కోవిడ్ వైద్యసేవలను ఈహెచ్ఎస్ లో చేర్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన విజ్ఞాపన పత్రం సమర్పించామని ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పద్మాచారి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో ప్రజల మధ్యన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు వైద్యసేవలను ఇ.హెచ్.ఎస్ క్రింద అందించాలని కోరినట్లు పద్మాచారి చెప్పారు. అలాగే కరోనా వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర టెంపరేచర్ రికార్డ్ చేయడం, మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించడం, సానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, ప్రతి వారం కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలని, ఉద్యోగులను రొటేషన్ పద్దతిలో కార్యాలయాలకు అనుమతించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాలు ప్రవేశ పెట్టడం ద్వారా కరోనాను నియంత్రించాలని తాము సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికి ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సానుకూలంగా స్పందించారని, తామిచ్చిన మెమెురాండంలోని అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పద్మాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మాకరాచారి వెంట కారం రవిందర్ రెడ్డి, శ్రీమతి వి. మమత, మామిళ్ల రాజేందర్, ఎనుగుల సత్యనారాయణ, డా. మధుసూదన్ రెడ్డి, మునగాల మణిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, సంజీవ, గడ్డం జ్ఞానేశ్వర్, ముజీబ్ , రాయికంటి ప్రతాప్, క్రిష్ణయాదవ్, వెంకట్, గోల్కొండ సతీష్ పాల్గొన్నట్లు పద్మాకరాచారి చెప్పారు.
జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, జోర్దార్ సుజాత తదితరులు కేసీఆర్ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Post a Comment
Your Comments Please: