Skip to main content

Posts

మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

ఆ నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీఆర్ఎస్ అధిష్టానం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మంత్రికి... మొన్నటివరకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడు కూడా ఇప్పుడు జత కావడం మంత్రికి కలిసొస్తుందా? తనకు కలిసి రావడం కోసం మంత్రి ఈ స్కెచ్ వేశారా? లేక అవతలి పార్టీని దెబ్బ తీయడానికే ఆయన్ని కలుపుకున్నారా? సుదీర్ఘమైన అనుభవం, ప్రజలతో మంచి కనెక్షన్ ఉన్న ఆ నాయకుడు కారెక్కితే బీఆర్‍ఎస్‍ కు భారీ మెజారిటీ ఖాయమా? మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కారు పార్టీలో కలిసి మెలిసి తిరగడానికి కారణమేంటి? బీఆర్‍ఎస్‍ లో చేరిన ఆ నేత లక్ష్యమేంటి? గులాబీ బాస్‍ ఇచ్చిన ఆఫర్‍ ఏంటి? Read this: కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" Read this: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం వనపర్తి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రావులను బీఆర్‍ఎస్‍లోకి తీసుకు రావడం వెనుక అధికార బీఆర్‍ఎస్‍ అధిష్టానం ఎంతో పకడ్బందీగా

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

మధుయాష్కీ, పొన్నం టికెట్ల పరిస్థితి ఇదే

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీనియర్లను లైట్ తీసుకుంటున్నారా? చాలా మంది సీనియర్ల రాజకీయ భవిష్యత్ డైలమాలో పడినట్టేనా? మొదటి లిస్టులో సీనియర్ల పేర్లు కనిపించకపోవడానికి కారణం అదే అంటున్నారు విశ్లేషకులు. ఇక రెండో జాబితా సీట్లలో పోటీ విపరీతంగా ఉండడంతో టికెట్లు దక్కే సంభావ్యత అనుమానంలో పడిందన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది.  టీ-కాంగ్రెస్ లో సీనియర్లంటే ఒకప్పుడు వారు చెప్పిందే వేదం. ఆ మాటకొస్తే.. ఎవరు రాసుకున్న వేదం వారిదే... అన్నట్టుగా ఉండేది పరిస్థితి. పార్టీ పగ్గాలన్నీ ఢిల్లీలోని హైకమాండ్ గుప్పిట్లో ఉండడంతో.. లోకల్ పీసీసీ చీఫ్ లు గానీ, పార్టీ ఇతర పోర్ట్ ఫోలియోల మాటలకు గానీ పెద్దగా చెల్లుబాటు అయ్యేది కాదు. ఢిల్లీలో వారు చెప్పిందే ఫైనల్ కాబట్టి.. ఇక్కడ వీరి మాటలకు పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టాక క్రమంగా రీతి-రివాజు మారుతూ వచ్చింది. తొలుత రేవంత్ ను కూడా పాత పద్ధతుల్లోనే గూట్లో చెక్కేందుకు ప్రయత్నించారు. అయితే హైకమాండ్ ను ఒప్పించకొని, మెప్పించుకున్న రేవంత్.. రాష్ట్ర పార్టీ మీద క్రమంగా అదుపు సాధించారు. రేవంత్ కు రాహుల్ స్వేచ్ఛగా న

టి-కాంగ్రెస్ లో ఎన్నడూ లేని జోష్.. కారణం ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఏ రేంజ్ లో ఉందంటే.. గెలుపుకు అర అంగుళం దూరంలోనే ఉన్నామన్న ఫీలింగ్ లో వారంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అధికారం అందుకోవడం ఖాయమైపోయిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తన సంతోషాన్ని, ఆనందాన్ని లోపలే దాచుకోవాల్సి ఉండగా.. బహుశా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతోనో ఏమో గానీ.. సీఎం కుర్చీ మీద కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేశారు జానా. మరి జానాలాగే మరికొందరు సీనియర్లు కూడా ఇదే వాయిస్ వినిపిస్తారా? కాంగ్రెస్ లో సీనియర్లకు ఎదురవుతున్న పరిస్థితులేంటి? టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముందే 6 గ్యారెంటీ పథకాల హామీతో జనంలోకి చొచ్చుకుపోతోంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో టీ-పీసీసీ తొలి జాబితా విడుదల చేసింది. అయితే అందులో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిలో నైరాశ్యం అలముకుందన్న వార్తలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. రెండో జాబితా బయటకు రావాల్సి ఉన్నా.. తొలి జాబితాలోనే తమకు చోటు లేనప్పుడు.. ఇంక రెండో జాబితాలో ఎక్కణ్నుంచి ఉంటుందన్న నైరాశ్య

మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

కంచే చేనే మేస్తే.. ఆ కాపు ఏం చేయాలి? రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే పక్షపాతం చూపి తప్పుకుంటే ఎవర్ని ఆశ్రయించాలి? ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు తెగబడి.. బెదిరింపులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? కరీంనగర్ లోని ఓ బాధిత రైతు.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెర లేపిన భూ కబ్జా భాగోతంతో బెంబేలెత్తిపోతున్నాడు. కరీంనగర్ లో ఉండలేక, ఉంటే బతుకుతానన్న గ్యారెంటీ లేక హైదరాబాద్ పారిపోయి వచ్చానంటున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదంటూ.. హైదరాబాద్ లో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే భూములకు రక్షణ దొరుకుతుందనుకున్న సామాన్య ప్రజలకు.. అలాంటి భరోసా ఏమీ కనిపించడం లేదన్న విమర్శలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. అందుక్కారణం పార్టీ పేరు చెప్పుకునో లేదా ఏదో ఒక అధికారి పేరు చెప్పుకునో మాఫియారాయుళ్లు భూములు కబ్జా చేయడం లేదిప్పుడు... ఏకంగా మంత్రులే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రంగంలోకి దిగుతున్నారట. రాష్ట్ర మంత్రి వర్గంలో చాలా కీలకమైన పోర్టుఫోలియో కలిగి ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగుల పేరు త

ఐదు కీలకాంశాలపై ఆస్ట్రాలజీ నిపుణుల పత్ర సమర్పణ

భాగ్యనగర్ పోస్ట్, హైదరాబాద్, 08: జ్యోతిష్య శాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మానవ జీవన ప్రయాణాన్ని సులభంగా, సుఖంగా కొనసాగించవచ్చని.. అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్టుగా అందుకునే అద్భుతమైన భారతీయ విజ్ఞానమే జ్యోతిష్యం అని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా అన్నారు. భారతీయ రుషి పరంపర నుంచి వచ్చిన ఆ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. ప్రజల జీవితాలు సుఖమయం చేయడానికి మించిన సేవ మరోటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఔత్సాహికుల కోసం ఉచిత జ్యోతిష్య తరగతులు బోధిస్తున్నామని.. దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా అందించలేని స్థాయిలో ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పిస్తున్నామన్నారు.  ఈ సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి కళాసాగరంలో పలు ముఖ్యమైన అంశాలపై ఐదుగురు నిపుణులు సమర్పించిన థీసిస్ పై ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫెర్టిలిటీలోని సమస్యలు, సంతానోత్పత్తిలో కలిగే అవరోధాలకు ఆస్ట్రాలజీలో ఉండే పరిష్కారాలపై సీసీఎంబీ-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తు

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి?  Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ నిపుణులు. కోవిడ