Skip to main content

కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. 

తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తాను... BJP లో చేరిందే గజ్వేల్లో పోటీ చేయడానికంటూ మరో అడుగు ముందుకేసి సమరనాదం చేశారు ఈటల. కేసీఆరే టార్గెట్‎గానే గజ్వేల్లో పని మొదలు పెట్టినట్లు సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నారట ఈటల. ఈ విషయంలో బెంగాల్‎లో సువేందు అధికారి తరహాలో.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించి తీరుతామని ఈటల ధీమాగా ఉన్నారట. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

ఇక ఈటల ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే.. ఈటలకు పూర్తి వ్యూహం చెప్పి, ఒప్పించి ఈటలను రంగంలో దించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు మౌనంగా ఉన్న ఈటల... ఒక్కసారిగా వాయిస్ పెంచడం, కేసిఆర్ టార్గెట్ అనే విధంగా ప్రకటనలు చేస్తుండడంతో ఆయన వెనుక షా వ్యూహం కచ్చితంగా ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. ఇటీవల ఈటల అమిత్ షాతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా భేటీ అయి.. పూర్తి అంశాలు చర్చించినట్లుగా చెప్పుకుంటన్నారు. అందుకే.. ఈటల తాను సీయం నియోజకవర్గం గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారని చెప్పుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ ఎన్నికలు ఏ లెవల్లో ఉత్కంఠగా జరిగాయో.. రేపు తెలంగాణలోనూ అదేవిధంగా జరుగుతాయని ఈటల ధీమాగా ఉన్నారట. ఈటల-షా భేటీలో.. బీజేపీ హైకమాండ్ వ్యూహం పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టే విధంగా షా... వ్యూహం రచించారని, ఆ ఆత్మవిశ్వాసం మేరకే ఈటల రాజేందర్... హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ ను చికాకుపరచేలా భవిష్యత్తులో గజ్వేల్ నుంచే చేరికలు ఉంటాయని కూడా ఈటల చెప్పడం చూస్తే.. ప్లాన్ అంతా రెడీ అయిందని, ఇక అమలు చేయడమే తరువాయిగా మిగిలిందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మరి ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో.. గజ్వేల్ నే ఎంచుకుంటే.. కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరో చోటికి మారేలా.. టీఆర్ఎస్ కేడర్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీసేలా బీజేపీ నేతలు వ్యూహం పన్నారా? లేక సీఎం నియోజకవర్గంవర్గంలో ప్రాజెక్టులపై వ్యతిరేకత రావడం వల్లే కేసీఆర్ పై గెలవడం ఈజీ అవుతుందని ఈటల భావిస్తున్నారా? అదీకాకపోతే కేవలం బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా వ్యూహ రచనలో భాగంగానే ఈటల ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి షా టార్గెట్ ఏవిధంగా ఉంటుందీ.. ఈటల ఏ విధంగా అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిందే. 

Comments

  1. కెసిఆర్, కేటీఆర్ గారి తలపోగరు మాటలకు ప్రజలు బుద్ధి చెప్పే

    ReplyDelete
  2. రోజు దగ్గరలోనే ఉంది.. భాహుషా అమిత్ షా గారి ప్యుహం ఫలించ వచ్చు..

    ReplyDelete

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.