గ్రేటర్ ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ కన్నా టెన్షన్ వాతావరణం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. పలు చోట్ల అధికార, విపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇంకొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది మీద కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సనత్ నగర్ పోలింగ్ స్టేషన్ లోని బూత్ నెంబర్ 13లో ఓటేయడానికి వచ్చిన ఓటర్లతో గుర్తు గుర్తుంది కదా.. మర్చిపోకండి అంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్న సిబ్బందిని క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు నిలదీశారు. సిబ్బంది మీద కంప్లయింట్ చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మాదాపూర్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ రెండు పార్టీల మధ్య అక్కడ ఘర్షణ నెలకొంది. చాదర్ ఘాట్ లో ఆరు ఆటోల్లో బోగస్ ఓటర్లను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఎంబీటీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓల్డ్ మలక్ పేటలోని బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు అచ్చవడంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేశారు. 3వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
టీఆర్ఎస్-బీజేపీ మధ్య క్యాంపెయిన్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారం జరిగింది. కానీ ఓటర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 17 శాతం వరకే నమోదు కావడంతో సాయంత్రం వరుక ఎంత పోలింగ్ అవుతుంది.. ఫలితాలు ఎలా ఉంటాయన్నది అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతోంది.
Comments
Post a Comment
Your Comments Please: