డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260: పురుషులు 38,76,688, స్త్రీలు 35,65 896, ఇతరులు 676
మొత్తం వార్డుల సంఖ్య 150
పోటీ చేసే అభ్యర్థులు 1122: టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149, కాంగ్రెస్ 146, టి.డి.పి 106, ఎం.ఐ.ఎం 51, సి.పి.ఐ 17, సి.పి.ఎం 12, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415
ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య 60,
స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్ ల సంఖ్య 30
పోలింగ్ సిబ్బంది 48,000
రిటర్నింగ్ అధికారులు 150
సహాయ రిటర్నింగ్ అధికారులు 150
సాధారణ పరిశీలకులు 14
వ్యయ పరిశీలకులు 34
మైక్రో అబ్జర్వర్ లు 1729,
వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2277
మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683
పోస్టల్ బ్యాలెట్లకై అందిన దరఖాస్తులు 2831
డిసెంబర్ 1న ఉ. 5:30గంటల వరకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకావాలి. ఉ. 6 నుండి 6:15 మధ్య మాక్ పోలింగ్ జరుగుతుంది. ఉ. 6:55 గంటలకు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయడం జరుగుతుంది.
ఉ. 7గంటలకు పోలింగ్ ప్రారంభం.
సా. 6గంటలకు పోలింగ్ పూర్తి
Also Read: రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్మీట్ ఎందుకు పెట్టినట్టు?
ఒవైసీలతో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?
ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ కు అవకాశం.
ప్రతి పోలింగ్ స్టేషన్లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు.
మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటివ్, 2934 సెన్సిటివ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు గా ఉన్నాయి. 921 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్ గా ఉన్నాయి.
ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులచే బందోబస్తు.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంల ఏర్పాటు.
కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి.
Comments
Post a Comment
Your Comments Please: