Skip to main content

weekend story- కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి

Weekend Story: ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు

IMP Story: ఎంఐఎంతో పొత్తు కోసం తహతహ ఇందుకేనా?

మానవ జిహ్వ చాపల్యానికి వీకెండ్స్ లో ఎన్ని మూగజీవాలు క్యూ కట్టి బలవుతున్నాయో ఊహించజాలం. అయితే మానవులు జిహ్వచాపల్యాన్ని అణచుకోకుండానే మూగజీవాలు సంతోషించే రోజు రానే వచ్చింది. దాదాపు పదేళ్లుగా జరుగుతున్న ప్రయోగాలకు ఎండ్ కార్డ్ పడుతోంది. మార్కెట్ లోకి కృత్రిమ చికెన్ వచ్చేసింది. భవిష్యత్తులో కోళ్లన్నీ ఆనందించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ్టి నుంచే (డిసెంబర్ 19) సింగపూర్లో కృత్రిమ చికెన్ "రెస్టారెంట్ 1880" లోకి అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. చికెన్ సెల్స్ నుంచి మాంసకృత్తులను డెవలప్ చేసి ల్యాబ్ లో తయారుచేసిన చికెన్ సింగపూర్ రెస్టారెంట్లలో ఇవాళ్టి డిన్నర్ నుంచే ఘుమఘుమలాడుతుంది. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న కుర్రాళ్లే ఈ కృత్రిమ చికెన్ తొలి వినియోగదారులు కావడం విశేషం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈట్ జస్ట్ కంపెనీయే సింగపూర్ లో దాని ఉత్పత్తిని తొలిసారిగా మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ సీఈఓ లీ-కా-షింగ్ సింగపూరియన్ కావడం గమనించాలి. వచ్చే సంవత్సరం నాటికి ల్యాబ్ చికెన్ కు పూర్తిస్థాయి మార్కెటింగ్ సౌలభ్యం కల్పిస్తామని, వచ్చే దశాబ్దం నాటికి కృత్రిమ మాంసాహారం ఒక ప్రత్యామ్నాయంగా రూపుదాలుస్తుందని ఈట్ జస్ట్ సంస్థ భావిస్తోంది. 

Useful Links: https://www.scmp.com/business/companies/article/3114107/eat-justs-cell-grown-chicken-backed-li-ka-shings-horizons

                        https://www.news18.com/news/buzz/lab-grown-chicken-meat-to-make-its-debut-in-singapore-restaurant-will-it-be-a-game-changer-3192947.html

ప్రపంచవ్యాప్తంగా శాకాహారం పట్ల అవగాహన పెరగడం, పర్యావరణ ఉద్యమాలు ఊపందుకోవడం, కోవిడ్ తరువాత జీవజాలం పట్ల సానుభూతి పెరగడం వంటి అనేక కారణాలతో కృత్రిమ మాంసం వైపు జనం ఆలోచన క్రమంగా మళ్లుతోంది. దీంతో కృత్రిమ మాంసాహారానికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...