Skip to main content

ఒవైసీ బ్రదర్స్ తో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

రాజకీయాల్లో ఒకరి నిర్లక్ష్యమే ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవతలి వ్యక్తి అతి విశ్వాసమే ఇవతలి వ్యక్తికి ఆయుధం అవుతుంది. సంఖ్యాబలంతోనే సర్వత్రా నెగ్గుకొస్తానంటే కుదరదు. ప్రజల్లో పాదుకున్న సెంటిమెంట్లేంటో అర్థం చేసుకొని అడుగేయాలి. అలా కాకపోతే విపక్షం చేతిలోనే పరాభవం చవి చూడక తప్పదు. తెలంగాణలో వికసించేందుకు బీజేపీ శక్తినంతా ప్రయోగిస్తున్న సమయంలో... కేసీఆర్ విస్మరిస్తున్న కీలకమైన అంశాలేంటో చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. 



తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ....స్వయంగా కేసీఆరే ఛాన్స్‌ ఇస్తున్నారా? కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే స్కెచ్ రెడీ చేసిందా? మిత్రపక్షమైన ఎంఐఎం ఏం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? తెలంగాణలో మతసామరస్యానికి ముప్పు వాటిల్లిందా? అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై టీఆర్ఎస్‌ వైఖరేంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బర్ చేసిన కామెంట్స్ ను కేసీఆర్ ఉపేక్షిస్తే...జరిగే పరిణామాలేంటి? 


తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్...కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా చెప్పే మాట ఇది. నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే...తెలంగాణలో మతసామరస్యం చాలా ఎక్కువ. ఇది చాలా సార్లు నిరూపితమైంది కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కూడా ఈ పాలసీ చెడిపోకుండా...మతపరమైన విషయాల్లో రాజకీయాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇదంతా మూడేళ్ల క్రితం వరకు మాట. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను అసదుద్దీన్ బయట పెట్టినప్పటి నుంచి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మారిపోయింది. వారు వ్యక్తిగతంగా కూడా ఆత్మీయ స్నేహితులుగా ఒక్కటయ్యారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా కేసీఆర్ మంచి సంబంధాలే నెరుపుతూ వచ్చారు. కానీ ఎంఐఎంను చేరదీయడం బీజేపీకి నచ్చలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు.


ప్రస్తుతం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్‌తో కేసీఆర్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నేరుగా కేసీఆర్ కాకపోయినా...కనీసం ఆ పార్టీ నేతల నుంచి కూడా ఒక్క ఖండనా రాలేదు. పైగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమా? కాదా? అన్న మీమాంస కూడా అవసరం లేదు. అక్బర్ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి రియాక్షనే లేదు. బీజేపీ మాత్రం తమ పాలసీ ప్రకారం ఎంఐఎంపై ఎదురుదాడి ప్రారంభించింది. కానీ ఇన్నాళ్లూ ఎంఐఎంకు బీజేపీకి నడిచిన మాటల యుద్ధం వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. పైగా ఎంఐఎం ఆ పార్టీకి మిత్రపక్షం కూాడా. 


అక్బరుద్దీన్ దూకుడుకు ఆదిలోనే కళ్లెం వేయాల్సింది


అక్బరుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొలిసారేం కాదు. 2013లో కూడా నిజామాబాద్‌లో సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు కిరణ్ కుమార్‌ రెడ్డి అధికారంలో ఉన్నారు. నాడు అక్బర్‌పై చర్యలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. దాంతో కేసీఆర్‌పై ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా హిందువుల్లో కేసీఆర్‌పై ఒక అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను కోల్పోయేందుకు ఎన్నికల సమయంలో కేసీఆర్ హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా కేసీఆర్ తేరుకోకపోవడం సరికాదంటున్నారు నిపుణులు. 


ఇక్కడ మరో విషయాన్ని కూడా రాజకీయ పండితులు ఉటంకిస్తున్నారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కత్తిమహేష్‌ను నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత పరిపూర్ణానందను కూడా విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో బహిష్కరించారు. ఆ సమయంలో కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్న సర్కారు వైఖరిని అభినందించారు. కానీ ఇప్పుడు అక్బరుద్దీన్ విషయంలో ఎందుకు సైలెంట్‌ అయిపోయారని సామాన్యుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఉదాసీన వైఖరితో ఉంటే బీజేపీకి ఛాన్స్ ఇచ్చిన వారవుతారని టీఆర్ఎస్‌ నేతలను హెచ్చరిస్తున్నారు.


కేసీఆర్ ఏం చేస్తారు? 


హిందుత్వంతో పాటు జాతీయవాదాలే ఎజెండాగా వెళ్తున్న బీజేపీకి...కేసీఆర్ చేసే ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఛాన్స్ ఇస్తాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకైతే మతపరమైన భావోద్వేగాలు పనిచేసే స్థితి లేకపోయినప్పటికీ...క్రమంగా ఆ పరిస్థితిని తీసుకొస్తే ముప్పు తప్పదంటున్నారు. అక్బర్ వ్యాఖ్యలపై కేసీఆర్ సర్కారు తన వైఖరిని ప్రకటించకపోయినప్పటికీ....కనీసం ఇప్పటికైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న ప్రమాదాన్ని కేసీఆర్ గ్రహిస్తారా? గ్రహించి, తేరుకొని దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా? లేక ముస్లింలు అందరూ ఎంఐఎం వెంటే ఉన్నారని భ్రమించి, ఒవైసీ సోదరుల కోసం రాజకీయ, సామాజిక వాతావరణాన్ని చేజేతులా కలుషితం చేస్తారా? చూడాలి మరి. 


- టి.రమేశ్ బాబు


Mail ID: rameshbabut@hotmail.com


 


 


 


Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో