Skip to main content

కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు

కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా.. ఒక్కటయ్యేది మాత్రం దావత్ దగ్గరే. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో దావత్ లకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడూ అసమ్మతులతో, అసంతృప్తులతో రగిలిపోయే టీ-కాంగ్రెస్ నేతల్ని ఒక్కటి చేయాలంటే ఈ దావత్ ల స్ట్రాటజీ అయితేనే బాగుంటుందని ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ భావించినట్టున్నారు. అందుకోసం స్పెషల్ గా ప్లాన్ చేశారు. 

టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం, హెచ్చరికల పర్వం ముగిసి.. విందు రాజకీయాల పర్వం నడుస్తోంది. ఈ మధ్య పార్టీకి మాంచి ఊపొచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇకనైనా అంతర్గత కుమ్ములాటలు అదుపు చేయకపోతే లాభం ఉండదని భావించారు. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలు రూపుమాపాలని మాణిక్కం ఠాగూర్ ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. తన రెండు రోజుల పర్యటనలో హైదరాబాద్ వచ్చిన ఠాగూర్.. ఈసారి నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాలకు తెరలేపారు. బ్రేక్ ఫాస్ట్ ఒక నేత ఇంట్లో చేస్తే.. లంచ్ ఇంకో లీడర్‎సాబ్ ఇంట్లో చేయడం.. అందరికీ యాక్సిస్ ఉండే చోట మరో చోట రాత్రిపూట చేతులు కడగడం. ఇదీ ఠాగూర్ నిర్ణయించుకున్న ప్రోగ్రామ్. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‎గౌడ్‎తో డిన్నర్ ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదని నేతలంతా వాపోతున్నారట. నేతల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన విందులో... ఎవరైతే పార్టీలో అంతర్గత అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ నేతలే హాజరు కాకపోవడంతో విందు సమన్వయ రాజకీయం కాస్తా జస్ట్ భోజనాలతోనే ముగిసిందట.

Also Read: కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు

ఆదివారం మధ్యాహ్నం కోమటిరెడ్డి ఏర్పాటు చేసిన లంచ్ మీట్‎లో ఠాగూర్‎తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు. అక్కడ సునీల్ రిపోర్టు ఆధారంగా జరిగిన చేరికలు, అంతర్గత అంశాలు, షర్మిల పార్టీ ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయట. అయితే ఇలాంటి కీలక విందుకు కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డిని ఆహ్వానించినా.. రేవంత్ మాత్రం హ్యాండిచ్చారు. ఆ టైమ్ కి ఆయన వేరే ప్రోగ్రాంలో పాల్గొనడంతో ఈ లంచ్ మీట్ నిష్ప్రయోజనంగా మారిందని నేతలు వాపోతున్నారు. దీంతో అసలైన అంశాలకు బదులు పస లేని అంశాలమీదనే చర్చించుకోవాల్సి వచ్చిందట. అంతకుముందు ఉదయం జానారెడ్డితో ఠాగూర్ ఒక రహస్య ప్రదేశంలో అల్పాహార విందులో పాల్గొని పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించినట్లు సమాచారం. ఈ బ్రేక్‎ఫాస్ట్ మీట్‎లో ఎవరెవరు పాల్గొన్నారన్నది బయటకు పొక్కకుండా నేతలంతా సీక్రసీ మెయింటెయిన్ చేయడం మాత్రం విశేషంగానే భావించాలి. 

ఇదంతా ఒక ఎత్తయితే పార్టీ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూసిన డిన్నర్ మీట్‎కి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్ ను వ్యతిరేకించే ఇతర నేతలు మాత్రం ఈ విందుకు యథావిథిగా హాజరయ్యారు. అసలు విందు ఏర్పాటు చేసిందే నేతల మధ్య సమన్వయం కోసమని.. కానీ ఎవరైతే పార్టీ పట్ల బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ  పీసీసీ మీద అసంతృప్తిగా ఉన్నారో.. ఆ నేతలే హాజరు కాకపోవడంతో సమన్వయ విందు కాస్తా ఆ ఇద్దరు కీలక నేతల గైర్హాజరుతో భోజనాలకే పరిమితమైందట. ఉన్న కొంతమంది నేతలు పార్టీ అంశాలు చర్చించినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో కొంతమంది నైరాశ్యంలో మునిగిపోయారని సమాచారం. అయితే మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి రేవంత్ రాకపోవడం.. పీసీసీ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ కి కోమటిరెడ్డి రాకపోవడం.. ఇల్లు కూడా పక్కనే ఉన్న జగ్గారెడ్డి కూడా అలాగే వ్యవహరించడంతో పీసీసీ డిన్నర్ మీట్ అంశం హాట్ టాపిగ్గా మారింది. నేతలందరి ఇళ్లు కూడా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో.. ఇలాంటి విందుల వల్ల ఒరిగేదేంటి అనుకొని నేతలంతా నిట్టూర్పులు విడిచారట. 

ముఖ్యనేతలంతా సమన్వయ విందులకు డుమ్మా కొట్టడంతో.. ఇప్పట్లో టీ-కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కష్టమేనని భావిస్తున్నారట. పార్టీ జోష్ లో ఉన్న సమయంలో బహిరంగ వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్‎లు పోకుండా.. సమన్వయం కోసం ఠాగూర్ చేసిన విందు రాజకీయం బెడిసికొట్టడంతో.. మరి సమన్వయం కోసం అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 


Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో