కోబోయే ప్రమాదాన్ని ముందే చెప్పిన...
Note: రాచకొండ సీపీ ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు
Comments
Post a Comment
Your Comments Please: