Skip to main content

భూ మాఫియా అవతారంలో కొందరు బీసీలు

   

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ గ్రామంలో ఒక భూవివాదంలో జరిగిన దాడి రెవిన్యూ విభాగంలోని అనేక చీకటి పార్శ్వాలను మరోసారి తెరమీదికి తెస్తోంది. మన దేశంలో, రాష్ట్రంలో పబ్లిక్ సర్వెంట్స్ కు ఉన్న స్వేచ్ఛ, ప్రత్యేకాధికారాలు ప్రజలకు లేవని మరోసారి రుజువైంది. ఫిర్యాదుదారులు ప్రజలే, బాధితులు కూడా ప్రజలే అవుతుండగా.. ఆ ఇద్దరి మధ్యా లేని వివాదాలు సృష్టించి, ఉన్న వివాదాలను పెంచి.. వారి మధ్య  వైషమ్యాలను శాశ్వతంగా పెంచి పోషిస్తున్నది స్వయంగా అధికారులేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అసమగ్రంగా ఉన్న భూ రికార్డులు, అసలు రికార్డులకే ఎక్కని భూములు, తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూములను ఆసరా చేసుకొని కలిసి జీవించే ప్రజా వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

 


బాధితుడు మక్రోజు పరిపూర్ణాచారి కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్ అనే గ్రామంలో తాతల కాలం నుంచి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నారు. శనివారం వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లిన పరిపూర్ణాచారికి అనుకోని దృశ్యం కనిపించింది. తన భూమిలో మరికొందరు వ్యక్తులు అదే భూమిలో పనులు చేయడంతో ఇదేంటని ప్రశ్నించారు. ఈ భూమి తనకు పట్టా అయిపోయిందని, తామే కొన్నామని, అడగడానికి నువ్వెవరు.. నీ దగ్గర  ఏముందని అవతలి వ్యక్తులు ఎదురు ప్రశ్నించారు. ఇక్కడ మాటామాటా పెరిగి తోసుకోవడం, విచక్షణ రహితంగా దాడి చేయడం దాకా వెళ్లింది. బాధితుడు మక్రోజు పరిపూర్ణాచారి అయితే.. దాడి చేసిన వ్యక్తులు దళపతిగౌడ్, మల్లేశ్ గౌడ్, అంజయ్య గౌడ్, పల్లేటి రాములు గా పేర్కొంటూ తన మీద వారు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పరిపూర్ణాచారి పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దాడి జరిగిన వీడియో దృశ్యాలను బట్టి చూస్తే అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. 


బాధితుడు పరిపూర్ణాచారి


 

ఇంతకీ వివాదం ఏంటి?

 

పరిపూర్ణాచారి పూర్వీకులకు నిజాం జమానాలోనే దాదాపు 10 ఎకరాలు ఇనాంగా దక్కాయి. అప్పటి నుంచీ వారు సాగు చేసుకుంటూ, వంశపారంపర్యంగా వారే అనుభవిస్తూ వస్తున్నారు. విశ్వబ్రాహ్మల్లో ఉండే పేదరికం, అవగాహనా లేమి, రెవిన్యూ అధికారుల చేతివాటం, ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన నిర్లక్ష్యం వంటి అనేక కారణాల వల్ల దశాబ్దాలుగా వారు తమ పేరు మీద భూమిని పట్టా చేయించుకోలేదు. వంశపారంపర్యంగా దఖలుపడ్డ భూమిని ఎవరు ప్రశ్నిస్తారు అన్న భరోసానో లేక పట్టా చేయించుకునే స్తోమత లేకనో మొత్తానికి ఆ భూమి తమదేననే ధీమాతో ఉన్నారు. ఈ లోపు ఆ భూమికి చెందిన వీరి బంధువులకే కొందరు భూ బకాసురులు డబ్బు ఆశ చూపి.. పరిపూర్ణాచారి కుటుంబానికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పట్టా చేయించుకున్నారు. ఇందులో కీలకంగా పనిచేసినవారు స్థానిక ఎమ్మార్వోనే కావడం విశేషం. ఇటీవలే రిటైరైన ఎమ్మార్వో తన రిటైర్మెంట్ కు రెండు నెలల ముందే ఈ భూమిని పట్టా చేసి ఇచ్చి వెళ్లిపోయాడని తెలుస్తోంది. పట్టా కాగితాలు చేతికొచ్చాక, ఎమ్మార్వో రిటైర్ అయిపోయాక నిదానంగా భూమ్మీద పడ్డారు భూ రాక్షసులు. 

 

భూ మాఫియా అవతారాలెత్తుతున్న బీసీ బిడ్డలు

డబ్బెవరికి చేదు? అలాగే భూమి ఎవరికి చేదు? హైదరాబాద్ పరిసరాల్లో కోట్లు గుమ్మరిస్తున్న రియల్ వ్యాపారంతో ఏటికేడు కోటీశ్వరులుగా మారిపోవచ్చన్న అత్యాశ అన్నివర్గాల్లో పెరిగిపోయింది. అలాగే అన్ని సామాజికవర్గాలకు అందుబాటులో ఉండే బీసీల్లోని కొన్ని వర్గాలు కూడా ఇదే అదనుగా మాఫియా అవతారాలెత్తుతున్నాయి. దళపతిగౌడ్, మల్లేశ్ గౌడ్, అంజయ్య గౌడ్ అనే ఒకే కుటుంబానికి చెెందిన వ్యక్తులు పరిపూర్ణాచారి భూమ్మీద కన్నేయడం ఇదే అంశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆ ముగ్గురికి తోడు పల్లేటి రాములు అనే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఉన్నాడని బాధితులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారం, వారి అండను ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ కాని అంశాన్ని ఆసరా చేసుకొని, అదే పరిపూర్ణాచారి కుటుంబానికి చెందిన వ్యక్తులకు గాలం వేసి అతి చవక ధరకు భూమిని కొట్టేసే ప్లాన్ కు ఒడిగట్టారని పరిపూర్ణాచారి మాటల్ని బట్టి తెలుస్తోంది. కొంతమేర అడ్వాన్సుతో తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చన్న ఉద్దేశంతో చదువురాని పరిపూర్ణాచారి బంధువులు గౌడ్స్ బృందానికి రిజిస్ట్రేషన్ చేయించి పెట్టారు. పేపర్ చేతికి అందగానే భూబకాసురులు అసలురంగును చూపించారు.

 

పరిష్కారమేంటో బీసీ ఉద్యమ నేతలే చూపాలి

అణగారినవర్గాల హక్కులు, బీసీ ఉద్యమాలు అంటూ రాజకీయాధికారం కోసం పెనుగులాడుతున్న బీసీ ఉద్యమనేతలే గ్రామస్థాయిలో బీసీల మధ్య చిచ్చుపెడుతున్న ఇలాంటి భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ స్ఫూర్తి అంటే కేవలం అధికారంలోకి రావడమే కాదని, ప్రజాశ్రేణుల మధ్య నలుగుతున్న సమస్యలకు సరైన దిశలో పరిష్కారం చూపడమేనని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి బీసీ సంక్షేమ సంఘం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు రెవిన్యూ ప్రక్షాళన చేస్తానంటున్న కేసీఆర్ సర్కారు.. అదే రెవిన్యూ అధికారుల చేతుల్లో మరిన్ని అరాచకాలు జరగకముందే, ఘోరాలు పెరగకముందే కళ్లు తెరిచి త్వరపడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 


బాధితుడు పరిపూర్ణాచారి కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన విశ్వకర్మ పరిరక్షణ సమితి నేతలు ముత్తోజు మధుకరాచారి, మేడోజు రామబ్రహ్మం ఆచారి, చేపూరి వీరాచారి తదితరులు

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత