తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ ను తెలంగాణ పౌరులకు, ముఖ్యంగా ఉద్యమంతో ఏ కాస్త సంబంధం ఉన్నవారికైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన స్వామిగౌడ్... తాజాగా ప్రెస్ మీట్ లో మనసువిప్పి మాట్లాడారు. పార్టీలో తనకు జరిగిన అవమానం నుంచి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్.. ఎంఐఎంతో రాజీపడిపోయి వ్యవహరిస్తుండడం వరకు అనేక అంశాలను మీడియాతో ఖుల్లంఖుల్లా పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన గొంతు తడబడటం గమనించాల్సిన అంశం. అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినట్లయిందని.. తాను చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అంశాన్ని గుర్తు చేసుకోవడం విశేషం.
స్వామిగౌడ్ లేవనెత్తిన అంశాలు:
1) తెలంగాణ ఉద్యమంలో గజ్జె కట్టి పాటపాడిన కళాకారులు ఎక్కడ?
2) వలస పాలకుల దమననీతికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పనిచేసిన పాత్రికేయుల జాడెక్కడ?
3) తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని కష్టనష్టాలకోర్చిన ఉద్యమకారులు ఇప్పుడెక్కడ ఉన్నారు?
4) ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తిని తీర్చిండి. వారిని పిలిచి ఎందుకు మాట్లాడడం లేదు?
5) నా నియోజకవర్గంలో, నా ఇంటిదగ్గర టీఆర్ఎస్ కార్యక్రమం జరిగితే నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా అవమానిస్తారా? అంత తప్పు చేశానా?
6) అధికారం అడ్డు పెట్టుకొని, పార్టీని అడ్డు పెట్టుకొని ఎక్కడైనా తప్పుడు పనులు చేశానా?
7) ఆంధ్రా నాయకులు తెలంగాణ ప్రజలకు పరిపాలన తెలియదు అన్నట్టుగానే మీరు కూడా మాకు పరిపాలన చేత కాదంటున్నారా?
ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా ఈ వీడియో లింక్ లో వినొచ్చు..
Comments
Post a Comment
Your Comments Please: