Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

హైదరాబాద్ పోలింగ్ - హై టెన్షన్

గ్రేటర్ ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ కన్నా టెన్షన్ వాతావరణం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. పలు చోట్ల అధికార, విపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇంకొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది మీద కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సనత్ నగర్ పోలింగ్ స్టేషన్ లోని బూత్ నెంబర్ 13లో ఓటేయడానికి వచ్చిన ఓటర్లతో గుర్తు గుర్తుంది కదా.. మర్చిపోకండి అంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్న సిబ్బందిని క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు నిలదీశారు. సిబ్బంది మీద కంప్లయింట్ చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మాదాపూర్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ రెండు పార్టీల మధ్య అక్కడ ఘర్షణ నెలకొంది. చాదర్ ఘాట్ లో ఆరు ఆటోల్లో బోగస్ ఓటర్లను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఎంబీటీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓల్డ్ మలక్ పేటలోని బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు అచ్చవడంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేశారు. 3వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్న

గ్రేటర్ పోల్: ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్

డిసెంబర్ 1న జ‌రిగే జీహెచ్ఎంసీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260:  పురుషులు 38,76,688, స్త్రీలు 35,65 896, ఇతరులు 676 మొత్తం వార్డుల సంఖ్య 150 పోటీ చేసే అభ్యర్థులు 1122:      టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149,  కాంగ్రెస్ 146,  టి.డి.పి 106,  ఎం.ఐ.ఎం 51,  సి.పి.ఐ 17,  సి.పి.ఎం 12,  రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76,  స్వతంత్రులు 415 ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య  60,  స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్ ల సంఖ్య 30 పోలింగ్ సిబ్బంది 48,000 రిటర్నింగ్ అధికారులు 150 సహాయ రిటర్నింగ్ అధికారులు 150 సాధారణ పరిశీలకులు 14 వ్యయ పరిశీలకులు 34 మైక్రో అబ్జర్వర్ లు 1729, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2277 మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683 పోస్టల్ బ్యాలెట్లకై అందిన దరఖాస్తులు 2831 డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. 6 గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి. ఉ. 6 నుండి 6:15 మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది. ఉ. 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయ‌డం జ‌రుగుతుంది.  ఉ. 7గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం. సా. 6గంట‌ల‌కు పోలింగ్ పూర

వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్ లైన్ టికెట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రోజు 20 వేల టిక్కెట్లను జారీ చేస్తామని చెప్పారు. Readable:   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సర్వేలు ఏం చెబుతున్నాయి?                          హైదరాబాద్ లో రోహింగ్యాలు.. కన్ఫామ్

గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

గ్రేటర్ ఎన్నికలు జాతీయ అంశంగా మారడంతో అందరి దృష్టీ హైదరాబాద్ మీదనే పడింది. ఎవరు గెలుస్తారు.. ఎవరు గ్రేటర్ పీఠాన్ని ఏలుతారు.. అనేది అందరి మదనీ తొలుస్తున్న అంశం. అందరికన్నా ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, దాని మిత్రుడైన ఎంఐఎం కు మరింత అవసరమైన సబ్జెక్టు. దీని మీద గ్రౌండ్ సర్వేలు కూడా పలు ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. నవంబర్ మొదటి నుంచి ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో పనిచేసి రిపోర్టులను రికార్డు చేస్తున్నాయి. రాజకీయ వ్యాఖ్యానాలు, వేడి పుట్టించే కామెంట్లు వాతావరణాన్ని గంభీరంగా మారుస్తూ... ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సంస్థల రిపోర్టులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు.  Also Read:  రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?                          ఒవైసీలతో స్నేహం కేసీఆర్ కు సవాలేనా? ఈ వీడియోలో ఇంకా పూర్తి వివరాలు, విశ్లేషణ ఉన్నాయి. చూడండి.  

రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

హైదరాబాద్ లో రోహింగ్యాల అంశం మరోసారి పెద్ద దుమారమే రేపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి వారి సంఖ్య ఎంతుందో హడావుడిగా ప్రకటించాల్సి రావడమే.. కేసీఆర్ సర్కారులో కలవరం ఏ స్థాయిలో రేగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‍లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల మీద, పాకిస్తాన్, బంగ్లాదేశీ చొరబాటుదార్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలెంజ్ చేయడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ తో ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రులు ఉలిక్కిపడ్డారు. అయితే ఉలికిపాటు బయటికి కనిపించనీయకుండా.. అసలు రోహింగ్యాలు కేంద్రం పరిధిలోని అంశం... దానికి రాష్ట్రంతో సంబంధమేంటని కేటీఆర్ బంతిని అవతలికి తోసేయగా.. మిత్రుడైన అసదుద్దీన్ రోహింగ్యాలకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల్లాంటివి ఒక్కటన్నా ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు ఉన్

మాదిగ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‍లో ఒత్తిడి తేవాలి

మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం అమరులైనవారికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు ఉడతా భక్తిగా సాయం చేసి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, అమరవీరుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు వాతావరణం అనుకూలిస్తున్నదని, సుప్రీంకోర్టు ఈమధ్య రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చని చెప్పడం శుభ పరిణామమని ఇటుక రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి డ్రాప్టింగ్ కమిటికి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన దర్మాసనం.. వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఎస్సీల్లో 108 కులాలు ఉన్నాయని కొన్ని కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని, వర్గీకరణ జరిగితే కింది కులాలకు కూడా ఫలాలు అందుతాయని రాజు ఆకాంక్షించారు.  జనాభా నిష్పత్తి ప్రకారం కులాలకు రిజర్వేషన్ల పంపిణీ జరగాలని డాక

గద్గద స్వరంతో మాట్లాడిన గౌడ్‍సాబ్: ఏమన్నాడంటే..

తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ ను తెలంగాణ పౌరులకు, ముఖ్యంగా ఉద్యమంతో ఏ కాస్త సంబంధం ఉన్నవారికైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన స్వామిగౌడ్... తాజాగా ప్రెస్ మీట్ లో మనసువిప్పి మాట్లాడారు. పార్టీలో తనకు జరిగిన అవమానం నుంచి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్.. ఎంఐఎంతో రాజీపడిపోయి వ్యవహరిస్తుండడం వరకు అనేక అంశాలను మీడియాతో ఖుల్లంఖుల్లా పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన గొంతు తడబడటం గమనించాల్సిన అంశం. అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినట్లయిందని.. తాను చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అంశాన్ని గుర్తు చేసుకోవడం విశేషం.  స్వామిగౌడ్ లేవనెత్తిన అంశాలు: 1) తెలంగాణ ఉద్యమంలో గజ్జె కట్టి పాటపాడిన కళాకారులు ఎక్కడ? 2) వలస పాలకుల దమననీతికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పనిచేసిన పాత్రికేయుల జాడెక్కడ? 3) తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని కష్టనష్టాలకోర్చిన ఉద్యమకారులు ఇప్పుడెక్కడ ఉన్నారు? 4) ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తిని తీర్చిండి. వారిని పిలిచి ఎందుకు మాట్లాడడం లేదు? 5) నా నియోజకవర్గంలో,

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు మోక్షం ఎప్పుడు?

- కేటీఆర్‍కు టీయూడబ్ల్యూజే వినతిపత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం మరోసారి తెరమీదికొచ్చింది. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు మోక్షం లభించేది ఎప్పుడని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటిషన్లు దాఖలైన సందర్భాల్లో వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం... జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం కోర్టు సాకుతో కాలయాపన చేయడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అభిప్రాయపడింది. మంత్రి కె.తారకరామారావుతో  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన "మీట్-ది-ప్రెస్" కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోవడం విచారకరమన్నారు. మూడేళ్ళుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో తిరస్కరణకు గురవుతుండడంతో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మరెందరో అప్పులు చేసి చికిత్స పొందినట్లు విరాహత్

అనతికాలంలోనే రూ. 2600 కోట్ల టర్నోవర్

హైదరాబాద్ సరూర్ నగర్ సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ టర్నోవర్ రూ. 2600 కోట్లు దాటిందని ఆ సొసైటీ ఎమ్మెస్సార్వీ ప్రసాద్ తెలిపారు. 23 ఏళ్లుగా ప్రజల మన్ననలు అందుకుంటూ సంస్థ దినదినం అభివృద్ధి చెందుతూ ఉందని, వారి విశ్వాసంతో తమ సంస్థ ఇంకా ఎదుగుతుందని ఆకాంక్షించారు. 23 వ సర్వసభ్య సమావేశం కూకట్ పల్లిలోని ఎన్.ఆర్.సీ గార్డెన్ లో జరిగిన సందర్భంగా కస్టమర్ల మన్నన చూరగొనడం తమ అదృష్టమన్నారు ప్రసాద్. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సమావేశం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాసిరెడ్డి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. M.S.R.V ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్ జె.సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.    

దుబ్బాకలో కారు ఖరారు: ఆరా సర్వే

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ పోల్ సర్వే ఏజెన్సీ ఆరా తాజాగా పోల్ రిజల్ట్స్ విడుదల చేసింది.  ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ 48.72 శాతం ఓట్లతో ముందంజలో ఉందని, ఆ తరువాత 44.64 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిందని తేల్చింది. ఇక కాంగ్రెస్ మాత్రం చాలా దారుణంగా 6.12 శాతం ఓట్లు మాత్రమే రాబట్టి మూడో స్థానానికి పరిమితమైందని అంచనా వేసింది. 2.52 శాతం ఓట్లను ఇతరులు రాబట్టుకుంటారని ఆరా అంచనా వేసింది.  ఈ నెల 10వ తేదీన దుబ్బాక బైపోల్ ఫలితాలు విడుదలవుతాయి. దీనికోసం టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

హైదరాబాద్ రెండో రాజధాని.. ఆంధ్రప్రభ కన్ఫర్మేషన్

మన దేశానికి ఇప్పటికైతే ఒకటే రాజధాని ఉంది. అది ఢిల్లీ. రెండో రాజధాని కూడా ఉందని, అది హైదరాబాదేనని ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ కన్ఫామ్ చేస్తోంది. గురువారం (29-10-2020) హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీ లోనే హైదరాబాద్ రెండో రాజధాని అంటూ కన్ఫామ్ చేసేసింది ఆ పేపర్ ఎడిటోరియల్ టీమ్. బుల్లెట్ ట్రెయిన్ ద్వారా "నాలుగు గంటల్లో ముంబైకి" అనే వార్తను హైలైట్ చేస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశ రెండో రాజధాని హైదరాబాద్ కు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చని, దీనిద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మరింత ఊపందుకుంటాయని ఓ మంచివార్తను ప్రజెంట్ చేశారు. కానీ.. దేశ రాజధానిగా హైదరాబాద్ ఎప్పుడైంది అనేదే అంతుపట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఎప్పుడు ప్రకటించింది? రాష్ట్రపతి ఏమైనా రాత్రికిరాత్రే ఉత్తర్వులిచ్చారా? లేదా పార్లమెంట్ తలుపులు మూసి రహస్యంగా ఏమైనా పని కానిచ్చేశారా? ఎందుకంటే అప్పట్లో తెలంగాణను పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు కదా.. అదే పద్ధతిలో ఇప్పుడు బీజేపీ నేతలు అవే ఎత్తుగడలేమైనా వేశారా? సామాన్య పాఠకుడికి ఇలా పరిపరివిధాలా ఆలోచనల

ప్రజల కోసం పని చేసేవారికి ఏ కార్పొరేట్ శక్తుల అండా అవసరం లేదు

ప్రజలకు సేవ చేయడానికి, సామాజిక అభ్యున్నతి కోసం పాటు పడడానికి, అందుకోసం రాజకీయ పార్టీలు నడపటానికి కార్పొరేట్ శక్తుల మద్దతు అవసరం లేదని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, యూపీలో కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీ పవర్ లోకి రావడానికి, 1984లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అధికారంలోకి రావడానికి ఏ కార్పొరేట్ శక్తి కూడా పని చేయలేదని, తొలినాళ్లలో ఎన్టీఆర్ కు ఆయన సొంత కులం వాళ్లే సహకరించలేదని చంద్రకుమార్ అన్నారు. మొక్కవోని దీక్ష, చిత్తశుద్ధి మాత్రమే ఏ నాయకుణ్నయినా, ఏ పార్టీనైనా ముందుకు నడిపిస్తాయన్నారు. ప్రజల కోసం చేసే నిస్వార్థపూరితమైన మంచిపని ఏదైనా ఎంతో ఆత్మతృప్తిని కలిగిస్తుందని, ఎంతో ఆనందాన్నిస్తుందని, అదే అన్నిటికన్నా విలువైందన్నారు. భావి సమాజాన్ని కాంక్షిస్తూ తాను రాసిన "మంచి మార్పు కోసం" అనే పుస్తకంతో పాటు సీడీని హైదారాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పలు సందర్భాల్లో చేసిన చిన్నపాటి తప్పిదాలు చరిత్రలో సరిదిద్దుకోలేని ఘోరాలుగా మారతాయని, 1948 న

జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలి

తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉన్నతాశయాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని హైదరాబాద్ ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పీజేఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి ఆకాంక్షించారు. నేటితరం విద్యార్థులు, యువకులు రేపటితరం యోగక్షేమాల కోసం పని చేసినప్పుడే ఆదర్శవంతమైన సమాజం సిద్ధిస్తుందని చేపూరి అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86 జన్మదిన వేడుకలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్ డివిజన్ తానాజీ నగర్ లో నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, సి అనీశ్ ఆచారి, తోట శ్రీనివాసాచారి, సి అభిషేక్ ఆచారి, వేణు, అశోక్, బొడ్డుపల్లి యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు. 

పోలీసు సహచరికి చివరి సలాం- పూర్తి ఫొటోలు

  ఆపదల్లో అప్రమత్తం చేసి, ప్రమాదాల నుంచి తప్పించి, విధుల్లో విజయాలు అందించి, మెడల్లో మెడల్స్ వేయించి.. అడుగడుగునా గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసిన ఆ పోలీసుల సహచరి వారి నుంచి శాశ్వతంగా దూరమైంది. చేతుల్లోనే పెరిగి, పెట్టింది తిని, అప్పజెప్పిన టాస్క్ ను అద్భుతంగా పూర్తి చేసిన లియో అనే స్నిఫ్ఫర్ డాగ్ అకాలంగా చనిపోవడంతో మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా ఏర్పడినప్పుడే జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్, జిల్లా కార్యాలయానికి నూతన సిబ్బందితో పాటు లియో అనే పోలీస్ జాగిలం కూడా పోలీసులతో పాటే అడుగు పెట్టింది. లియో పేరు చెపితే నిందితులకు, సంఘ విద్రోహులకు ముచ్చెమటలే. ఆ జాగిలం ప్రత్యేకతే వేరు. పోలీసులు ఛేదించలేని నేరాలు సైతం ఈ పోలీసు జాగిలం కనిపెడుతుందని గొప్పగా చెబుతున్నారు. లియో జిల్లాకు వచ్చిన్నటి నుంచి తన విధి నిర్వహణలో భాగంగా మేడారంలో ఏర్పాట్లు, సీఎం భద్రతా పర్యవేక్షణ విధులు, నేరస్తులను పట్టకోవడం... ఇలా తన పాత్ర భేషంటున్నారు పోలీసు అధికారులు. ఆర్మ్డ్ రిజర్వ్ లో పోలీసు ఉన్నతాధికారి అయిన డీఎస్పీ జనార్దన్ రెడ్డి... లియో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగింద

ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ - ఫొటోలు ఇవే

  ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అటు సమాంతరంగా అదే ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. సిర్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.  Read also: ఆ మావోయిస్టుపై రూ. 8 లక్షల రివార్డు డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా తుమిడిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్లా గ్రామ సమీపంలోని అడవుల్లో కూబింగ్ నిర్వహించింది. ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా... పలువురు తప్పించుకున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందినవారిలో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది.

భూ మాఫియా అవతారంలో కొందరు బీసీలు

    రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో ఒక భూవివాదంలో జరిగిన దాడి రెవిన్యూ విభాగంలోని అనేక చీకటి పార్శ్వాలను మరోసారి తెరమీదికి తెస్తోంది. మన దేశంలో, రాష్ట్రంలో పబ్లిక్ సర్వెంట్స్ కు ఉన్న స్వేచ్ఛ, ప్రత్యేకాధికారాలు ప్రజలకు లేవని మరోసారి రుజువైంది. ఫిర్యాదుదారులు ప్రజలే, బాధితులు కూడా ప్రజలే అవుతుండగా.. ఆ ఇద్దరి మధ్యా లేని వివాదాలు సృష్టించి, ఉన్న వివాదాలను పెంచి.. వారి మధ్య  వైషమ్యాలను శాశ్వతంగా పెంచి పోషిస్తున్నది స్వయంగా అధికారులేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అసమగ్రంగా ఉన్న భూ రికార్డులు, అసలు రికార్డులకే ఎక్కని భూములు, తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములను ఆసరా చేసుకొని కలిసి జీవించే ప్రజా వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     బాధితుడు మక్రోజు పరిపూర్ణాచారి కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ అనే గ్రామంలో తాతల కాలం నుంచి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నారు. శనివారం వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లిన పరిపూర్ణాచారికి అనుకోని దృశ్యం కనిపించింది. తన భూమిలో మరికొందరు వ్యక్తులు అదే భూమిలో పనులు

వీరగురుడికి విశ్వబ్రాహ్మల గురుపూజ

తెలుగునాట గురుపూజా ఉత్సవం ఘనంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు తమ నేపథ్యాన్ని అనుసరించి గురుపరంపరను స్మరించుకున్నారు. ఇక ఆధ్యాత్మికంగా తమదైన విలక్షణతకు ప్రఖ్యాతి గల విశ్వబ్రాహ్మలు.. విశ్వసృష్టిని రచించిన విశ్వకర్మ, ఆదిశంకరాచార్యుడు, జగద్గురువు వీరబ్రహ్మేంద్రస్వాములను స్మరించుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా అన్ని చోట్లా వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించి గురుపూజ నిర్వహించారు.    శేరిలింగంపల్లిలో మిషన్ విశ్వకర్మ లీడర్స్ వ్యవస్థాపకుడు ఆచార్య మాణిక్యం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఆచార్య మాణిక్యం విశ్వబ్రహ్మ జాతి తనదైన మూలాలు తెలుసుకొని పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని కోరారు. విశ్వబ్రాహ్మలు కేవలం ఆధ్యాత్మిక పథంతో పాటుగా వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవాలన్నా రు. విశ్వ గమనానికి, గమ్యానికి అవసరమైన అన్నీ ఎంతో జాగ్రత్తగా రచించి ఇచ్చిన విశ్వబ్రాహ్మలు ఇవాళ ఆకలితో అలమటించే పరిస్థితుల మీద పోరాడాలని, ఇందుకోసం కదిలివచ్చే నాయకత్వాన్ని సమర్థించాలని విజ్ఞప్తి చేశారు.  విశ్వబ్రాహ్మలు తలుచుకుంటే సాధ్యం కానిదేదీ

తాగేనీళ్లలో కాళ్లు కడుగుతున్నాడు-వీడియో

హైదరాబాద్, కూకట్ పల్లిలోని మూసాపేటకు చెందిన మంచినీళ్ల ట్యాంకర్ ఇది. ప్రజలకు మం..చి..నీ..ళ్లు సరఫరా చేయాల్సిన ఈ మున్సిపల్ ఉద్యోగి ఏం చేస్తున్నాడో ఈ వీడియోలో చూడండి. ఇలాంటివాళ్లను ఏం చేస్తే బాగుంటదో మీరే చెప్పండి. ప్రజలకు మంచినీళ్లు ఇచ్చేందుకు వాటర్ ట్యాంకర్ లో వాటర్ లోడింగ్  చేస్తుండగా.. అదే  ట్యాంకర్ లో ఏకంగా కాళ్లను కడుగుతున్నాడు. వందలాది మంది ఇదే నీటిని తాగి ప్రాణాలు నిలుపుకుంటున్న తరుణంలో.. తాను, తన కుటుంబం తాగడం లేదు కదా.. ఎవడెలా పోతే నాకేంటి.. అనే ఇలాంటి దుష్టబుద్ధులను దేవుడు కాదు.. అధికారులే శిక్షించాలి.   

కోవిడ్ వైద్య సేవలను ఇ.హెచ్.యస్ లో చేర్చాలి

కోవిడ్ వైద్యసేవలను ఈహెచ్ఎస్ లో చేర్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన విజ్ఞాపన పత్రం సమర్పించామని ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పద్మాచారి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో ప్రజల మధ్యన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు వైద్యసేవలను ఇ.హెచ్.ఎస్ క్రింద అందించాలని కోరినట్లు పద్మాచారి చెప్పారు. అలాగే కరోనా వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర టెంపరేచర్ రికార్డ్ చేయడం, మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించడం, సానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, ప్రతి వారం కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలని, ఉద్యోగులను రొటేషన్ పద్దతిలో కార్యాలయాలకు అనుమతించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాలు ప్రవేశ పెట్టడం ద్వారా

హరీశ్ రావు జబర్దస్త్ ఆన్సర్

  సిద్ధిపేట, జూలై 03:   కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలది గోబెల్స్ ప్రచారం అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. 80 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎగువకు నీళ్లు ఎత్తిపోసే ప్రాజెక్టు గొప్పదనాన్ని గుర్తించలేక, ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయం విజయవంతమైతే ఓర్చుకోలేక విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నమే తప్ప ప్రాజెక్టు ఔన్నత్యాన్ని గుర్తించే స్థితిలో లేరని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.  హరీశ్ రావు ఏమన్నారో.. పూర్తి వీడియోలో వినండి