Skip to main content

Posts

మోడీ తీసుకున్న టాప్ టెన్ సంచలన నిర్ణయాలు

ఆయనో మహోన్నత వ్యక్తి. ఆయన నామ స్మరణతో యావద్దేశం ఊగిపోతోంది. ఆయనో సమ్మోహన శక్తి. ప్రవాహంలా సాగే  ప్రసంగానికి సభికులు మంత్రముగ్ధులైపోతారు. ఆయన చేసే ప్రతీ పని ఓ సంచలనమే. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని పదవికే వన్నె తెచ్చిన వజ్ర సంకల్పుడు. పదవి చేపట్టిన నాటి నుంచి ప్రతి నిర్ణయంలో తనదైన ముద్ర వేస్తూ ..  ప్రత్యేకత చాటుకుంటున్నారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో  అసమాన దౌత్య విజయాలను అందించడం  ఆయన చతురతకు నిదర్శనం. ఆయన పాలనలో తీసుకున్న సంచలనాత్మక విజయాలు మచ్చుకు ఓ పది.    జమ్ము కశ్మీర్ పై  కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అయితే ఇది అందరూ అనుకున్నట్లు కొద్దిరోజుల్లో జరిగిన ప్రక్రియ ఎన్నటికీ  కాదు. ప్రతినిత్యం తుపాకుల మోతతో ..కంటి నిండా నిద్ర కరువైన జమ్ము కశ్మీర్ కు శాశ్వత పరిష్కారం కోసం బీజేపీ ఏనాడో ప్రతిన బూనింది. ఏక్‌ దేశ్‌ మే.. దో విధాన్‌, దో ప్రధాన్‌, ఔర్‌ దో నిశాన్‌ నహీ చలేగీ అని మాజీ ప్రధాని వాజపేయి నినదించారు. ఇది జనసంఘ్‌ కాలం నుంచి బీజేపీ  మౌలిక సిద్ధాంతం. 370 అధికరణపై బీజేపీ తొలినుంచి ఒకే పంథా అనుసరిస్తూ వస్తోంది. మోడీ పాలనలో భారతీయుల  

స్వరాష్ట్రమే శ్వాసగా బతికిన జయశంకర్ సార్

పుట్టుక నీది, చావు నీది...బ్రతుకంతా దేశానిది. కాళోజీ చెప్పిన ఈ మాటలు అచ్చుగుద్దినట్లు ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు సరిపోతాయి. ఆయన జీవితం తెలంగాణకే అంకితం అన్నట్లు సాగింది. తెలంగాణ కోసమే సార్ పుట్టారా? అన్నట్లు జీవించారాయన. నీళ్లు, నిధుల, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు. స్వయంపాలనతోనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, భావజాల వ్యాప్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్మరాయన. చివరి వరకు అందుకోసమే పోరాడారు. అలాంటి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సమున్నత గౌరవం లభించలేదని వాదనలున్నాయి. అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నప్పటికీ...సార్‌కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటున్నారు. ఆచార్య కొత్త పల్లి జయంశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంత కర్త. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటి....జాతి మొత్తాన్ని చైతన్య పరిచిన వ్యక్తి. భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకోవచ్చని గట్టిగా నమ్మి...అందుకోసం జీవితమంతా ధారపోసిన మహోన్నతుడు. స్వరాష్ట్రం కోసం ప్రజలను పోరుబాట దిశగా జాగృతం చేసిన స

ఏపీలో న్యూ ప్రొడక్షన్ విత్ మోడీ డైరెక్షన్

ఏపీలో జనసేన ఇకపై క్రియాశీల పాత్ర పోషించబోయే అవకాశం కనిపిస్తోంది. అందుకు బీజేపీ నేతల డైరెక్షన్ చాలా కీలకంగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పవన్ నేర్చుకున్న పాఠాలతో బీజేపీతో దోస్తీ కట్టడం తప్పదన్న సంకేతాలు ఆ పార్టీ పరివారం నుంచి పొక్కుతున్నాయి. అయితే ఎన్నికల్లో పార్టీ విఫలమైనా తామేం కుంగిపోలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్న పవన్... భవిష్యత్తు ప్రణాళికలను ఢిల్లీ పెద్ద కనుసన్నల్లోనే రచించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.  ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేన ఇపుడిపుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే పార్టీ ఓటమి నుంచి తేరుకుంటున్న పవన్ కు మరో నాలుగేళ్లు పార్టీని నడపడం మాత్రం కత్తి మీద సామే అవుతుంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి.  ఏపీలో అధికార పార్టీ దూకుడుని తట్టుకుని నిలబడటం పవన్ కు సాధ్యమయ్యే పనికాదని, దీనికితోడు పవన్ కు ఆర్థికంగా అండదండలు కూడా లేకపోవడం అందుకు మరోకారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ క్య

<అసదుద్దీన్ కి తమ్ముడే తలనొప్పి>

తమ్ముడంటే ఎలా ఉండాలి? రాముడికి లక్ష్మణుడిలా ఉండాలి. అన్న గౌరవాన్ని పెంచేలా తమ్ముడు నడుచుకోవాలి. కానీ.. అన్న నిర్మించుకుంటూ వస్తున్న గౌరవ-మర్యాదలను వెనుక నుంచి కూల్చేస్తూ రావడం... బాధ్యత గల తమ్ముడు చేయాల్సిన పనేనా? తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని.... సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్న బిల్డప్ చేస్తూ వస్తుంటే... తమ్ముడు చేసే దుందుడుకు వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయి? టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ లో అన్నదమ్ముల మధ్య పొసగని అభిప్రాయాలతో భారీ మూల్యం తప్పదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  దశాబ్దాలుగా పాతబస్తీలో పాగావేసిన మజ్లిస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నట్లే కనిపిస్తోంది.  హైదరాబాద్ లో ఒవైసీ సోదరుల గురించి పరిచయం అక్కర్లేదు. తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ హయాంలో ఎంఐఎం ఓ వెలుగు వెలిగింది. ఆయన అనంతరం పార్టీని నడిపిస్తున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్  ఒవైసీల ఆధ్వర్యంలో కూడా పార్టీ దూసుకుపోతోంది. అందులో నో డౌట్. అయితే సహోదరుల మధ్య వ్యవహారాల్లో మాత్రం కొన్ని భిన్న వైఖరులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  అన్న అడుగుజాడల్లో అక్బర్ నడుస్తున్నట్లే కనిపిస్తున్

ఒవైసీ బ్రదర్స్ తో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

రాజకీయాల్లో ఒకరి నిర్లక్ష్యమే ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవతలి వ్యక్తి అతి విశ్వాసమే ఇవతలి వ్యక్తికి ఆయుధం అవుతుంది. సంఖ్యాబలంతోనే సర్వత్రా నెగ్గుకొస్తానంటే కుదరదు. ప్రజల్లో పాదుకున్న సెంటిమెంట్లేంటో అర్థం చేసుకొని అడుగేయాలి. అలా కాకపోతే విపక్షం చేతిలోనే పరాభవం చవి చూడక తప్పదు. తెలంగాణలో వికసించేందుకు బీజేపీ శక్తినంతా ప్రయోగిస్తున్న సమయంలో... కేసీఆర్ విస్మరిస్తున్న కీలకమైన అంశాలేంటో చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.  తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ....స్వయంగా కేసీఆరే ఛాన్స్‌ ఇస్తున్నారా? కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే స్కెచ్ రెడీ చేసిందా? మిత్రపక్షమైన ఎంఐఎం ఏం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? తెలంగాణలో మతసామరస్యానికి ముప్పు వాటిల్లిందా? అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై టీఆర్ఎస్‌ వైఖరేంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బర్ చేసిన కామెంట్స్ ను కేసీఆర్ ఉపేక్షిస్తే...జరిగే పరిణామాలేంటి?  తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్...కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా చెప్పే మాట ఇది. నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే...తెలంగాణలో మతసామరస్యం చాలా ఎక్కువ. ఇది చాల

"జమిలి".. ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఓ మజిలీ

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మరి దేశమంతా అన్ని రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ కు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మనకు ఎంతవరకు శ్రేయస్కరం? కేవలం ఖర్చు తగ్గించుకోవడం కోసమే జమిలికి వెళ్లాలా? లేక పరిపాలనా సౌలభ్యం అంతకంటే ముఖ్యమా? మొన్ననే ఎన్నికలు జరుపుకున్న తెలంగాణ గానీ, ఆంధ్రా గానీ.. పూర్తి కాలం ముగియకుండానే మరోసారి ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల కలిసొచ్చేది ఎవరికి? కష్టకాలం దాపురించేది ఎవరికి? ఇలా అన్ని వర్గాల దేశ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న జమిలితో మిగిలేదేమిటి? మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవభారత ఎజెండాకు రూపమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మోదీ 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సంకేతాలు  బలంగా వినిపిస్తున్నాయి.  లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది నవభారత ఎజెండాలో తొలి ప్రాధాన్య అంశం. దీన్ని  దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనసులూ గెలుచుకునేందుకు మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. అంతేకాకుండా ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ప్రబల ఆర్థికశక్తిగా మార్చాల

సంధ్యావందనమ్

.. శ్లో! యస్స్మరే ద్విశ్వకర్మాణం సానగాది యుతంవిభుం 'సృష్టిస్థిత్య స్తక ర్తారం -సబాహ్యాభ్యన్తరశ్శుచిః ఓం కేశ వాయస్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయస్వాహా ఓం"గోవిందాయనమః విష్ణ వేనమః మధు సూదనాయనమః త్రివిక్రమాయననుః వామనాయనమః శ్రీధ రాయనమః హృషీకేశాయనమః పద్మనాభాయనమః దామో దరాయనమః సఙ్కర్షణాయనమః వాసుదేవాయనమ్మ ప్రదక్షి మ్నా యనమః అనిరుద్దాయనమః పురుషోత్తమాయనమః అధో ఈ బాయనమః నారసింహాయనమః అచ్యుతాయనమః ఉపేన్గా యనమః హరయేనమః ఓం శ్రీకృష్ణాయనమః స్మృత్యాచమనం కృత్వా:  స్మృత్యాచమనం కృత్వా: ఉ తిష్ఠన్తు భూతపిశాచా ఏతే భూమిభారకా ప్ర తేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమార భౌ# తా!! భూతపిశాచములు ఇష్టం పొవ్ను వ నీ 3 భూతా! పిశిత మళ్నం తి పిశాచాః !! అనగా ధర్మమున గట్టువడక స్వేచ్ఛగా,