Skip to main content

ఆంధ్రాలో బతుకమ్మ-ఎస్సై ఓవరాక్షన్


బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ అదేంకాదు.. ఆంధ్రాలో కూడా జరుపుకుంటారని తాజా ఘటన రుజువు చేస్తోంది. అయితే సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుకునే సమయంలో స్థానిక ఎస్సై ఓవరాక్షన్ చేయడం కలకలం రేపుతోంది. తాను అక్కడ ఉండగా బతుకమ్మ ఆడే అవకాశమే ఇవ్వనని పంతానికి పోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం (22వ తేదీ సాయంత్రం) గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకొని నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో అమ్మవారి విగ్రహం సమీపంలో కరోనా నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మలు ఏర్పాటుచేసి ఆడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న వీరులపాడు ఎస్ఐ హరి ప్రసాద్ మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. సుమారు రెండు గంటలకు పైగా బతుకమ్మలతో వచ్చిన మహిళలను నిర్దాక్షిణ్యంగా అక్కడే నిలబెట్టారు. బతుకమ్మలు ఆడటానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు.గ్రామస్తులపై దుర్భాషలాడుతూ ఈరోజు నుండి బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తాను అంటూ హరిప్రసాద్ బెదిరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ఎస్సై వినకపోవడం విశేషం. పైగా నేనుండగా అసలు బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తానంటూ భీష్మించుక్కూర్చున్నారు. చేసేదిలేక మహిళలంతా బతుకమ్మలను స్థానికంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల మనోభావాలు లెక్కచేయకుండా హిందువులు జరుపుకునే పండుగైన బతుకమ్మ విషయంలో ఎస్ఐ ప్రవర్తించిన తీరు మనోవేదన కలిగించిందని, ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఆయన ప్రవర్తించిన తీరు విస్మయాన్ని కలుగజేసిందని  గ్రామస్తులు వాపోయారు. దీనిపై హిందూ ధర్మ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న నందిగామ డీఎస్పీ రమణమూర్తి బతుకమ్మ విషయంలో ఎస్ ఐ ప్రవర్తించిన తీరు సరికాదని ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశామన్నారు. 



 


Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో