Skip to main content

భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే అంశాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. బీజేపీ నేతల వ్యవహార శైలి మాత్రం అలాగే ఉందని నిపుణులు అంటున్నారు. చార్మినార్ వద్దనే గల భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రముఖ నేతలంతా దర్శించుకోవడం వల్ల భాగ్యలక్ష్మికి పాపులారిటీ వస్తుంది. జాతీయ మీడియా కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ పై ఫోకస్ చేస్తుంది. దీంతో చార్మినార్, హైదరాబాద్ వంటి అంశాలకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన సీట్లు గెల్చుకున్న బీజేపీ... జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో కొంతవరకు ఇప్పటికే సఫలీకృతమైంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పరంగానూ ఎమ్మెల్యేల సంఖ్యా బలం పెంచుకునేందుకు కృషి చేస్తోంది. ఫలితంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీ మొత్తంగా వ్యాపించే పథకంతో ముందుకెళ్తోంది. ఈ అన్ని ఎన్నికల ఫలితాల ఆలంబనతో భాగ్యనగర్ మీద ఓ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవడానికి వీలుగా వ్యూహం రచిస్తోంది. మహారాష్ట్రలో శివసేన సంఖ్యాబలాన్ని తగ్గించి.. ఉద్ధవ్ చేతనే ఔరంగాబాద్ పేరు మార్చిన వైనాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు. 

అసలింతకీ.. భాగ్యలక్ష్మి అమ్మవారు కేవలం సెంటిమెంటేనా? లేక చారిత్రకంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అన్న సందేహాలు కూడా ప్రజల్లోంచి వినిపిస్తున్నాయి. భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఇటీవలి కాలంలో వచ్చిందేమీ కాదని, చార్మినార్ కట్టినప్పుడే అక్కడ అమ్మవారి ఆలయం ఉండేదని కొందరు స్థానికుల ద్వారా తెలుస్తోంది. కాబట్టి.. చార్మినార్ వైభవం కింద నలిగిపోతున్న భాగ్యలక్ష్మి అమ్మవారి అడుగుజాడల్ని మళ్లీ ఓసారి ప్రజలకు వివరించే ఉద్దేశంతో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. చార్మినార్ నుంచి నగరం బయటకు వెళ్లడానికి అడుగున సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత వాటిని మూసివేశారని, ఆ సొరంగ మార్గాలపై అధ్యయనం చేయడానికి ఇటీవల కొద్ది నెలల క్రితం ఆర్కియలాజికల్ డిపార్టుమెంట్ అధికారులు సర్వే కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే అక్కడున్న కొందరు స్థానిక నాయకులు ఆర్కియలాజికల్ అధికారుల్ని బెదిరించి సర్వేను అడ్డుకున్నారని స్థానికులు చెబుతారు. ఒకవేళ ఆ ప్రక్రియ గనక పూర్తయితే బీజేపీ నేతల పేరు మార్చే ప్రక్రియకు మార్గం సులభమైనట్టేనని భావిస్తున్నారు. అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు హైదరాబాద్ లో ఎప్పుడు పెద్ద ఉత్సవాలు జరిగినా.. చలో భాగ్యలక్ష్మి అంటూ పాత సెంటిమెంట్ దిశగా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. 
బీజేపీ ఎజెండాలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఉందో.. అంతకన్నా ఎక్కువగా హిందూ సెంటిమెంట్ కే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. హిందూ సెంటిమెంట్లకు మూలం దేవాలయాలే. కాబట్టి దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల సంస్కరణ, దేవాలయాలకు ప్రత్యేక ప్రతిపత్తి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం తగ్గిస్తూ ఈ మధ్య కేంద్రం ఓ చట్టం కూడా తీసుకొచ్చింది. పలు రాష్ట్రాలు కూడా వివిధ స్థాయిల్లో చట్టం అమలు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ లో టీఆర్ఎస్-మజ్లిస్ మైత్రీ బంధానికి గండి కొట్టేలా.. సామాజికవర్గాలకు అతీతంగా హిందూ ఓటర్లను తమవైపు ఆకర్షించుకునేలా భాగ్యలక్ష్మి టెంపుల్ ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీంతో భాగ్యలక్ష్మి టెంపుల్ రానున్న మరికొన్ని రోజుల్లో మరింత పాపులర్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత