Skip to main content

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్". 

Also Read: ఆవు పేడతో చెప్పుల తయారీ






1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఇదంతా ‘కేవలం యుద్ధం’ ద్వారానే జరగడం గమనార్హం. తూర్పు పాకిస్తాన్ విముక్తి కోసం జరిగిన యుద్ధమే ప్రపంచ పటం మీద బంగ్లాదేశ్ అనే కొత్త దేశానికి ఊపిరి పోసింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ అనే కోడ్ భాషతో సైనిక సంఘర్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలించింది. భారతదేశాన్ని ప్రపంచ సైనిక పటంలో నిలిపిన యుద్ధం కూడా ఇదే. ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరుతో బంగ్లాదేశ్‌లో పాక్ యోజనాబద్దంగా జరిపిన మారణహోమంగా చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు.. పాక్ దుర్నీతి ఎలాంటిదో ప్రపంచానికి ఆనాడే మరోసారి చాటిచెప్పిన వార్ కూడా ఇదే. మెజారిటీ హిందూ ప్రజలున్న ఢాకాపై పాక్ సేనలు విరుచుకుపడ్డాయి. రాబర్ట్ పేన్ అనే అమెరికన్ జర్నలిస్టు..  ఆనాడు ఏడు వేల మంది ప్రజలు పాక్ సేనల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారన్నాడు.  పాకిస్తాన్ సైన్యం వారి తొత్తులైన రజాకార్ల వల్ల ఇంకెందరో అమాయకులు ఈ మారణహోమంలో బలయ్యారు. అంతేకాదు.. పాక్ మిలిటరీ దాదాపు 4 లక్షల మంది మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు చరిత్రలో రికార్డయింది. ఈ మారణహోమం కారణంగా ఆనాడే కోటి మంది బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్ కు పారివచ్చారు. ఈ శరణార్థులలో ఎక్కువ మంది హిందువులే కావడం గమనించాల్సిన అంశం. ఢాకాలోని హిందువుల భూములను స్వాధీనం చేసుకుని ముస్లింలకు బహుమతిగా ఇవ్వడం ద్వారా బెంగాలీ రైతులను శాంతింపజేయగలమని కుట్ర పన్నారు పాక్ పాలకులు. ఇది రైతాంగాన్ని ఆకట్టుకోలేదు.. సరికదా.. శరణార్థులు వరదలా వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఫలితంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శరణార్థుల సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు పడింది. ఈ అపారమైన భారాన్ని భారత ప్రభుత్వమే స్వీకరించింది. 


మరోవైపు భారత దళాలు పాకిస్తాన్ పై పూర్తి స్థాయిలో దాడి చేశాయి. ఇందులో భారత త్రివిధదళాలు అన్ని వైపుల నుండి పాకిస్తాన్ పై భారీ సమన్వయంతో ఏకకాలంలో భూమి, సముద్రం, ఆకాశ మార్గాల్లో దాడులు చేశాయి. ఈ యుద్ధంలో భారతదేశం ముందు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి.. తూర్పువైపు ఢాకాను కాపాడటం, రెండు.. పశ్చిమం వైపు పాకిస్తాన్ భారత్ భూభాగంలో అడుగు పెట్టకుండా నిరోధించడం. 1971 లో పాకిస్తాన్ సృష్టించిన సంక్షోభానికి భారతదేశం చక్కని సైనిక పాటవంతో  విజయవంతమైన ముగింపునిచ్చింది. 1971 యుద్ధంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పూర్తి  ప్రణాళికబద్దంగా సాక్ష్యాధార సహితంగా మన వీరులు యుద్ధాన్ని నడపడమే. 16 డిసెంబర్ 1971 న పాకిస్తాన్ సైన్యం ఢాకాలోని రామ్నా కోర్సులో లొంగిపోయింది. దీన్నే భారతదేశంలో విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతిపెద్ద లొంగుబాటుచర్య ఇదే కావడం విశేషం. సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు, పారా మిలిటరీ సైనికులు ఇతర జవాన్లు భారత్ కు లొంగిపోయారు.  1971 యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా స్వాతంత్ర్యం పొందింది. పశ్చిమంలో  స్వాధీనం చేసుకున్నసుమారు 5,795 చదరపు మైళ్ల భూమిని భారత దళాలు సిమ్లా ఒప్పందం తరువాత సద్భావనతో తిరిగి పాకిస్తానుకు ఇచ్చాయి.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత