Skip to main content

"జమిలి".. ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఓ మజిలీ

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మరి దేశమంతా అన్ని రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ కు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మనకు ఎంతవరకు శ్రేయస్కరం? కేవలం ఖర్చు తగ్గించుకోవడం కోసమే జమిలికి వెళ్లాలా? లేక పరిపాలనా సౌలభ్యం అంతకంటే ముఖ్యమా? మొన్ననే ఎన్నికలు జరుపుకున్న తెలంగాణ గానీ, ఆంధ్రా గానీ.. పూర్తి కాలం ముగియకుండానే మరోసారి ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల కలిసొచ్చేది ఎవరికి? కష్టకాలం దాపురించేది ఎవరికి? ఇలా అన్ని వర్గాల దేశ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న జమిలితో మిగిలేదేమిటి?




మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవభారత ఎజెండాకు రూపమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మోదీ 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సంకేతాలు  బలంగా వినిపిస్తున్నాయి.  లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది నవభారత ఎజెండాలో తొలి ప్రాధాన్య అంశం. దీన్ని  దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనసులూ గెలుచుకునేందుకు మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. అంతేకాకుండా ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ప్రబల ఆర్థికశక్తిగా మార్చాలని మోదీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. 
 


దేశాన్ని ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారుస్తామని మోదీ సర్కార్ లక్ష్యంగా  పెట్టుకుంది. ఈ లక్ష్యం సాధించడం ఆశామాషీ వ్యవహారం కాదు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎదురవుతున్న సవాళ్లు కూడా  తక్కువేమీ కాదు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారాలంటే కేవలం ఐదేళ్లలో 8 శాతం వృద్ధిరేటు సాధించాలి. ఇది మోదీకి తలకు మించిన భారాన్ని  నెత్తికెత్తుకున్నట్లే. ఇప్పటికే వ్యవసాయ రంగ సబ్సిడీల రూపేణా భారీగా ఖర్చు పెరగడంతో  పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్‌పై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలతో  చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జీఎస్టీ వసూళ్లు తగ్గే అవకాశం ఉండటంతో  ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌ లాంటి పథకాలకు నిధులు సమకూర్చడం భారీ సవాలుగా మారనుంది. ద్రవ్య క్రమశిక్షణ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్న మవుతాయని దీంతో ముందుగా ద్రవ్య క్రమశిక్షణపై  దృష్టి సారించాలని ఇటీవలి ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది.


అటు కేంద్రంలోనూ   ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ   ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు, పరిపాలనలో కాఠిన్యతను, ఇతరత్రా సమస్యలను అధిగమించవచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఇదే అంశంపై గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర సంస్థలు, మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ క్రోడీకరించిన నీతి ఆయోగ్ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై నివేదిక సమర్పించింది. 2022లో లోక్ సభతో పాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐదేళ్ల కాలం పూర్తి కాని వాటిని కొన్ని నెలలకు కుదించడం, పూర్తయిన వాటికి మరికొంతకాలం పొడిగించడం ద్వారా జమిలి ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చని నీతి ఆయోగ్ సూచించింది. 


లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు  ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను పలు  రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆచరణ సాధ్యం కాదని విమర్శలు చేస్తున్నాయి. జమిలిపై ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు హాజరైన ప్రాంతీయ పార్టీలు కొన్ని వ్యతిరేకించగా కొన్ని సానుకూలంగా స్పందించాయి.  జమిలి ఎన్నికలకు  డీఎంకే, అన్నాడీఎంకే, అకాలీదళ్‌ సమర్ధించగా జమిలి ప్రతిపాదనను తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది. ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చడానికి బీజేపీ పన్నిన ఎత్తుగడగా దీన్ని అభివర్ణిస్తోంది. జమిలి ప్రతిపాదనతో విపక్షాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీకి మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తున్న ఏపీలోని అధికార వైసీపీ, తెలంగాణలోని  టీఆర్‌ఎస్‌లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  జమిలి ఎన్నికలపై  లా కమిషన్‌ చేస్తున్న సంప్రదింపులను సీపీఐ, సీపీఎం తప్పుబట్టాయి. రాజ్యాంగ సవరణలతో కూడుకున్న జమిలి ఎన్నికల అంశం లా కమిషన్‌ అధికార పరిధిలోకి రాదని, ఇది పార్లమెంటు పరిధిలోనిదని సీపీఐ కార్యదర్శి అతుల్‌ రంజన్‌ విమర్శిస్తున్నారు.


అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలలో గోవాలో బీజేపీ మిత్రపక్షం  గోవా ఫార్వర్డ్‌ పార్టీ కూడా చేరింది. జమిలి ప్రతిపాదన సమాఖ్య స్పూర్తికి సంబంధించిన అంశమని, ప్రాంతీయ భావోద్వేగాలకు వ్యతిరేకమని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధ్యక్షుడు, గోవా మంత్రి విజయ్‌ సర్దేశాయ్‌ స్పష్టం చేశారు. జమిలి విధానాన్ని అమలు చేస్తే ప్రాంతీయ సమస్యలు, అంశాలు వెనక్కి నెట్టివేస్తారని  తృణమూల్‌ నేత ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాని సందర్భంలో  సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా మద్దతు ఉపసంహరించుకుంటే లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా...? అని త్రుణమూల్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు జమిలి ఎన్నికలు నిదర్శనమంటూ త్రుణమూల్ ఆరోపిస్తోంది.   రాజ్యాంగంలో ఎక్కడా జమిలి ఎన్నికలపై చర్చించలేదని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అసోంకు చెందిన ఆలిండియా డెమొక్రటిక్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఎన్నికల సంస్కరణలు జరగాలి తప్ప జమిలి ఎన్నికలు కాదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌... లా కమిషన్‌కు సూచించింది. అయితే జమిలి ఎన్నికలపై విపక్షాలలో ఐక్యత కొరవడటంతో బీజేపీని మిత్ర పక్షాలు సమర్థిస్తుండగా... వ్యతిరేక పక్షాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. 


జమిలితో ప్రాంతీయ పార్టీల  భవిష్యత్తేంటి?


జమిలి ఎన్నికలపై తీవ్ర కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణాదిలో పాగా వేయడానికి కమలనాథులు వ్యూహ రచన చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. చాపకింద నీరులా కేడర్ ను విస్తరిస్తోంది. 2022లోనే జమిలి ఎన్నికలంటూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇటీవలే ఎన్నికలు జరిగిన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. సాధ్యమైనంత మేరకు పార్టీలోకి విపక్షాల నుంచి వలసలను ప్రోత్సహిస్తో్ంది. ఏపీలో టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు సీనియర్ నేతలు రెడీగా ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.  మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో పాటు అధికార టీఆర్ఎస్ నుంచి మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలు టీఆర్ ఎస్ సర్కార్ జీవితకాలం 33 నెలలేనంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా మోదీ సర్కారు మాత్రం జమిలి ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ ఎస్ సర్కార్ డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలు, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ఎన్నికలకోడ్ అమల్లో ఉండటంతో ఆరేడు నెలలపాటు  ప్రభుత్వ పాలన కుంటుపడింది. సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరో మూడున్నరేళ్లలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో తొలిసారి అధికారం దక్కించుకున్న జగన్  ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మూడున్నరేళ్లకే ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది. 


 


తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ పటిష్ఠ వ్యూహం అమలు చేస్తోంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ అధినాయకత్వం..  పలు వర్గాల వారికి చేరువయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు ఐటీ రంగ నిపుణులతో వరుస భేటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా పార్టీ కేడర్‌ను  పటిష్ఠం చేయాలని భావిస్తోంది. పార్టీ నేతల భేటీలలో జాతీయవాదానికి విస్తృత ప్రచారం కల్పించనుంది. తొలి దశలో వృత్తి నిపుణులు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనుంది.  అనంతరం కులసంఘాల పెద్దల వద్దకు పార్టీ స్థానిక నాయకత్వం వెళ్లనుంది. 


 


దేశ ప్రజలందరికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ను తీర్చిదిద్దారు. ఇపుడు ఒకే దేశం ఒకే రేషన్ పేరుతో భారీ సంస్కరణలకు తెరలేపారు. పలు వినూత్న పథకాలతో దేశ ప్రజల్లో చెరగని ముద్ర వేసేందుకు మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లలో కేంద్రంలో బలమైన ప్రభుత్వం లేకపోవడంతో దేశాభివ్రుద్ధి కుంటుపడినట్లు కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశానికి ఒరిగేదేమీ లేదని జాతీయ పార్టీలతోనే అభివ్రుద్ధి సాధ్యమని బీజేపీ ధ్రుడంగా విశ్వసిస్తోంది. కేంద్రంలో పూర్తి మెజారిటీ రావడంతో బీజేపీ ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. విపక్షాలు ఒప్పుకున్నా లేకున్నా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎదురు చెప్పి నిలబడే ధైర్యం ఏ ప్రాంతీయ పార్టీ చేయదని గతానుభవాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. మరి... బీజేపీ నేతలు చెబుతున్నట్టు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు.. 33 నెలలే ఉంటుందా? ఆ తరువాత జమిలి ఎన్నికలు తప్పవా? తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు.. అటు ఏపీలో కూడా ఎన్నికలు జరగాల్సిందే కదా. అలాంటప్పుడు వైసీపీ నేతలు కేంద్రం ఎత్తుగడను ఎలా జీర్ణించుకుంటారు...?  ఇలా జమిలి ద్వారా అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపవచ్చని మోడీ సర్కారు ఆలోచిస్తున్న క్రమంలో జమిలి ఎన్నికల కథ ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనన్న అభిప్రాయాలైతే వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత