భాగ్యనగర్ పోస్ట్, హైదరాబాద్, 08: జ్యోతిష్య శాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మానవ జీవన ప్రయాణాన్ని సులభంగా, సుఖంగా కొనసాగించవచ్చని.. అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్టుగా అందుకునే అద్భుతమైన భారతీయ విజ్ఞానమే జ్యోతిష్యం అని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా అన్నారు. భారతీయ రుషి పరంపర నుంచి వచ్చిన ఆ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. ప్రజల జీవితాలు సుఖమయం చేయడానికి మించిన సేవ మరోటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఔత్సాహికుల కోసం ఉచిత జ్యోతిష్య తరగతులు బోధిస్తున్నామని.. దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా అందించలేని స్థాయిలో ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి కళాసాగరంలో పలు ముఖ్యమైన అంశాలపై ఐదుగురు నిపుణులు సమర్పించిన థీసిస్ పై ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫెర్టిలిటీలోని సమస్యలు, సంతానోత్పత్తిలో కలిగే అవరోధాలకు ఆస్ట్రాలజీలో ఉండే పరిష్కారాలపై సీసీఎంబీ-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రవీందర్ తన ప్రజెంటేషన్ సమర్పించారు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి కఠినమైన, ఉన్నతమైన పరీక్షలకు హాజరయ్యేవారి జాతకాలను పరిశీలించడం ద్వారా ఆ అవకాశాలను ముందుగానే అంచనా వేసి ఆ తరహా తర్ఫీదు పొందితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మంథా అనురాధ తన థీసిస్ ను సమర్పించారు. అనూరాధ ఐఐటీ టాపర్ గా నిలవడం విశేషం. ఇక రాశిచక్రంలో ఐదో స్థానాన్ని విశ్లేషించి.. అందులోని పాజిటివ్, నెగెటివ్ కోణాలను హరిణి తన ప్రజెంటేషన్ ద్వారా పేర్కొన్నారు. ఫార్మా ఇండస్ట్రీలో రాణించేవారి జాతకాలపై లోతైన పరిశోధన చేసి తన థీసిస్ ను సమర్పించారు గోపాలకృష్ణ. శాంతియుతమైన, విజ్ఞానయుతమైన సమాజానికి అవసరమైన ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెంచే జాతక చక్రాలపై ఎం.వెంకటరావు తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ ఉన్నత విద్యావంతులంతా జేకేఆర్ ఫౌండేషన్ అందించిన ఆస్ట్రాలజీని అభ్యాసం చేసి ఎదిగినవారే కావడం విశేషం.
Also Read: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం
Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు
Also Read: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్
Comments
Post a Comment
Your Comments Please: