Skip to main content

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల  ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు. 

రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక్కించారని బాలబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. రేచర్ల రుద్రుడు వేయి స్తంభాల గుడిని నిర్మించినట్టుగా చరిత్రలో నమోదైనప్పటికీ ఆనాటిి కాకతీయ పాలకుడైన రుద్రుడిని రామప్ప ఆలయానికి జత చేయడం కొందరు కుసంస్కారుల, కుహనా మేధావుల కుట్రపూరిత  చర్యగా సినీ నిర్మాత, రచయిత కొత్తపల్లి సీతారాం పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు యునెస్కో కు నివేదికలు పంపినప్పుడే ఈ కుట్రకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ప్రముఖ సినీ గేయ రచయిత స్వర్గీయ సి.నారాయణరెడ్డి రాసిన రామప్ప అనే పుస్తకంలో, అలాగే రాగమయి అనే మరో కావ్యంలో ఆ శిల్పిని రామప్పగా పేర్కొనడం జరిగిందని, రామప్ప శిల్ప కళా నైపుణ్యానికి ఆనాటి పాలకురాలు రుద్రమదేవి మనసు పడిందని వారి మధ్య అవ్యక్తమైన, అవ్యాజమైన, అద్భుతమైన ప్రేమాయణం కూడా కొనసాగినట్లు సినారె వంటి ప్రముఖ రచయితలు కూడా పేర్కొన్నారని సీతారాం గుర్తు చేశారు.  అసలు ఆ ఆలయానికి శిల్పి పేరు మీద రామప్ప అనే పేరు పెట్టింది కూడా సాక్షాత్తూ  ఆనాటి పాలకుడు రేచర్ల రుద్రుడేనన్న విషయం గమనించాలని ఆయన ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నమోదైన అంశాలను విస్మరించి స్వీయ కల్పితాలతో  యునెస్కోకు  రిపోర్టులు ఇవ్వడం వల్లే రామప్ప పేరు కాస్తా బ్రాకెట్లోకి వెళ్లిపోయిందన్నారు. 

అయితే ప్రజలందరికీ తెలిసింది రామప్పేనని, రామప్ప పేరును ప్రజల మస్తిష్కాల్లోంచి ఎవ్వరూ చెరిపివేయజాలరని, అయితే మేధావుల ముసుగులో, చరిత్రకారుల పేరుతో కొందరు చేస్తున్న కుత్సితపు చేష్టలను ప్రజలెప్పుడూ తిరస్కరిస్తారని సీతారాం అన్నారు. ఇందులో భాగంగానే తాము  రానున్న రోజుల్లో మరిన్ని యాత్రలు నిర్వహిస్తామని, అయితే ఉమ్మడి రాష్ట్రంలో వెనుక వేయబడ్డ ప్రాంతంగా పేరున్న తెలంగాణకు తన శిల్పకళా చాతుర్యంతో అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప పేరుకు అన్యాయం తలపెట్టే  ప్రయత్నాలను పాలకులు ఎంతో  ముందుచూపుతో  కనిపెట్టాలని, అలాంటివాటికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పుడే న్యాయం నాలుగు పాదాలమీద నడిచినట్టు కీర్తి పొందుతుందని సీతారాం అభిప్రాయపడ్డారు.  
ఈ యాత్ర పొడవునా జయహో రామప్ప, అమర శిల్పి రామప్ప అంటూ యాత్రికులు పెద్దఎత్తున  నినాదాలు చేశారు. పురుషులతో పాటు పెద్దసంఖ్యలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. నాగర్ కర్నూలు జిల్లాలోని యథార్థ పీఠం అధిపతి జనార్దనస్వామి ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత