ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది. Also Read: తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర? Also Read: ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే.. పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా రామతీర్థం కొండమ
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.