Skip to main content

కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. 

తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తాను... BJP లో చేరిందే గజ్వేల్లో పోటీ చేయడానికంటూ మరో అడుగు ముందుకేసి సమరనాదం చేశారు ఈటల. కేసీఆరే టార్గెట్‎గానే గజ్వేల్లో పని మొదలు పెట్టినట్లు సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నారట ఈటల. ఈ విషయంలో బెంగాల్‎లో సువేందు అధికారి తరహాలో.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించి తీరుతామని ఈటల ధీమాగా ఉన్నారట. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

ఇక ఈటల ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే.. ఈటలకు పూర్తి వ్యూహం చెప్పి, ఒప్పించి ఈటలను రంగంలో దించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు మౌనంగా ఉన్న ఈటల... ఒక్కసారిగా వాయిస్ పెంచడం, కేసిఆర్ టార్గెట్ అనే విధంగా ప్రకటనలు చేస్తుండడంతో ఆయన వెనుక షా వ్యూహం కచ్చితంగా ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. ఇటీవల ఈటల అమిత్ షాతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా భేటీ అయి.. పూర్తి అంశాలు చర్చించినట్లుగా చెప్పుకుంటన్నారు. అందుకే.. ఈటల తాను సీయం నియోజకవర్గం గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారని చెప్పుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ ఎన్నికలు ఏ లెవల్లో ఉత్కంఠగా జరిగాయో.. రేపు తెలంగాణలోనూ అదేవిధంగా జరుగుతాయని ఈటల ధీమాగా ఉన్నారట. ఈటల-షా భేటీలో.. బీజేపీ హైకమాండ్ వ్యూహం పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టే విధంగా షా... వ్యూహం రచించారని, ఆ ఆత్మవిశ్వాసం మేరకే ఈటల రాజేందర్... హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ ను చికాకుపరచేలా భవిష్యత్తులో గజ్వేల్ నుంచే చేరికలు ఉంటాయని కూడా ఈటల చెప్పడం చూస్తే.. ప్లాన్ అంతా రెడీ అయిందని, ఇక అమలు చేయడమే తరువాయిగా మిగిలిందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మరి ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో.. గజ్వేల్ నే ఎంచుకుంటే.. కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరో చోటికి మారేలా.. టీఆర్ఎస్ కేడర్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీసేలా బీజేపీ నేతలు వ్యూహం పన్నారా? లేక సీఎం నియోజకవర్గంవర్గంలో ప్రాజెక్టులపై వ్యతిరేకత రావడం వల్లే కేసీఆర్ పై గెలవడం ఈజీ అవుతుందని ఈటల భావిస్తున్నారా? అదీకాకపోతే కేవలం బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా వ్యూహ రచనలో భాగంగానే ఈటల ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి షా టార్గెట్ ఏవిధంగా ఉంటుందీ.. ఈటల ఏ విధంగా అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిందే. 

Comments

  1. కెసిఆర్, కేటీఆర్ గారి తలపోగరు మాటలకు ప్రజలు బుద్ధి చెప్పే

    ReplyDelete
  2. రోజు దగ్గరలోనే ఉంది.. భాహుషా అమిత్ షా గారి ప్యుహం ఫలించ వచ్చు..

    ReplyDelete

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత