Skip to main content

తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read: ఆవు పేడతో చెప్పుల తయారీ

Weekend Story: కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి

Weekend story: హండ్రెడ్ పర్సెంట్ హరామ్
Weekend Story:
 ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు

ప్రభుత్వాలు కంటికి కనిపించని కుట్రలకు పాల్పడతాయా? అలాంటి అవకాశం ఉంటుందా? రాజకీయాలను, వాటి చుట్టూ పెనవేసుకున్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏమైనా జరగొచ్చని అనిపించక మానదు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాలను కాస్త లోతుగా పరిశీలిస్తే లోపాలతో పాటు.. కొన్ని కుట్రలు కూడా జరిగాయన్న విషయం తెలుస్తుంది. 

అధికార టీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా నమోదైంది. 35.73 శాతంతో 11,92,162 ఓట్లతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. 35.55 శాతంతో 11,86,096 ఓట్లు సాధించిన బీజేపీ రెండో స్థానంలో ఉంది. అంటే టీఆర్ఎస్ కు, బీజేపీకి 0.18 శాతం ఓట్ల స్వల్ప దూరం మాత్రమే ఉందన్నమాట. ఒక్క శాతం తేడా కూడా లేని ఓట్ల శాతంతో జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఇక 18.91 శాతంతో 6,30,867 ఓట్లు మాత్రమే పొందిన ఎంఐఎం 44 డివిజన్లలో జెండా ఎగరేసి మూడో స్థానంతో తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక కాంగ్రెస్ 6.61 శాతంతో 2,20,504 ఓట్లు పొంది 2 సీట్లు మాత్రమే గెలవగా... టీడీపీ 1.65 శాతంతో 55,287 ఓట్లు పొంది ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే... టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్లతో పోలిస్తే ఎంఐఎంకి ఎలా ఎక్కువ ఫలితాలు వచ్చాయి? మొత్తం ఓట్లలో 35.73 శాతం, 35.55 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్, బీజేపీలకన్నా చాలా తక్కువ ఓట్లు... అంటే 18.91 శాతం మాత్రమే వచ్చిన ఎంఐఎంకు ఈ స్థాయిలో సీట్లు ఎలా సాధ్యమయ్యాయి? 

టీఆర్ఎస్: 35.73 శాతం (11,92,162 ఓట్లు) 56 సీట్లు

బీజేపీ: 35.55 శాతం (11,86,096 ఓట్లు) 48 సీట్లు

తేడా: 0.18 శాతం మాత్రమే

ఎంఐఎం: 18.91 శాతం (6,30,867 ఓట్లు) 44 సీట్లు

ఎంఐఎం గెలిచిన డివిజన్లు అన్నీ ఆ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న పాతబస్తీ పరిధిలోనివేనని గమనించాలి. ఈ ప్రాంతంలో తక్కువ ఓటర్ల సంఖ్యతో ఎక్కువ డివిజన్లు ఏర్పాటు చేయడమే అందుక్కారణమని గమనించాలంటున్నారు ఎన్నికల నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ, డివిజన్లు తక్కువ.. ఈ వ్యత్యాసం జీహెచ్ఎంసీ డివిజన్లకే పరిమితం కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాద్ పార్లమెంట్ సీటు విషయంలో కూడా కనిపిస్తుంది. దశాబ్దంన్నర క్రితం డివిజన్లు, నియోజవర్గాల పునర్విభజన, సరిహద్దులను కుట్రపూరితంగా ఏర్పాటు చేశారని ఎన్నికల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు 5 లోపు ఉండే మజ్లిస్ అసెంబ్లీ సీట్లు 7 కి పెరిగాయి. జీహెచ్ఎంసీలో కూడా ఆ పార్టీ... జనాభా నిష్పత్తికన్నా ఎక్కువ సీట్లు పొందడం సాధ్యమవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ లో ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన దాఖలాలు కనిపిస్తాయి. గతంలో కాంగ్రెస్  అనుసరించిన పంథానే ఇప్పుడు టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఎన్టీఆర్ హయంలో టీడీపీ కూడా ఎంఐఎంతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకుంది. కనీసం వచ్చే ఎన్నికలనాటికైనా నిష్పాక్షికంగా డివిజన్లు, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇలాంటి అనారోగ్యకరమైన హెచ్చుతగ్గులకు బ్రేకు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి అన్ని పార్టీలూ ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత