Skip to main content

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు. 

అలాంటి మహా పండితుడికి తగిన గుర్తింపు రాకపోవడం కాస్త చింతించాల్సిన విషయమేనని, అందుకు ఎవరినో నిందించడం కాకుండా.. మనల్ని మనం అర్థం చేసుకొని, మన శక్తియుక్తుల స్థాయేంటో తెలుసుకొని ఎదగడానికి ప్రయత్నించాలని నర్మగర్భంగా విశ్వబ్రాహ్మణులకు హితవు పలికారు. తన అవగాహన ప్రకారం మానవజాతిలో 4 రకాలైన మనుషులుంటారన్నారు మధుసూదనాచారి. 1) క్రియేటర్స్ (సృష్టికర్తలు లేదా సృజనకారులు), 2) ఇమిటేటర్స్ (అనుకరించేవారు), 3) స్పెక్టేటర్స్ (ప్రేక్షకులు), 4) ఫ్రస్టేటర్స్ (అసహనపరులు). ఈ నాలుగు రకాల మనుషుల్లో విశ్వబ్రాహ్మణులు మొదటి తరగతికి చెందినవారని, అది ప్రపంచానికి కూడా తెలుసని.. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించడంలోనే విశ్వబ్రాహ్మణులు విఫలమవుతున్నారన్నారు. పెదపాటి లాంటి మహా పండితుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగానైనా.. విశ్వబ్రాహ్మణ  యువతీ యువకులు ఈ విషయం గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ సంతానాన్ని ఆ విధంగా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినన్ని అవకాశాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదన్నారు. నాగేశ్వరరావు, గంగాదేవి దంపతులకు మధుసూదనాచారి జంటగా శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి సన్మానించారు. 
వందకు పైగా పుస్తకాలు ప్రచురించిన పెదపాటి సాహితీ సేద్యాన్ని గురించి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి కూలంకషంగా వివరించారు. మల్లినాథుని సూరి భాష్యమే లేకపోతే కాళిదాసు కవిత్వంలోని గొప్పదనం ప్రపంచానికి తెలిసేది కాదని.. అలంటి మల్లినాధుని సూరి కూడా పట్టుకోలేకపోయిన అంశాలను పెదపాటి నాగేశ్వరరావు నేటిి తరానికి అందించారన్నారు. సంస్కృతంలో ఉన్న విశ్వకర్మ పురాణాన్ని తేట తెలుగులోకి అనువదించారని, వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలోని వైశిష్ట్యం ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దాన్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేశారన్నారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, తమిళం, కన్నడం, మరాఠా వంటి అనేక భాషల్లో పాండిత్యం ఒలికించే వైదుష్యం పెదపాటి సొంతమని.. రచనా వ్యాసంగంలో ఆయన ఎంచుకున్న శిల్పాన్ని అద్భుతంగా విడమరచి చెప్పారు సుబ్బాచారి. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణను ఈ దేశం పట్టనంత పండితుడిగా చెబుతారని, అయితే ఆ పేరు విశ్వనాథ సత్యనారాయణ కంటే ఆచార్య పెదపాటికి ఇంకా బాగా సరిపోతుందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. దేశం గర్వించే స్థాయిలో సాహితీ సేద్యం చేసిన పెదపాటికి తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరమన్నారు. అందుకు పెదపాటి విశ్వబ్రాహ్మణుడిగా పుట్టడమేనని వాపోయారు. జీవితంలోని ఆఖరు మజిలీలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రావూరి భరద్వాజను సుబ్బాచారి గుర్తు చేశారు. విశ్వబ్రాహ్మణుల్లో ఇంతటి ఔన్నత్యం ఉన్న సాహితీవేత్తలు ఉన్నా.. తగినంత గుర్తింపుగానీ, తగినన్ని అవకాశాలు గానీ రాకపోవడానికి విశ్వబ్రాహ్మణుల్లో ఐక్యత లేకపోవడమేనని, అందువల్లే పాలకులు వీరి విజ్ఞానాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారన్నారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణులు తమ శక్తి ఏపాటిదో తెలుసుకొని రాజకీయంగా ప్రభావశీలంగా ఎదగాలన్నారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు వేములవాడ మదన్ మోహన్.. పెదపాటి వాఙ్మయ సేవను ఎంతో కొనియాడారు. పెదపాటి నాగేశ్వరరావు, గంగాదేవి దంపతులను ఇలా వివాహ వేడుకగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఆయనలోని సాహితీ వైదుష్యాన్ని విశ్వబ్రాహ్మణజాతికి ఉపయోగపడేలా సంఘం తరఫున కృషి చేస్తానన్నారు. పెదపాటి శిష్యులు, అభిమానులు నిర్వహిస్తున్న మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. విశేష సంఖ్యలో పెదపాటి అభిమానులు, సాహితీ శ్రేయోభిలాషులు హాజరయ్యారు. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత