హైదరాబాద్ సరూర్ నగర్ సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ టర్నోవర్ రూ. 2600 కోట్లు దాటిందని ఆ సొసైటీ ఎమ్మెస్సార్వీ ప్రసాద్ తెలిపారు. 23 ఏళ్లుగా ప్రజల మన్ననలు అందుకుంటూ సంస్థ దినదినం అభివృద్ధి చెందుతూ ఉందని, వారి విశ్వాసంతో తమ సంస్థ ఇంకా ఎదుగుతుందని ఆకాంక్షించారు. 23 వ సర్వసభ్య సమావేశం కూకట్ పల్లిలోని ఎన్.ఆర్.సీ గార్డెన్ లో జరిగిన సందర్భంగా కస్టమర్ల మన్నన చూరగొనడం తమ అదృష్టమన్నారు ప్రసాద్. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సమావేశం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాసిరెడ్డి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. M.S.R.V ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్ జె.సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.
Comments
Post a Comment
Your Comments Please: