Skip to main content

ఒవైసీ బ్రదర్స్ తో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

రాజకీయాల్లో ఒకరి నిర్లక్ష్యమే ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవతలి వ్యక్తి అతి విశ్వాసమే ఇవతలి వ్యక్తికి ఆయుధం అవుతుంది. సంఖ్యాబలంతోనే సర్వత్రా నెగ్గుకొస్తానంటే కుదరదు. ప్రజల్లో పాదుకున్న సెంటిమెంట్లేంటో అర్థం చేసుకొని అడుగేయాలి. అలా కాకపోతే విపక్షం చేతిలోనే పరాభవం చవి చూడక తప్పదు. తెలంగాణలో వికసించేందుకు బీజేపీ శక్తినంతా ప్రయోగిస్తున్న సమయంలో... కేసీఆర్ విస్మరిస్తున్న కీలకమైన అంశాలేంటో చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. 



తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ....స్వయంగా కేసీఆరే ఛాన్స్‌ ఇస్తున్నారా? కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే స్కెచ్ రెడీ చేసిందా? మిత్రపక్షమైన ఎంఐఎం ఏం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? తెలంగాణలో మతసామరస్యానికి ముప్పు వాటిల్లిందా? అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై టీఆర్ఎస్‌ వైఖరేంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బర్ చేసిన కామెంట్స్ ను కేసీఆర్ ఉపేక్షిస్తే...జరిగే పరిణామాలేంటి? 


తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్...కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా చెప్పే మాట ఇది. నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే...తెలంగాణలో మతసామరస్యం చాలా ఎక్కువ. ఇది చాలా సార్లు నిరూపితమైంది కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కేసీఆర్ కూడా ఈ పాలసీ చెడిపోకుండా...మతపరమైన విషయాల్లో రాజకీయాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇదంతా మూడేళ్ల క్రితం వరకు మాట. ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను అసదుద్దీన్ బయట పెట్టినప్పటి నుంచి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మారిపోయింది. వారు వ్యక్తిగతంగా కూడా ఆత్మీయ స్నేహితులుగా ఒక్కటయ్యారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా కేసీఆర్ మంచి సంబంధాలే నెరుపుతూ వచ్చారు. కానీ ఎంఐఎంను చేరదీయడం బీజేపీకి నచ్చలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు.


ప్రస్తుతం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్‌తో కేసీఆర్ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై నేరుగా కేసీఆర్ కాకపోయినా...కనీసం ఆ పార్టీ నేతల నుంచి కూడా ఒక్క ఖండనా రాలేదు. పైగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమా? కాదా? అన్న మీమాంస కూడా అవసరం లేదు. అక్బర్ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి రియాక్షనే లేదు. బీజేపీ మాత్రం తమ పాలసీ ప్రకారం ఎంఐఎంపై ఎదురుదాడి ప్రారంభించింది. కానీ ఇన్నాళ్లూ ఎంఐఎంకు బీజేపీకి నడిచిన మాటల యుద్ధం వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. పైగా ఎంఐఎం ఆ పార్టీకి మిత్రపక్షం కూాడా. 


అక్బరుద్దీన్ దూకుడుకు ఆదిలోనే కళ్లెం వేయాల్సింది


అక్బరుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొలిసారేం కాదు. 2013లో కూడా నిజామాబాద్‌లో సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు కిరణ్ కుమార్‌ రెడ్డి అధికారంలో ఉన్నారు. నాడు అక్బర్‌పై చర్యలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. దాంతో కేసీఆర్‌పై ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా హిందువుల్లో కేసీఆర్‌పై ఒక అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలను కోల్పోయేందుకు ఎన్నికల సమయంలో కేసీఆర్ హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా కేసీఆర్ తేరుకోకపోవడం సరికాదంటున్నారు నిపుణులు. 


ఇక్కడ మరో విషయాన్ని కూడా రాజకీయ పండితులు ఉటంకిస్తున్నారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కత్తిమహేష్‌ను నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత పరిపూర్ణానందను కూడా విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో బహిష్కరించారు. ఆ సమయంలో కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్న సర్కారు వైఖరిని అభినందించారు. కానీ ఇప్పుడు అక్బరుద్దీన్ విషయంలో ఎందుకు సైలెంట్‌ అయిపోయారని సామాన్యుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఉదాసీన వైఖరితో ఉంటే బీజేపీకి ఛాన్స్ ఇచ్చిన వారవుతారని టీఆర్ఎస్‌ నేతలను హెచ్చరిస్తున్నారు.


కేసీఆర్ ఏం చేస్తారు? 


హిందుత్వంతో పాటు జాతీయవాదాలే ఎజెండాగా వెళ్తున్న బీజేపీకి...కేసీఆర్ చేసే ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఛాన్స్ ఇస్తాయని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకైతే మతపరమైన భావోద్వేగాలు పనిచేసే స్థితి లేకపోయినప్పటికీ...క్రమంగా ఆ పరిస్థితిని తీసుకొస్తే ముప్పు తప్పదంటున్నారు. అక్బర్ వ్యాఖ్యలపై కేసీఆర్ సర్కారు తన వైఖరిని ప్రకటించకపోయినప్పటికీ....కనీసం ఇప్పటికైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న ప్రమాదాన్ని కేసీఆర్ గ్రహిస్తారా? గ్రహించి, తేరుకొని దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా? లేక ముస్లింలు అందరూ ఎంఐఎం వెంటే ఉన్నారని భ్రమించి, ఒవైసీ సోదరుల కోసం రాజకీయ, సామాజిక వాతావరణాన్ని చేజేతులా కలుషితం చేస్తారా? చూడాలి మరి. 


- టి.రమేశ్ బాబు


Mail ID: rameshbabut@hotmail.com


 


 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత