Skip to main content

కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. 

తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తాను... BJP లో చేరిందే గజ్వేల్లో పోటీ చేయడానికంటూ మరో అడుగు ముందుకేసి సమరనాదం చేశారు ఈటల. కేసీఆరే టార్గెట్‎గానే గజ్వేల్లో పని మొదలు పెట్టినట్లు సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నారట ఈటల. ఈ విషయంలో బెంగాల్‎లో సువేందు అధికారి తరహాలో.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించి తీరుతామని ఈటల ధీమాగా ఉన్నారట. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

ఇక ఈటల ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే.. ఈటలకు పూర్తి వ్యూహం చెప్పి, ఒప్పించి ఈటలను రంగంలో దించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు మౌనంగా ఉన్న ఈటల... ఒక్కసారిగా వాయిస్ పెంచడం, కేసిఆర్ టార్గెట్ అనే విధంగా ప్రకటనలు చేస్తుండడంతో ఆయన వెనుక షా వ్యూహం కచ్చితంగా ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. ఇటీవల ఈటల అమిత్ షాతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా భేటీ అయి.. పూర్తి అంశాలు చర్చించినట్లుగా చెప్పుకుంటన్నారు. అందుకే.. ఈటల తాను సీయం నియోజకవర్గం గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారని చెప్పుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ ఎన్నికలు ఏ లెవల్లో ఉత్కంఠగా జరిగాయో.. రేపు తెలంగాణలోనూ అదేవిధంగా జరుగుతాయని ఈటల ధీమాగా ఉన్నారట. ఈటల-షా భేటీలో.. బీజేపీ హైకమాండ్ వ్యూహం పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టే విధంగా షా... వ్యూహం రచించారని, ఆ ఆత్మవిశ్వాసం మేరకే ఈటల రాజేందర్... హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ ను చికాకుపరచేలా భవిష్యత్తులో గజ్వేల్ నుంచే చేరికలు ఉంటాయని కూడా ఈటల చెప్పడం చూస్తే.. ప్లాన్ అంతా రెడీ అయిందని, ఇక అమలు చేయడమే తరువాయిగా మిగిలిందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మరి ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో.. గజ్వేల్ నే ఎంచుకుంటే.. కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరో చోటికి మారేలా.. టీఆర్ఎస్ కేడర్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీసేలా బీజేపీ నేతలు వ్యూహం పన్నారా? లేక సీఎం నియోజకవర్గంవర్గంలో ప్రాజెక్టులపై వ్యతిరేకత రావడం వల్లే కేసీఆర్ పై గెలవడం ఈజీ అవుతుందని ఈటల భావిస్తున్నారా? అదీకాకపోతే కేవలం బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా వ్యూహ రచనలో భాగంగానే ఈటల ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి షా టార్గెట్ ఏవిధంగా ఉంటుందీ.. ఈటల ఏ విధంగా అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిందే. 

Comments

  1. కెసిఆర్, కేటీఆర్ గారి తలపోగరు మాటలకు ప్రజలు బుద్ధి చెప్పే

    ReplyDelete
  2. రోజు దగ్గరలోనే ఉంది.. భాహుషా అమిత్ షా గారి ప్యుహం ఫలించ వచ్చు..

    ReplyDelete

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత