Skip to main content

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు

చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్రజలకు తెలియాలి. నిజానికి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. తమ పూర్వీకులు ఫలానా మంచి చేశారు అని తెలుసుకోవడం ఎంత అవసరమో.. తమ పూర్వీకుల్లో ఫలానా వారి ద్వారా ఫలానా చెడు జరిగిందన్నది తెలుసుకోవడం కూడా ఈ సమాజానికి అంతే అవసరం. ఈ సూత్రాన్ని బాగా నమ్మినవారు మహామహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మాన విభూషిత బ్రహ్మశ్రీ పెదపాటి నాగేశ్వరరావుగారు. 

పుణ్యదంపతులు సూర్యనారాయణ-లక్ష్మీకాంతమ్మ

చరిత్రలో ఏం జరిగిందో వివరించే బాధ్యతాయుతమైన బరువును స్వచ్ఛందంగా మోయడానికి ముందుకొచ్చారు పెదపాటి. అందుకు తనకు ఇష్టమైన సాహితీ రంగాన్ని ఎంచుకున్నారు. వందకు పైగా పుస్తకాలు ప్రచురించారు. ఒక్కో రచనలో ఒక్కో ఇతివృత్తాన్ని స్పృశించారు. చరిత్రలో చోటు చేసుకున్న అనేక చీకటి కోణాల్ని కూడా తన రచనా ప్రక్రియ ద్వారా గ్రంథస్తం చేసి పెట్టారు. భావి తరాలు చదువుకొని అవగాహనతో మసలుకోవాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన రచనలు కట్టలు తెగే ఆవేశాన్ని కలిగించవు. రెచ్చగొట్టి దారితప్పేలా చేయవు. జస్ట్ అవగాహన కల్పిస్తాయి అంతే. అప్రమత్తంగా ఉండమని చెప్తాయి. కళ్లు తెరచి మసలుకొమ్మని తట్టి  లేపుతాయి. పాపులారిటీ కొలబద్దలకు అందని అద్వితీయమైన, అలౌకికమైన ఆధ్యాత్మిక విజ్ఞాన పరిమళాలు మొదలుకొని ఆధునిక చరిత్ర పుటల్లో ఎక్కడా చోటు దక్కని సామాజిక అన్యాయాన్ని కూడా ఆయన రచనలు మన కళ్లముందు పరుస్తాయి. ప్రశ్నిస్తారో, మౌనమునిలా ఆచరిస్తూ సాగిపోతారో తేల్చుకోవడం పాఠకుల వంతే. 
సాహిత్యంలో మనుచరిత్ర - ఒక తులనాత్మక అధ్యయనం, వసుచరిత్ర-సంస్కృత గ్రంథం, నైషధం విద్వదౌషధం, ఆముక్తమాల్యద, శ్రీనాథుని పంచప్రాణాలు, డాంటే మిల్టన్ శ్రీనాథులు... ఇలాంటివన్నీ మనం చదువుకున్న చరిత్రకు ఆవల మనకు తెలియని కోణాలను గురించి ఆసక్తికరంగా వివరిస్తాయి. శ్రీశైల గద్యం, శ్రీ లక్ష్మీ నరసింహ సుప్రభాతం, కాళీ సుప్రభాతం, భద్రాచల రామ సుప్రభాతం, విశ్వకర్మ సుప్రభాతం, వీరబ్రహ్మ సహస్ర నామ స్తోత్రం, తుకారాం పంచాక్షరి, జేజినాయన జాజిమల్లెలు, శ్రీ విశ్వకర్మ పురాణం.. వంటివాటిని కవితారూపకంగానూ అందించారు. 


వ్యక్తిగతం: పెదపాటి నాగేశ్వరరావు గుంటూరు జిల్లావాసి. జులై 1, 1941లో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ,  తల్లి లక్ష్మీకాంతమ్మ. తండ్రి వృత్తిరీత్యా స్వర్ణశిల్పి. బంగారు ఆభరణాల తయారీలో ఆయన సిద్ధహస్తులు. కాబట్టి సహజంగానే శిల్పాకృతులు  మలచడంపై  చిన్నప్పుడే నాగేశ్వరరావుకు దృష్టి మరలింది. హైస్కూలు విద్యాభ్యాసం చిలకలూరిపేట, ఇంటర్ గుంటూరు, డిగ్రీ చీరాలలో జరిగాయి. పూనా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. హెదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పి.హెచ్.డి చేశారు. ఆనాటి ఎండోమెంట్ డిపార్టుమెంట్ లో శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేశారు. శిల్పశాస్త్రంలో తెలుగు యూనివర్సిిటీ నుంచి పి.హెచ్.డి. అందుకున్నారు. ఎండోమెంట్ డిపార్టుమెంట్ నుంచి 1999లో అసిస్టెంట్ స్థపతిగా రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచే తనకు ఇష్టమైన శిల్పకళలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు. అనేక దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించారు. తన ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న దేవాలయాలు, అందులోని విగ్రహాలకు స్వయంగా ప్రాణప్రతిష్ట చేశారు. పెదపాటి ప్రారంభించిన అనేక దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం ఆయనలోని శిల్పకళా సౌజన్యమే. 

భాషా పాటవం, విద్యాసేవ: తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, మరాఠీల్లో పలు గ్రంథాలు రాశారు. మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ జీవిత చరిత్రను ప్రజలకు అందించారు. ముగ్గురు రాష్ట్రపతుల చేత సన్మానం అందుకున్నారు. 1965లో బి.డి.జెట్టి, 1985లో జైల్ సింగ్, ఆ తరువాత శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా 3 సార్లు సన్మానాలు అందుకున్నారు. వారికున్న అద్భుతమైన విద్వత్తు, సాహితీసేవ, శిల్పకళా సేవలే రాష్ట్రపతుల చేత సన్మానం అందుకునేలా చేశాయి. అంతేకాదు.. ముగ్గురు గవర్నర్లు, ముగ్గురు చీఫ్ మినిస్టర్ల  చేతులమీదుగా కూడా సన్మానాలు అందుకున్నారు. విద్యార్థుల్ని కల్చరల్  టూర్ కోసం నార్త్ ఇడియా కు తీసుకెళ్లి డిఫెన్స్ ఎకాడమీ, ఇంజినీరింగ్ యూనివర్సిటీల్లో అనేక విభాగాలు చూపించి అవగాహన కల్పించారు. ఉజ్జయినిలో జరిగిన అఖిల భారత విశ్వసంస్కృతం సభలకూ వారిని తీసుకెళ్లారు. తరగతి గదుల్లో బోధించడం కన్నా.. ఇలా టూర్ల ద్వారా ఆర్జించిన విద్యే విద్యార్థుల్ని ప్రయోజకుల్ని చేస్తుందని పెదపాటి నమ్ముతారు. పూనాలో పండిత పరిషత్ జరిగినప్పుడు.. తనలోని పాండితీ ప్రకర్షను చూసి పండిత పద్మాకరశాస్త్రిగారు.. ఎంతో ఆనందానుభూతుడై మహా మహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మాన విభూషిత అంటూ బిరుద ప్రదానం చేశారని ఆనాటి తీపిగుర్తులు గుర్తు చేసుకుంటారు. 

కందిమల్లాయపల్లె లోని శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి 2010 నంచి ఆస్థాన పండితుడుగా కొనసాగుతున్నారు. 2002లో షష్టిపూర్తి జరిగినప్పుడు తన శిష్యబృందం కనకాభిషేకం చేసి గండపెండేరం తొడగడం తన జీవితంలో అపూరుపమైన జ్ఞాపకంగా చెబుతారు. 

ఆయనకు అత్యంత ఆత్మ సంతృప్తినిచ్చిన రచన శ్రీనాథుని పంచ ప్రాణములు. ఎందుకంటే శ్రీనాథ కవిసార్వభౌముడు కలలో కనిపించి తనకు పద్యాలు చెప్పాడని.. ఆయన చెప్పిన పద్యాలను, వాటి స్ఫూర్తితో మరికొన్నింటిని ఓ గ్రంథంగా అమర్చానని ఉద్విగ్నంగా చెప్పుకుంటారు. కలలో కనిపించిన శ్రీనాథుడు తనను లేపడం, పద్యాలు చెప్పడం, తద్వారా.. ఆనాడు శ్రీనాథుడు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు చిరస్థాయిగా ప్రపంచానికి తెలిసేలా చేసే అవకాశం చిక్కడాన్ని ఎంతో అద్భుతంగా ఇప్పటికీ ఫీలవుతానని పెదపాటి గుర్తు చేసుకుంటారు. ఆనాటి సంప్రదాయ బ్రాహ్మణ సమాజం కుట్రలను శ్రీనాథుడు ఎలా ఎదుర్కొన్నదీ, ఎన్ని అవమానాలు పడ్డదీ చూచాయగా చెబుతారు ఆ గ్రంథంలో అందుకే ఆ గ్రంథ రచనకు విశేషంగా ఫీలయ్యానంటారు. మద్రాసు యూనివర్సిటీ ప్రొఫెసర్ నిడదవోలు వెంకట్రావు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారట. ఆయన ప్రశంసలు తనకిప్పటికీ చెవుల్లో రింగుమంటాయంటారు. 

పెదపాటి నాగేశ్వరరావు జులై 10వ తేదీ, 2022న చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సహస్ర పూర్ణచంద్ర దర్శనయుక్త శతాభిషేక మహోత్సవం జరుపుకుంటున్నారు. సాహితీ సేవలో తరించిపోయిన ఈ విద్వత్సంపన్నుడి కృషి ఎందరికో స్ఫూర్తి నింపుతుందని ఆశిద్దాం. 

Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత