Skip to main content

మోడీ తీసుకున్న టాప్ టెన్ సంచలన నిర్ణయాలు

ఆయనో మహోన్నత వ్యక్తి. ఆయన నామ స్మరణతో యావద్దేశం ఊగిపోతోంది. ఆయనో సమ్మోహన శక్తి. ప్రవాహంలా సాగే  ప్రసంగానికి సభికులు మంత్రముగ్ధులైపోతారు. ఆయన చేసే ప్రతీ పని ఓ సంచలనమే. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని పదవికే వన్నె తెచ్చిన వజ్ర సంకల్పుడు. పదవి చేపట్టిన నాటి నుంచి ప్రతి నిర్ణయంలో తనదైన ముద్ర వేస్తూ ..  ప్రత్యేకత చాటుకుంటున్నారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో  అసమాన దౌత్య విజయాలను అందించడం  ఆయన చతురతకు నిదర్శనం. ఆయన పాలనలో తీసుకున్న సంచలనాత్మక విజయాలు మచ్చుకు ఓ పది. 


 


జమ్ము కశ్మీర్ పై  కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అయితే ఇది అందరూ అనుకున్నట్లు కొద్దిరోజుల్లో జరిగిన ప్రక్రియ ఎన్నటికీ  కాదు. ప్రతినిత్యం తుపాకుల మోతతో ..కంటి నిండా నిద్ర కరువైన జమ్ము కశ్మీర్ కు శాశ్వత పరిష్కారం కోసం బీజేపీ ఏనాడో ప్రతిన బూనింది. ఏక్‌ దేశ్‌ మే.. దో విధాన్‌, దో ప్రధాన్‌, ఔర్‌ దో నిశాన్‌ నహీ చలేగీ అని మాజీ ప్రధాని వాజపేయి నినదించారు. ఇది జనసంఘ్‌ కాలం నుంచి బీజేపీ  మౌలిక సిద్ధాంతం. 370 అధికరణపై బీజేపీ తొలినుంచి ఒకే పంథా అనుసరిస్తూ వస్తోంది. మోడీ పాలనలో భారతీయుల  చిరకాల స్వప్నం సాకారమైంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత జాతిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడమే కాక ఆనందంలో ముంచెత్తింది.


1) మోడీ తీసుకున్న అనూహ్యమైన, సంచలనాత్మకమైన నిర్ణయాల్లో నోట్ల రద్దును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 2016 నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దుతో సంచలనం సృష్టించారు. 500, 1000  రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేశారు. నల్లధనం వెలికితీయడం, తీవ్రవాదాన్ని అరికట్టడం కోసం పెద్ద నోటన్లు రద్దు చేస్తున్నానని ఆయన ధైర్యంగా చెప్పి అమలు చేశారు. పాలనలో కఠిన లక్ష్యాలను నిర్దేశించుకున్న మోదీ సర్కార్ సంచలనాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. 


2) ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ సంస్కరణలను వేగిరం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అంటూ సంవత్సరాలుగా అమలుకు నోచుకోని జీఎస్టీని మోదీ ప్రభుత్వం పట్టాలెక్కించి ఔరా అనిపించింది. మోదీ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలు నోరెళ్లబెట్టాయి. 

3) 2016 సెప్టెంబర్‌ 29 న ఉగ్రవాద స్థావరాలపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తో పాకిస్తాన్ హడలిపోయింది. భారత్ దాడులకు దిగుతుందని పాక్ కనీసం ఊహించలేకపోయింది. సెప్టెంబర్‌ 18న ఉరీలోని ఆర్మీ బేస్‌క్యాంపులోకి నలుగురు ఉగ్రవాదులు జొరబడి 19 మంది సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా, కేవలం 10 రోజుల వ్యవధిలోనే  పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై  భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. 

4) మోడీ మార్కు ముందుచూపుకు మరో నిదర్శనమే రాంనాథ్ కోవింద్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడం. రాంనాథ్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తారని ఎవరూ ఊహించలేదు. మరోవైవు వ్యూహాత్మకంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసి మిగతా పార్టీలను ఇరుకునపెట్టడమే కాక అందరికీ ఫోన్లు చేసి ఓట్లు సైతం వేయించుకోగలిగిన మిత్రద్వయంగా మోడీ-షా నిపుణుల మన్ననలు అందుకున్నారు. 


5) ఈ ఏడాది ఫిబ్రవరి 1న అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు కల్పించింది మోదీ సర్కార్. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరిలో అగ్రవర్ణపేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు సభామోదం పొందింది. మూడోకంటికి తెలియకుండా టేబుల్‌ అజెండా కింద కేబినెట్‌ ముందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చి అదే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. 

6) ఫిబ్రవరి 14న బాలాకోట్‌ ఉగ్ర స్థావరాలపై గురి పెట్టింది మన వాయుసేన. జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మందికిపైగా  సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన తర్వాత భారత్‌ ప్రభుత్వం ఏం చేస్తుందా? అని దేశమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు జరిపారు. 


7) పార్లమెంటు ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరుగనున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశం అంతరిక్ష శక్తిగా ఆవిర్భవించిందని ప్రకటించారు. ఆయన ప్రకటన అర్థంకాలేదు కానీ...మళ్లీ ఏదో అనూహ్య ఘటన జరిగిందని మాత్రం అందరూ గుర్తించారు. మార్చి 27వ తేదీన.. భారత్ ఓ పెద్ద అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిషన్ శక్తి పేరుతో అంతరిక్షంలో లో-ఎర్త్ ఆర్బిట్‌లోని ఒక లైవ్ శాటిలైట్‌ను ముందుగానే నిర్దేశించుకున్నట్టు 3 నిమిషాల్లోనే కూల్చేశామని స్వయంగా మోడీ ప్రకటించడంతో దేశమంతా ఆశ్చర్యపోయింది. దీనిద్వారా అంతరిక్షంగానూ భారత్ సురక్షితంగా ఉందని, ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా సత్తా చాటినట్టయిందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి.  

8) చారిత్రక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనూ నెగ్గడంతో బీజేపీ సర్కార్ మరో ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది.  ప్రధానమంత్రి మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేకూరుతుంది. ముస్లిం మహిళలు  ఎదుర్కొంటున్న వివక్ష నుంచి విముక్తి కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ముమ్మారు తలాక్ బిల్లును తీసుకొచ్చింది. 

9) జమ్ము కశ్మీర్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది మోదీ సర్కార్.  జమ్ము కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. సుందర కశ్మీరానికి సరికొత్త సొబగులు అద్దారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు కొనసాగింపుగా జరుగుతున్న నాటకీయ సంఘటనలతో విభజన బిల్లుతో తెరపడింది. దశాబ్దాలుగా జరుగుతున్న కశ్మీర్ సమస్యకు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో అమిత్ షాకు తప్ప మిగతా ఎంపీలకు కూడా తెలియక పోవడం విశేషం. 

10) ప్రపంచవ్యాప్తంగా చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే సామర్థ్యం గల అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ... సీఐఏ కూడా మోడీ నిర్వహించిన ఏ ఒక్క ఆపరేషన్ నూ పట్టుకోలేకపోయింది. అటు ఏ వార్తనైనా, ఎంతటి లోగుట్టునైనా బయటపెట్టే భారత మీడియా హౌజెస్ సైతం మోడీ ఆపరేషన్స్ ని పసిగట్టలేకపోయాయి. మోడీనే స్వయంగా డిక్లేర్ చేసేదాకా ప్రపంచానికి తెలియకపోవడం మోడీ మార్కు నిర్వహణా చతురతకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. 



మొత్తానికి అనుకున్నది సాధించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తిగా నరేంద్రమోడీ, అమిత్ షా ద్వయం దేశ ప్రజలందరి చేత ప్రశంసలు అందుకుంటుండడం విశేషం. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత