Skip to main content

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల  ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు. 

రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక్కించారని బాలబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. రేచర్ల రుద్రుడు వేయి స్తంభాల గుడిని నిర్మించినట్టుగా చరిత్రలో నమోదైనప్పటికీ ఆనాటిి కాకతీయ పాలకుడైన రుద్రుడిని రామప్ప ఆలయానికి జత చేయడం కొందరు కుసంస్కారుల, కుహనా మేధావుల కుట్రపూరిత  చర్యగా సినీ నిర్మాత, రచయిత కొత్తపల్లి సీతారాం పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు యునెస్కో కు నివేదికలు పంపినప్పుడే ఈ కుట్రకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ప్రముఖ సినీ గేయ రచయిత స్వర్గీయ సి.నారాయణరెడ్డి రాసిన రామప్ప అనే పుస్తకంలో, అలాగే రాగమయి అనే మరో కావ్యంలో ఆ శిల్పిని రామప్పగా పేర్కొనడం జరిగిందని, రామప్ప శిల్ప కళా నైపుణ్యానికి ఆనాటి పాలకురాలు రుద్రమదేవి మనసు పడిందని వారి మధ్య అవ్యక్తమైన, అవ్యాజమైన, అద్భుతమైన ప్రేమాయణం కూడా కొనసాగినట్లు సినారె వంటి ప్రముఖ రచయితలు కూడా పేర్కొన్నారని సీతారాం గుర్తు చేశారు.  అసలు ఆ ఆలయానికి శిల్పి పేరు మీద రామప్ప అనే పేరు పెట్టింది కూడా సాక్షాత్తూ  ఆనాటి పాలకుడు రేచర్ల రుద్రుడేనన్న విషయం గమనించాలని ఆయన ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నమోదైన అంశాలను విస్మరించి స్వీయ కల్పితాలతో  యునెస్కోకు  రిపోర్టులు ఇవ్వడం వల్లే రామప్ప పేరు కాస్తా బ్రాకెట్లోకి వెళ్లిపోయిందన్నారు. 

అయితే ప్రజలందరికీ తెలిసింది రామప్పేనని, రామప్ప పేరును ప్రజల మస్తిష్కాల్లోంచి ఎవ్వరూ చెరిపివేయజాలరని, అయితే మేధావుల ముసుగులో, చరిత్రకారుల పేరుతో కొందరు చేస్తున్న కుత్సితపు చేష్టలను ప్రజలెప్పుడూ తిరస్కరిస్తారని సీతారాం అన్నారు. ఇందులో భాగంగానే తాము  రానున్న రోజుల్లో మరిన్ని యాత్రలు నిర్వహిస్తామని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో వెనుక వేయబడ్డ ప్రాంతంగా పేరున్న తెలంగాణకు తన శిల్పకళా చాతుర్యంతో అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప పేరుకు అన్యాయం తలపెట్టే  ప్రయత్నాలను పాలకులు ఎంతో  ముందుచూపుతో  కనిపెట్టాలని, అలాంటివాటికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పుడే న్యాయం నాలుగు పాదాలమీద నడిచినట్టు కీర్తి పొందుతుందని సీతారాం అభిప్రాయపడ్డారు.  
ఈ యాత్ర పొడవునా జయహో రామప్ప, అమర శిల్పి రామప్ప అంటూ యాత్రికులు పెద్దఎత్తున  నినాదాలు చేశారు. పురుషులతో పాటు పెద్దసంఖ్యలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. నాగర్ కర్నూలు జిల్లాలోని యథార్థ పీఠం అధిపతి జనార్దనస్వామి ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?