సిద్ధిపేట, జూలై 03: కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలది గోబెల్స్ ప్రచారం అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. 80 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎగువకు నీళ్లు ఎత్తిపోసే ప్రాజెక్టు గొప్పదనాన్ని గుర్తించలేక, ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయం విజయవంతమైతే ఓర్చుకోలేక విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నమే తప్ప ప్రాజెక్టు ఔన్నత్యాన్ని గుర్తించే స్థితిలో లేరని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
Comments
Post a Comment
Your Comments Please: