Skip to main content

ఏపీలో న్యూ ప్రొడక్షన్ విత్ మోడీ డైరెక్షన్

ఏపీలో జనసేన ఇకపై క్రియాశీల పాత్ర పోషించబోయే అవకాశం కనిపిస్తోంది. అందుకు బీజేపీ నేతల డైరెక్షన్ చాలా కీలకంగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పవన్ నేర్చుకున్న పాఠాలతో బీజేపీతో దోస్తీ కట్టడం తప్పదన్న సంకేతాలు ఆ పార్టీ పరివారం నుంచి పొక్కుతున్నాయి. అయితే ఎన్నికల్లో పార్టీ విఫలమైనా తామేం కుంగిపోలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్న పవన్... భవిష్యత్తు ప్రణాళికలను ఢిల్లీ పెద్ద కనుసన్నల్లోనే రచించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. 



ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేన ఇపుడిపుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే పార్టీ ఓటమి నుంచి తేరుకుంటున్న పవన్ కు మరో నాలుగేళ్లు పార్టీని నడపడం మాత్రం కత్తి మీద సామే అవుతుంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి.  ఏపీలో అధికార పార్టీ దూకుడుని తట్టుకుని నిలబడటం పవన్ కు సాధ్యమయ్యే పనికాదని, దీనికితోడు పవన్ కు ఆర్థికంగా అండదండలు కూడా లేకపోవడం అందుకు మరోకారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ క్యాడర్ కూడా బలీయంగా గానే ఉంది. ఇదే విషయాన్ని కార్యకర్తల సమీక్షలో పవన్ వెల్లడించారు. దీంతో పార్టీకి అండగా ఉన్న అభిమానులను, కార్యకర్తలను కాపాడుకోవాలని పవన్ వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమినుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలీయమైన శక్తిగా మారుస్తానని ప్రతిన బూనారు. బీజేపీతో కలిసి వెళ్తే తప్ప పార్టీని బతికించుకోలేమన్న నిర్ణయానికి వచ్చిన పవన్ .. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.  జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ను ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలపడం తప్ప మరో గత్యంతరం లేదని జనసేన నేతలు భావిస్తున్నారు.  


2014 లో టీడీపీ తో కలిసి పోటీ చేసి 4 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ పరిస్థితి ఇటీవలి ఎన్నికలతో మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చటంతో ఏపీలో నెగ్గుకు రావటం ఆ పార్టీకి కష్టంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. పీపీఏల విషయం లోను, లేదా ప్రజావేదికను కూలగొట్టడంపైనా జగన్ సర్కార్ వైఖరిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ ముఖ్య నేత రామ్ మాధవ్ కూడా రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని జగన్ ప్రభుత్వ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేత పురంధేశ్వరి కూడా ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసినట్లే జగన్ కూడా రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తు్న్నారు. అయితే బీజేపీ వైసీపీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే వైసీపీ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలను ఇప్పటికే తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో ఇక వైసీపీని ఢీ కొట్టడమే తరువాయి అన్నట్టుగా అడుగులు వేస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడానికి సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. ఒకవైపు టీడీపీ నేతల చేరికలు, మరోవైపు జనసేనతో పొత్తు ఉంటే.. వైసీపీని ఢీ కొట్టడం సులభమవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.  



మరోవైపు ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న బీజేపీ... జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని తానా మహాసభల్లో రాం మాధవ్ కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పార్టీనేతలు ఎవరూ నోరుమెదపలేదు. అయితే బీజేపీలో జనసేన విలీనంపై చర్చ జరిగిన సందర్భంగా విలీనం కంటే బీజేపీతో సఖ్యతగా ఉండటమే మేలని  నేతలు సూచించిట్లు తెలుస్తోంది.  పార్టీ విలీనమైతే ఎన్నికల్లో ఘోర ఓటమి కారణంగా జనసేనకు అంతగా ప్రాథాన్యమివ్వరని నేతలు అభిప్రాయ పడుతున్నారు.  దీంతో బీజేపీతో సఖ్యతగా ఉంటేనే  మేలని పవన్ సన్నిహితులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. బీజేపీలో జనసేనను విలీనం చేస్తే ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదని పార్టీనేతలు చెప్పినట్లు సమాచారం. అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినట్లే తమ్ముడు కూడా పార్టీని విలీనం చేశాడనే అపవాదు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రజారాజ్యం విషయంలో జరిగిన ఏ తప్పూ.. జనసేన విషయంలో రిపీట్ కాదని పవన్ గతంలో పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.  అనుభవరాహిత్యం వల్ల అప్పట్లో అన్నయ్య మోసపోయారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరూ వ‌చ్చి.. ఎన్నికల్లో ఓడిపోగానే అందరూ బయటకు వెళ్లిపోయారని.. దాంతో తప్పని పరిస్థితుల్లో అన్నయ్య కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు వన్ కళ్యాణ్.


మరోవైపు ఏపీలో పార్టీని విస్తరించేందుకు దూకుడుగా వెళుతున్న బీజేపీ ...మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీలో చిరంజీవికి ఆయన సామాజిక వర్గంతో పాటు మిగతా అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన కున్న ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు  బీజేపీ అగ్ర నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ సందర్భంగా బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. చిరంజీవి బీజేపీలోకి వస్తే సంతోషంగా స్వాగతిస్తామని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.  2009 ఎన్నికల తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో చేరారు. అయితే, 2014 ఎన్నికల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరు, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సైతం దూరంగా ఉండడం గమనించాల్సిన అంశం. ఇక పవన్ మరో సోదరుడు నాగేంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో తమ్ముడి గెలుపు కోసం శ్రమించారు. ఫలితాలు చూసిన కంగు తిన్న నాగబాబు.. ఆ ప్రభావం నుంచి ఇంకా తాము కోలుకోలేదని, అయినా రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తామని వ్యాఖ్యానించడం విశేషం. దీంతో ఈ ముగ్గురిని లాగేస్తే.. ఏపీలో బీజేపీ పవర్ ఫుల్ శక్తిగా అవతరిస్తుందని భావిస్తున్నారు. 
  
ఈ క్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో అన్నా దమ్ముల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి నిర్ణయం ఏపీ భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు టీడీపీ భవిష్యత్తు కూడా మెగా బ్రదర్స్ నిర్ణయం మీదే ప్రధానంగా ఆధారపడి ఉందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. కొణిదెల బ్రదర్స్ నిర్ణయం ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ యవనికపై ఎలాంటి ప్రభావం చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. 


- టి.రమేశ్ బాబు


- Email: rameshbabut@hotmail.com


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత