Skip to main content

విశ్వకర్మ పూజోత్సవానికి సిద్ధమవుతున్న బ్రహ్మగిరి


ప్రతియేటా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు విశ్వకర్మ సామాజికవర్గమంతా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. విశ్వ సృష్టికర్త, విశ్వ రచనా దురంధరుడు అయిన విశ్వకర్మను స్మరించుకోవడం, విశ్వ జనావళి బాగోగుల కోసం సరికొత్త కార్యకలాపాల గురించి యోచించడం, ఆచరణ మార్గాలు అన్వేషించడం విశ్వకర్మల సామాజిక ధర్మం. ఇందులో భాగంగానే సౌరమానం ప్రకారం ప్రతియేటా జరుపుకునే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి చేవెళ్లలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చేవెళ్లలోని బ్రహ్మగిరిపై దాదాపు పదేళ్లుగా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, విశ్వకర్మ యజ్ఞమహోత్సవం జరుపుతున్నారు. ఈసారి కరోనా కారణంగా భారీ స్థాయిలో జరుపుకోకపోయినా.. నిర్వహణలో లోటు రాకుండా పరిమితులు పాటిస్తూ శ్రద్ధాభక్తులతో జరుపుకోవాలని చేవెళ్ల విశ్వబ్రాహ్మలు తీర్మానించుకున్నారు. మరోవైపు విశ్వకర్మ పూజోత్సవ ఏర్పాట్లలో భాగంగా వంటశాల చదును చేయడం, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడడం, గుట్టపై పెరిగిన కలుపును తీసిపారేయడం, మట్టిపని వగైరా పనుల్లో నిమగ్నమయ్యారు. అడ్వొొకేట్ బాలాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్వాహకులు లింగాచారి, మాణిక్యాచారి, శంభులింగాచారితో  పాటు స్థానిక విశ్వబ్రాహ్మణ నేతల పిల్లలు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం విశేషం. 



శ్రీశ్రీశ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామి


బ్రహ్మగిరిని సందర్శించిన మిషన్ విశ్వకర్మ లీడర్స్


మిషన్ విశ్వకర్మ లీడర్స్ బృందం బ్రహ్మగిరిని సందర్శించి ఆలయ అభివృద్ధి పనులు, ఇంకా అవసరమైన కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ విశ్వకర్మ లీడర్స్ వ్యవస్థాపకుడు మావిశ్రీ మాణిక్యం, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చేపూరి లక్ష్మణాచారి, తెలంగాణ విశ్వకర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్తోజు మధుకర్ ఆచార్య, సీనియర్ జర్నలిస్టు రమేశ్ ఆచార్య కలిసి బ్రహ్మగిరి క్షేత్రాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. ఆలయ నిర్మాణానికి పూనుకున్న క్రమం, తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక విద్యుత్ విభాగం అధికారులు తమకు ఎంతో సహకరించారని, వారి సహకారంతోనే బ్రహ్మగిరి మీద గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామిని ప్రతిష్టించామని, పదేళ్ల తరువాత ఆలయం ఈ రూపంలోకి వచ్చిందని లింగాచారి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విశ్వబ్రాహ్మల్లో సహృదయులు, సేవాతత్పరులు ముందుకొస్తే జాతి గర్వించే స్థాయిలో బ్రహ్మగిరిని తీర్చిదిద్దుతామని మాణిక్యాచారి అన్నారు. బ్రహ్మగిరి క్షేత్రంలో ఇంకా విరాట్ విశ్వకర్మ, గాయత్రీమాత కొలువై ఉండగా భక్తాంజనేయస్వామి కోసం ప్రత్యేకంగా ఆలయం రూపుదిద్దుకుంటోంది. 




Comments

Popular posts from this blog

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో