Skip to main content

Posts

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే

ఉర్రూతలూగించే ఉయ్యాలవాడ వీరగాథ (సచిత్రంగా)

భార‌త స్వ‌ాతంత్ర్య పోరాట‌ తొలి గ‌ర్జ‌న ఆయన‌ది. సీమ పౌరుషానికి ప్ర‌తీక ఆయ‌న‌. ఆయ‌న పేరు చెబితే ఇంకా మీసం మొలవని కిశోరాలు కూడా మూతి మీద చెయ్యేసుకుని పొంగిపోతారంటే అతిశయోక్తి కాదు. ఆయనే.. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్య‌పు కోట‌ల‌కు బీట‌లు పెట్టిన సీమ సింహం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. అద్భుతమైన ఆయన పోరాటానికి చ‌రిత్ర‌లో ప్రముఖ స్థానం దక్కకపోవచ్చు గానీ.. రాయల‌సీమ గ్రామాల్లో ఆయ‌న కీర్తి అజ‌రామ‌రం. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆ వీరుడి వీర‌గాథ ప్రస్తుత కాలానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి Also Read:  భారతీయుడి శౌర్య ప్రతాపం మహారాణా ఉయ్యాలవాడ పేరు చెబితేనే నరనరానా ఉద్యమ స్ఫూర్తి రగులుతుందంటారు రాయలసీమ ప్రజలు. ఆయన పోరాట పటిమ, పౌరుష పరాక్రమాల గురించి స్థానిక భాషలో పాటలు కట్టి పాడుకుంటారు. ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనంపై పాటలు వినిపిస్తుంటాయి. భ‌ర‌త‌మాత దాస్య‌శృంఖ‌ల విముక్తి కోసం తెల్ల దొర‌ల‌పై తెగ‌బ‌డిన ఖ‌డ్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. తెల్ల‌టి గుర్రం.. చేతిలో నాట్య‌మాడే క‌త్తి.. పౌరుషానికి ప్ర‌తీక‌గా మెలితిరిగిన మీసం.. సీమ‌లో పౌరుషాగ

రాష్ట్రపతి విలాసాలు.. రాష్ట్రపతి భవన్ విశేషాలు

ఒక్క భారతదేశంలోనే కాదు.. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యంత దిగువ స్థాయి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తొలి గిరిజన మహిళగా.. ఆమె దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహిస్తున్నారు. అంతేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ పౌరురాలిగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ముకు లభించబోయే అధికారాలేంటి? ప్రభుత్వం నుంచి అందుకునే జీతభత్యాల వివరాలేంటి? ఇతర ప్రత్యేకమైన సదుపాయాలేంటో ఓసారి చూద్దాం. దేశంలో అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశం అనుసరిస్తున్న అత్యున్నతమైన ప్రజాస్వామ్య విధానానికి ఆమె ఎన్నికే ఓ గీటురాయిగా నిలుస్తోందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థాయికి ఎన్నికవడంతో యావత్ గిరిజన జాతి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమె రాష్ట్రపతిగా వేతనం ఎంత అందుకుంటారనేది ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది. భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెల వ

భక్తుల డిమాండ్‎కు తలొగ్గిన శ్రావణభార్గవి

ఒకసారి పాపులారిటీ వస్తే.. దానికి బోనస్ గా నిర్లక్ష్యం కూడా వస్తుందా? అయితే ప్రజల నుంచి నిరసన ఎదురైతే.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ కూడా పేకమేడల్లా కూలిపోక తప్పదు. గాయని శ్రావణభార్గవి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు.. శ్రీవారి భక్తులు. ఇటీవల ఆమె పాడి నటించిన అన్నమయ్య కీర్తన వివాదానికి కేంద్ర బిందువైంది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోను డిలీట్ చేయాలని కోరారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పాటలో అసభ్యత ఏముందని ఎదురు ప్రశ్నించింది కూడా. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారి... అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికీ సిద్ధమయ్యారు. అటు వెంకన్న భక్తులు కూడా శ్రావణభార్గవికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆలస్యంగానైనా తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె మంచి గాయని కావడంతో వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అది కాస్తా వివాదాస్పదం అయ్యాక మరింత వ్యూస్ వచ్చే అవకాశం పెరిగింది. కానీ తప్పనిసరి పరిస్థి

పదవి కోసం రాములమ్మ పలవరింత

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజకీయ నాయకురాలు రాములమ్మ అలియాస్ విజయశాంతి. అయితే రాములమ్మ ఈ మధ్య కాస్త వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ను వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరినా.. నిరాశే మిగులుతుందన్న చర్చ సాగుతోంది. హస్తం పార్టీలో ప్రచారకమిటీ చైర్ పర్సన్ పదవిని వదులుకున్న విజయశాంతి.. కమల దళంలో తనకంతా పాతమిత్రులే కదా.. తగిన ప్రాధాన్యమిస్తారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె పార్టీలో చేరి దాదాపు రెండేళ్లవుతున్నా.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత గల పదవులూ రాకపోవడంతో ఆమె అనుచరులు, అభిమానులు రాములమ్మ నిరాశలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారట. ఆమె పార్టీలో చేరిన ఆరునెలల్లో.. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పదవి కేటాయించి ఢిల్లీ పెద్దలంతా ఇక సైలెంటయ్యారన్న చర్చ పార్టీలో సాగుతోంది.  Also Read: కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు Also Read: కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు వాజ్‎పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయశాంతి యాక్టివ్ గా పనిచేశారు. ఆ తరువాత అనేక కారణలతో ఆమె పార్టీ మారారు

కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు

కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా.. ఒక్కటయ్యేది మాత్రం దావత్ దగ్గరే. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో దావత్ లకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడూ అసమ్మతులతో, అసంతృప్తులతో రగిలిపోయే టీ-కాంగ్రెస్ నేతల్ని ఒక్కటి చేయాలంటే ఈ దావత్ ల స్ట్రాటజీ అయితేనే బాగుంటుందని ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ భావించినట్టున్నారు. అందుకోసం స్పెషల్ గా ప్లాన్ చేశారు.  టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం, హెచ్చరికల పర్వం ముగిసి.. విందు రాజకీయాల పర్వం నడుస్తోంది. ఈ మధ్య పార్టీకి మాంచి ఊపొచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇకనైనా అంతర్గత కుమ్ములాటలు అదుపు చేయకపోతే లాభం ఉండదని భావించారు. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలు రూపుమాపాలని మాణిక్కం ఠాగూర్ ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. తన రెండు రోజుల పర్యటనలో హైదరాబాద్ వచ్చిన ఠాగూర్.. ఈసారి నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాలకు తెరలేపారు. బ్రేక్ ఫాస్ట్ ఒక నేత ఇంట్లో చేస్తే.. లంచ్ ఇంకో లీడర్‎సాబ్ ఇంట్లో చేయడం.. అందరికీ యాక్సిస్ ఉండే చోట మరో చోట రాత్రిపూట చేతులు కడగడం. ఇదీ ఠాగూర్ నిర్ణయించుకున్న ప్రోగ్రామ్. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‎గౌడ్‎తో డిన్నర్ ఏర్పాటు చేసినప్పట

విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న ప్రభుత్వం-ఎర్రోజు భిక్షపతి

కాంగ్రెస్, బీజేపీలకు విజ్ఞాపనపత్రాలు ఇస్తాం: ఎర్రోజు భిక్షపతి తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను దారుణంగా అవమానపరుస్తుందని, ఇకనైనా ప్రభుత్వం మోసపుచ్చే ధోరణి విడనాడకపోతే ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారిలో విశ్వబ్రాహ్మణులే ముందువరుసలో ఉంటారన్నారు. అయినా కడు పేదరికంలో మగ్గుతున్న విశ్వబ్రాహ్మణుల పట్ల కనీసం ఇతర బీసీ కులాలకు ఇచ్చిన గౌరవం, ఆదరణ కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండలు అందించిన విశ్వబ్రాహ్మణుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తమ సంఘంలోనే తమకు గొడవలు పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన తమ ప్యానెల్ కు బదులు... అప్రజాస్వామికంగా దొంగదారిలో ఎంపికైన సంఘాన్ని గుర్తించి అలా ఎంపికైన సంఘానికే ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల స్థలాన్ని, రూ. 5 కోట్లను కేటాయించడం పూర్తి అన్యాయమన్నారు. అప్రజాస్వామిక సంఘాన్ని కొందరు టీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని, అది