Skip to main content

వీకెండ్ స్టోరీ-ఏపీలో విగ్రహాల విధ్వంసకాండ ఆపాల్సింది ఎవరు?

ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది. 

Also Read: తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read: ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే..


పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా రామతీర్థం కొండమీదున్న రాముడి విగ్రహం తల నరికి బావిలో పడేశారు. ఆ దృశ్యం చూస్తుంటే.. రామరాజ్యం గురించి మన గాంధీజీ కానీ, మన పెద్దవారు కానీ గొప్పగా చెప్పిన మాటలు.. మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎంతగా ప్రతిఫలిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన దృశ్యం
రాజమండ్రిలో సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు, కాళ్లు నరికివేత
విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

ఆంధ్రాలో కేవలం ఈ రెండు సంఘటనలేనా? అబ్బో.. ఇలాంటి ఘనకార్యాలు ఏపీలో చాలానే జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలోనూ హిందూ దేవతా విగ్రహాల విధ్వంసకాండ నిరాటంకంగా సాగిపోయింది. ఇప్పటికీ సాగిపోతోంది. హిందూ సెంటిమెంట్ల గురించి తప్ప అన్ని ఇతర మతాల సెంటిమెంట్లకూ టాప్ ప్రయారిటీ ఇచ్చే పాలకులు... దేవలయాలపై దాడులపై శ్వేతపత్రం విడుదల చేయకపోవచ్చు కానీ.. గూగులమ్మను అడిగితే ఆ జాబితా ఏదో ప్రపంచం కళ్లముందు పెడుతుంది. గతేడాది సెప్టెంబర్ 17న కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది చాలా పురాతన దేవాలయం 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ మరుసటి రోజే యేలేశ్వరంలో హనుమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. సెప్టెంబర్ 6న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని కాల్చేశారు. ఈ రథానికి వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజలంతా పట్టరాని ఆగ్రహంతో ఆందోళనలు చేశారు. దుండగులెవరో పట్టిచూపే సీసీటీవీలు కూడా ఆ టైమ్ కి పని చేయకపోవడంలోనే.. అంతర్వేది ఘటనలో కాకతాళీయత ఎంతుంది.. కాకమ్మ కబుర్లు ఎన్నున్నాయి అనేది చెప్పకనే చెబుతోంది. అందుకే అధికారులు ఈవో ను సస్పెండ్ చేసి ప్రజాగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. 

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడుల లిస్టు కొండవీటి చాంతాడును మించిపోతుంది. అమ్మల గన్నయమ్మ బెజవాడ దుర్గమ్మగా భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి రథం మీది విగ్రహాలు కూడా మాయమైపోయాయి. దుర్గగుడిలో వెండి విగ్రహాలకే రక్షణ లేదంటే.. చిన్నచిన్న పుణ్యక్షేత్రాల సంగతేంటి? అంతకుముందు సెప్టెంబర్ 26న గంగాధర నెల్లూరులో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని కాల్చి బుగ్గి చేశారు. బూడిద కుప్ప తప్ప.. రథం ఆనవాళ్లు కూడా మిగల్చలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో హిందూ దేవీ-దేవతా విగ్రహాల విధ్వంసం ప్రపంచాన్ని నివ్వెరపరచింది. గణేశుడు, హనుమాన్, సాయిబాబా, దుర్గామాత ల విగ్రహాలను ధ్వంసం చేసి.. యవనులు, హూణుల కన్నా తామేం తక్కువ కాదని చాటుకున్నారు. ఆ విగ్రహాలు కూల్చడానికి భారీ సమ్మెటలే వాడారంటే... హిందూ ధర్మం మీద, హిందువుల ఆచరణల మీద.. ఈ దుర్మార్గులకు ఎంత విద్వేషం ఉందో ఊహించవచ్చు. మొన్నటికి మొన్న క్రిస్మస్ రోజున.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సోదరుడు గోవిందమాలలో ఉండి ఏసుకీర్తనలు ఆలాపించాడు. పక్కనే ధర్మశ్రీ కూడా ఉన్నారు. 

అసలు హిందూ దేవాలయాల వల్ల ఇతరులకు ఏం నష్టమొచ్చింది? వారికొచ్చిన ఇబ్బందేంటి? నిశ్శబ్దంగా తమ సంప్రదాయాలు పాటించడమే హిందువులు చేస్తున్న తప్పా? ఇన్ని జరుగుతున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా ఎందుకు ఉండడం లేదు? ఎమ్మెల్యేదో, ఎంపీదో బొచ్చు కుక్క కనిపించకపోతే నానా హైరానా పడిపోయే అధికారులు, బడాబాసులు.. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్లకు మాత్రం విలువ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటి? ఏపీలో ఇలాంటి దురాగతాలు అర్ధసెంచరీ దాటిపోయాయి. అసలు ఈపాటికే సీబీఐ విచారణకు రూట్ క్లియర్ చేయాల్సింది. కానీ ఎందుకని పట్టించుకోవడం లేదు? మన దేశంలోని మెజారిటీ ప్రజలు సహజంగానే శాంతి స్వభావులు. వారిలో ఎన్ని విభేదాలున్నా, ఎన్ని హెచ్చుతగ్గులున్నా సెంటిమెంట్లు హర్టయితే మాత్రం సహించజాలరు. ప్రజల సెంటిమెంట్లు హర్టయిన చోట ప్రభుత్వాలకు ఏం రుచి చూపారో ఇప్పటికే చూశాం. అలాంటి పరిస్థితిని ఏపీ పాలకులు తెచ్చుకోకుంటే మంచిదని కోరుకోవడం మినహా.. ఇతరులు చేయగలిగిందేమీ లేదు.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత