Skip to main content

కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు

కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా.. ఒక్కటయ్యేది మాత్రం దావత్ దగ్గరే. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో దావత్ లకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడూ అసమ్మతులతో, అసంతృప్తులతో రగిలిపోయే టీ-కాంగ్రెస్ నేతల్ని ఒక్కటి చేయాలంటే ఈ దావత్ ల స్ట్రాటజీ అయితేనే బాగుంటుందని ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ భావించినట్టున్నారు. అందుకోసం స్పెషల్ గా ప్లాన్ చేశారు. 

టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం, హెచ్చరికల పర్వం ముగిసి.. విందు రాజకీయాల పర్వం నడుస్తోంది. ఈ మధ్య పార్టీకి మాంచి ఊపొచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇకనైనా అంతర్గత కుమ్ములాటలు అదుపు చేయకపోతే లాభం ఉండదని భావించారు. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలు రూపుమాపాలని మాణిక్కం ఠాగూర్ ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. తన రెండు రోజుల పర్యటనలో హైదరాబాద్ వచ్చిన ఠాగూర్.. ఈసారి నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాలకు తెరలేపారు. బ్రేక్ ఫాస్ట్ ఒక నేత ఇంట్లో చేస్తే.. లంచ్ ఇంకో లీడర్‎సాబ్ ఇంట్లో చేయడం.. అందరికీ యాక్సిస్ ఉండే చోట మరో చోట రాత్రిపూట చేతులు కడగడం. ఇదీ ఠాగూర్ నిర్ణయించుకున్న ప్రోగ్రామ్. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‎గౌడ్‎తో డిన్నర్ ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదని నేతలంతా వాపోతున్నారట. నేతల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన విందులో... ఎవరైతే పార్టీలో అంతర్గత అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ నేతలే హాజరు కాకపోవడంతో విందు సమన్వయ రాజకీయం కాస్తా జస్ట్ భోజనాలతోనే ముగిసిందట.

Also Read: కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు

ఆదివారం మధ్యాహ్నం కోమటిరెడ్డి ఏర్పాటు చేసిన లంచ్ మీట్‎లో ఠాగూర్‎తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు. అక్కడ సునీల్ రిపోర్టు ఆధారంగా జరిగిన చేరికలు, అంతర్గత అంశాలు, షర్మిల పార్టీ ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయట. అయితే ఇలాంటి కీలక విందుకు కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డిని ఆహ్వానించినా.. రేవంత్ మాత్రం హ్యాండిచ్చారు. ఆ టైమ్ కి ఆయన వేరే ప్రోగ్రాంలో పాల్గొనడంతో ఈ లంచ్ మీట్ నిష్ప్రయోజనంగా మారిందని నేతలు వాపోతున్నారు. దీంతో అసలైన అంశాలకు బదులు పస లేని అంశాలమీదనే చర్చించుకోవాల్సి వచ్చిందట. అంతకుముందు ఉదయం జానారెడ్డితో ఠాగూర్ ఒక రహస్య ప్రదేశంలో అల్పాహార విందులో పాల్గొని పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించినట్లు సమాచారం. ఈ బ్రేక్‎ఫాస్ట్ మీట్‎లో ఎవరెవరు పాల్గొన్నారన్నది బయటకు పొక్కకుండా నేతలంతా సీక్రసీ మెయింటెయిన్ చేయడం మాత్రం విశేషంగానే భావించాలి. 

ఇదంతా ఒక ఎత్తయితే పార్టీ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూసిన డిన్నర్ మీట్‎కి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్ ను వ్యతిరేకించే ఇతర నేతలు మాత్రం ఈ విందుకు యథావిథిగా హాజరయ్యారు. అసలు విందు ఏర్పాటు చేసిందే నేతల మధ్య సమన్వయం కోసమని.. కానీ ఎవరైతే పార్టీ పట్ల బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ  పీసీసీ మీద అసంతృప్తిగా ఉన్నారో.. ఆ నేతలే హాజరు కాకపోవడంతో సమన్వయ విందు కాస్తా ఆ ఇద్దరు కీలక నేతల గైర్హాజరుతో భోజనాలకే పరిమితమైందట. ఉన్న కొంతమంది నేతలు పార్టీ అంశాలు చర్చించినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో కొంతమంది నైరాశ్యంలో మునిగిపోయారని సమాచారం. అయితే మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి రేవంత్ రాకపోవడం.. పీసీసీ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ కి కోమటిరెడ్డి రాకపోవడం.. ఇల్లు కూడా పక్కనే ఉన్న జగ్గారెడ్డి కూడా అలాగే వ్యవహరించడంతో పీసీసీ డిన్నర్ మీట్ అంశం హాట్ టాపిగ్గా మారింది. నేతలందరి ఇళ్లు కూడా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో.. ఇలాంటి విందుల వల్ల ఒరిగేదేంటి అనుకొని నేతలంతా నిట్టూర్పులు విడిచారట. 

ముఖ్యనేతలంతా సమన్వయ విందులకు డుమ్మా కొట్టడంతో.. ఇప్పట్లో టీ-కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కష్టమేనని భావిస్తున్నారట. పార్టీ జోష్ లో ఉన్న సమయంలో బహిరంగ వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్‎లు పోకుండా.. సమన్వయం కోసం ఠాగూర్ చేసిన విందు రాజకీయం బెడిసికొట్టడంతో.. మరి సమన్వయం కోసం అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత