Skip to main content

విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న ప్రభుత్వం-ఎర్రోజు భిక్షపతి

కాంగ్రెస్, బీజేపీలకు విజ్ఞాపనపత్రాలు ఇస్తాం: ఎర్రోజు భిక్షపతి

తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను దారుణంగా అవమానపరుస్తుందని, ఇకనైనా ప్రభుత్వం మోసపుచ్చే ధోరణి విడనాడకపోతే ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారిలో విశ్వబ్రాహ్మణులే ముందువరుసలో ఉంటారన్నారు. అయినా కడు పేదరికంలో మగ్గుతున్న విశ్వబ్రాహ్మణుల పట్ల కనీసం ఇతర బీసీ కులాలకు ఇచ్చిన గౌరవం, ఆదరణ కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండలు అందించిన విశ్వబ్రాహ్మణుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తమ సంఘంలోనే తమకు గొడవలు పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన తమ ప్యానెల్ కు బదులు... అప్రజాస్వామికంగా దొంగదారిలో ఎంపికైన సంఘాన్ని గుర్తించి అలా ఎంపికైన సంఘానికే ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల స్థలాన్ని, రూ. 5 కోట్లను కేటాయించడం పూర్తి అన్యాయమన్నారు. అప్రజాస్వామిక సంఘాన్ని కొందరు టీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని, అది ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించాలన్నారు. దీనిపై ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా కలిసి విన్నవించినా.. ఫలితం లేకుండా పోయిందని, ఫలితంగా ఈ ప్రభుత్వంపై విశ్వబ్రాహ్మణ జాతి నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు. 

గత సెప్టెంబర్లో అబ్దుల్లాపూర్‎మెట్ లో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్.. భూ కేటాయింపులు, నిధుల కేటాయింపుల కాగితాలు తమ సంఘానికి అప్పగించారని, వారు ప్రజల చేత ఎన్నికైనట్టుగానే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సమాజం ఓట్ల ద్వారా ఎన్నికైన వీవీఐఎస్ ను కూడా ప్రభుత్వం గుర్తించిందని, అందుకే తనను ఆ సభకు పంపి కాగితాలు అప్పగించాలని ఆదేశించినట్లు చెప్పిందని గంగుల అన్నారని గుర్తు చేశారు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదన్నారు. ఏ ఒక్క నాయకుడి కోసమో యావత్ విశ్వబ్రాహ్మణ జాతి ఓర్పును పరీక్షించాలనుకోవడం మంచిది కాదని కేసీఆర్ కు హితవు పలికారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గ్రామగ్రామం నుంచి విశ్వబ్రాహ్మణ యూత్ ఐక్యంగా కదిలి ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న అన్యాయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కు 2 వేల కోట్లు కేటాయించాలని, వడ్రంగులపై అటవీ అధికారులు దాడులు ఆపాలని, స్వర్ణకారులపై పోలీసు వేధింపులు నిలిపివేయాలని, శిల్పకారులకు క్వారీలు కేటాయించాలని, విశ్వబ్రాహ్మణ పురోహితుల్ని దేవాలయాల్లో అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో విశ్వబ్రాహ్మణుల పారిశ్రామికవాడకు 20 ఎకరాల  స్థలాన్ని కేటాయించాలని, 50 ఏళ్లు పైబడినవారికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లోని తార్నాకలో ప్రధాన కార్యదర్శి నందిపేట రవీంద్రాచారి, ఇతర నాయకులతో కలిసి భిక్షపతి ప్రెస్‎మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, ఎర్రోజు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత