Skip to main content

Posts

Showing posts with the label DEVOTIONAL

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి  కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే.  Also Read:  భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా? ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్రజలకు తెలియాలి. నిజానికి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. తమ పూర్వీకుల

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

జనవరి ఫస్టు రోజున చలో రామప్ప - బొడ్డుపల్లి బాలబ్రహ్మం

ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున  ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి‌ BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ  కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం  ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయాలను వీడియో షూట్ చేస్తారు. యాత్రలో పాల్గొన్నవారి అభిప్రాయాలు, అన

వీరబ్రహ్మేంద్రస్వామినే అటకాయిస్తున్న ప్రబుద్ధులు

తెెలుగునాటనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే కాలజ్ఞాన కర్తగా, భవిష్యత్ దార్శనికుడిగా సకల సమాజం చేత పూజలందుకునే యుగపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే. అలాంటిది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సాక్షాత్తూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కుంటాల మండలం కల్లూరు గ్రామంలో మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి 40 ఏళ్లకు పైగా పూజలు జరుగుతూ వచ్చాయి. అయితే స్వామివార్ల విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకోవడంతో.. అలాంటి విగ్రహాలకు పూజలు చేయరాదన్న నియమాల కారణంగా ఆ విగ్రహాలను పక్కన పెట్టారు. అలా దాదాపు తొొమ్మిదేళ్లుగా వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యపూజలు ఆగిపోయాయి. స్వామివార్ల విగ్రహాలు మళ్లీ పునఃప్రతిష్టించడానికి అవసరమైన వనరుల కొరత కారణంగా ఆ  విషయం వాయిదా పడుతూ వస్తోంది. అయితే అదే విగ్రహాలున్న చోట ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితమే దేవీ నవరాత్రులకు అంకురారోపణ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రతియేటా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు.  ఇటీవల కల్లూరు గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, శివలింగం, గణపతి, స

ఆవు పేడతో చెప్పులు.. త్వరలో మార్కెట్‍లోకి

Main Story:   జానారెడ్డికి గవర్నర్‍గిరీ? Also Read:   పాక్ మెడలు వంచిన రోజు ఇదే   Also Read:   ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా? Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.  వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆశ్చర్యపోయేలా కాగితాన్ని తయారు చేశా

బాణాల సమర్పణలో మరో ఐదు ఆధ్యాత్మిక పరిమళాలు

ప్రాచీన వేద విజ్ఞానాన్ని, మన మహర్షులు అందించిన అద్భుతమైన సాహితీ వారసత్వాన్ని ప్రజలందరికీ అందించేందుకు బాణాల మల్లికార్జునరావు ఎన్నో ఏళ్లుగా  పాటుపడుతున్నారు. ఇందుకోసం ఆయన సనాతన సాహితీ పరిషత్ అనే సంస్థను స్థాపించి సాహితీ సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరో అయిదు మేలైన పుస్తకాలను ప్రచురించి పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు రచించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శతక సంపుటి, నూతలపాటి వెంకటరత్న శర్మ రచించిన సూర్యచరితము-పద్యకావ్యం, తెనాలి రామలింగ కవి రచించిన ధీరజన మనోవిరాజితముతో పాటు సంధ్యావందన్ చేసుకోవాలనేవారి కోసం లఘు సంధ్యావందనమ్, కర్మకాండ నిర్వహణలు వివరించే ఆబ్దికారాధనమ్ అనే గ్రంథాలను సనాతన సాహితీ పరిషత్ ద్వారా ప్రచురించారు.  ఈ ఐదు పుస్తకాలను ఆవిష్కరించి ట్యాంక్ బండ్ వద్ద గల శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెదపాటి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ సమాజానికి ప్రకృతికి, దేహానికి మధ్య ఉండే అనేక మార్మిక రహస్యాలను విప్పి చెప్పారని, ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ఎవరూ అనర్హులు కారని, సాధన ద్వారా ఎవ్వరైనా అలౌకిక ఆనందాన్ని, యోగ విజ్ఞానంల

వాడవాడలా బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ ఆడటం పురాతనంగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలో బొమ్మకల్ గ్రామంలోని పలు వీధుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకు ఆడపడుచులు బతుకమ్మ ఆడి ఆనందం పంచుకున్నారు. అనంతరం వాగుకు వెళ్లి అక్కడ కూడా భారీ సంఖ్యలో మహిళలు చాలాసేపు బతుకమ్మ పాటలు పాడుకొని గౌరీదేవికి వాయనాలు సమర్పించుకున్నారు. అనంతరం వాగులో నిమజ్జనం చేశారు.  తెలంగాణ అంతటా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుగుతుండగా కరీంనగర్ పక్కనున్న బొమ్మకల్ లో మాత్రం 7 రోజులకే పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడు, కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి తదితర గ్రామాల్లో కూడా 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.   

ఆంధ్రాలో బతుకమ్మ-ఎస్సై ఓవరాక్షన్

బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ అదేంకాదు.. ఆంధ్రాలో కూడా జరుపుకుంటారని తాజా ఘటన రుజువు చేస్తోంది. అయితే సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుకునే సమయంలో స్థానిక ఎస్సై ఓవరాక్షన్ చేయడం కలకలం రేపుతోంది. తాను అక్కడ ఉండగా బతుకమ్మ ఆడే అవకాశమే ఇవ్వనని పంతానికి పోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం (22వ తేదీ సాయంత్రం) గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకొని నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో అమ్మవారి విగ్రహం సమీపంలో కరోనా నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మలు ఏర్పాటుచేసి ఆడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న వీరులపాడు ఎస్ఐ హరి ప్రసాద్ మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. సుమారు రెండు గంటలకు పైగా బతుకమ్మలతో వచ్చిన మహిళలను నిర్దాక్షిణ్యంగా అక్కడే నిలబెట్టారు. బతుకమ్మలు ఆడటానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు.గ్రామస్తులపై దుర్భాషలాడుతూ ఈరోజు నుండి బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తాను అంటూ హరిప్రసాద్ బెదిరించారని గ్రామస్తులు ఆర

విశ్వకర్మ పూజోత్సవానికి సిద్ధమవుతున్న బ్రహ్మగిరి

ప్రతియేటా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు విశ్వకర్మ సామాజికవర్గమంతా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. విశ్వ సృష్టికర్త, విశ్వ రచనా దురంధరుడు అయిన విశ్వకర్మను స్మరించుకోవడం, విశ్వ జనావళి బాగోగుల కోసం సరికొత్త కార్యకలాపాల గురించి యోచించడం, ఆచరణ మార్గాలు అన్వేషించడం విశ్వకర్మల సామాజిక ధర్మం. ఇందులో భాగంగానే సౌరమానం ప్రకారం ప్రతియేటా జరుపుకునే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి చేవెళ్లలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చేవెళ్లలోని బ్రహ్మగిరిపై దాదాపు పదేళ్లుగా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, విశ్వకర్మ యజ్ఞమహోత్సవం జరుపుతున్నారు. ఈసారి కరోనా కారణంగా భారీ స్థాయిలో జరుపుకోకపోయినా.. నిర్వహణలో లోటు రాకుండా పరిమితులు పాటిస్తూ శ్రద్ధాభక్తులతో జరుపుకోవాలని చేవెళ్ల విశ్వబ్రాహ్మలు తీర్మానించుకున్నారు. మరోవైపు విశ్వకర్మ పూజోత్సవ ఏర్పాట్లలో భాగంగా వంటశాల చదును చేయడం, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడడం, గుట్టపై పెరిగిన కలుపును తీసిపారేయడం, మట్టిపని వగైరా పనుల్లో నిమగ్నమయ్యారు. అడ్వొొకేట్ బాలాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్వాహకులు లింగాచారి, మాణిక్