Skip to main content

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్". 

Also Read: ఆవు పేడతో చెప్పుల తయారీ






1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఇదంతా ‘కేవలం యుద్ధం’ ద్వారానే జరగడం గమనార్హం. తూర్పు పాకిస్తాన్ విముక్తి కోసం జరిగిన యుద్ధమే ప్రపంచ పటం మీద బంగ్లాదేశ్ అనే కొత్త దేశానికి ఊపిరి పోసింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ అనే కోడ్ భాషతో సైనిక సంఘర్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలించింది. భారతదేశాన్ని ప్రపంచ సైనిక పటంలో నిలిపిన యుద్ధం కూడా ఇదే. ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరుతో బంగ్లాదేశ్‌లో పాక్ యోజనాబద్దంగా జరిపిన మారణహోమంగా చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు.. పాక్ దుర్నీతి ఎలాంటిదో ప్రపంచానికి ఆనాడే మరోసారి చాటిచెప్పిన వార్ కూడా ఇదే. మెజారిటీ హిందూ ప్రజలున్న ఢాకాపై పాక్ సేనలు విరుచుకుపడ్డాయి. రాబర్ట్ పేన్ అనే అమెరికన్ జర్నలిస్టు..  ఆనాడు ఏడు వేల మంది ప్రజలు పాక్ సేనల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారన్నాడు.  పాకిస్తాన్ సైన్యం వారి తొత్తులైన రజాకార్ల వల్ల ఇంకెందరో అమాయకులు ఈ మారణహోమంలో బలయ్యారు. అంతేకాదు.. పాక్ మిలిటరీ దాదాపు 4 లక్షల మంది మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు చరిత్రలో రికార్డయింది. ఈ మారణహోమం కారణంగా ఆనాడే కోటి మంది బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్ కు పారివచ్చారు. ఈ శరణార్థులలో ఎక్కువ మంది హిందువులే కావడం గమనించాల్సిన అంశం. ఢాకాలోని హిందువుల భూములను స్వాధీనం చేసుకుని ముస్లింలకు బహుమతిగా ఇవ్వడం ద్వారా బెంగాలీ రైతులను శాంతింపజేయగలమని కుట్ర పన్నారు పాక్ పాలకులు. ఇది రైతాంగాన్ని ఆకట్టుకోలేదు.. సరికదా.. శరణార్థులు వరదలా వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఫలితంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శరణార్థుల సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు పడింది. ఈ అపారమైన భారాన్ని భారత ప్రభుత్వమే స్వీకరించింది. 


మరోవైపు భారత దళాలు పాకిస్తాన్ పై పూర్తి స్థాయిలో దాడి చేశాయి. ఇందులో భారత త్రివిధదళాలు అన్ని వైపుల నుండి పాకిస్తాన్ పై భారీ సమన్వయంతో ఏకకాలంలో భూమి, సముద్రం, ఆకాశ మార్గాల్లో దాడులు చేశాయి. ఈ యుద్ధంలో భారతదేశం ముందు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి.. తూర్పువైపు ఢాకాను కాపాడటం, రెండు.. పశ్చిమం వైపు పాకిస్తాన్ భారత్ భూభాగంలో అడుగు పెట్టకుండా నిరోధించడం. 1971 లో పాకిస్తాన్ సృష్టించిన సంక్షోభానికి భారతదేశం చక్కని సైనిక పాటవంతో  విజయవంతమైన ముగింపునిచ్చింది. 1971 యుద్ధంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పూర్తి  ప్రణాళికబద్దంగా సాక్ష్యాధార సహితంగా మన వీరులు యుద్ధాన్ని నడపడమే. 16 డిసెంబర్ 1971 న పాకిస్తాన్ సైన్యం ఢాకాలోని రామ్నా కోర్సులో లొంగిపోయింది. దీన్నే భారతదేశంలో విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతిపెద్ద లొంగుబాటుచర్య ఇదే కావడం విశేషం. సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు, పారా మిలిటరీ సైనికులు ఇతర జవాన్లు భారత్ కు లొంగిపోయారు.  1971 యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా స్వాతంత్ర్యం పొందింది. పశ్చిమంలో  స్వాధీనం చేసుకున్నసుమారు 5,795 చదరపు మైళ్ల భూమిని భారత దళాలు సిమ్లా ఒప్పందం తరువాత సద్భావనతో తిరిగి పాకిస్తానుకు ఇచ్చాయి.


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?