అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ పోల్ సర్వే ఏజెన్సీ ఆరా తాజాగా పోల్ రిజల్ట్స్ విడుదల చేసింది.
ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ 48.72 శాతం ఓట్లతో ముందంజలో ఉందని, ఆ తరువాత 44.64 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిందని తేల్చింది. ఇక కాంగ్రెస్ మాత్రం చాలా దారుణంగా 6.12 శాతం ఓట్లు మాత్రమే రాబట్టి మూడో స్థానానికి పరిమితమైందని అంచనా వేసింది. 2.52 శాతం ఓట్లను ఇతరులు రాబట్టుకుంటారని ఆరా అంచనా వేసింది.
ఈ నెల 10వ తేదీన దుబ్బాక బైపోల్ ఫలితాలు విడుదలవుతాయి. దీనికోసం టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: