Skip to main content

ఐదు కీలకాంశాలపై ఆస్ట్రాలజీ నిపుణుల పత్ర సమర్పణ

భాగ్యనగర్ పోస్ట్, హైదరాబాద్, 08: జ్యోతిష్య శాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మానవ జీవన ప్రయాణాన్ని సులభంగా, సుఖంగా కొనసాగించవచ్చని.. అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్టుగా అందుకునే అద్భుతమైన భారతీయ విజ్ఞానమే జ్యోతిష్యం అని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా అన్నారు. భారతీయ రుషి పరంపర నుంచి వచ్చిన ఆ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించేందుకే తమ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. ప్రజల జీవితాలు సుఖమయం చేయడానికి మించిన సేవ మరోటి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఔత్సాహికుల కోసం ఉచిత జ్యోతిష్య తరగతులు బోధిస్తున్నామని.. దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా అందించలేని స్థాయిలో ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పిస్తున్నామన్నారు. 

ఈ సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి కళాసాగరంలో పలు ముఖ్యమైన అంశాలపై ఐదుగురు నిపుణులు సమర్పించిన థీసిస్ పై ప్రజెంటేషన్ నిర్వహించారు. ఫెర్టిలిటీలోని సమస్యలు, సంతానోత్పత్తిలో కలిగే అవరోధాలకు ఆస్ట్రాలజీలో ఉండే పరిష్కారాలపై సీసీఎంబీ-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రవీందర్ తన ప్రజెంటేషన్ సమర్పించారు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి కఠినమైన, ఉన్నతమైన పరీక్షలకు హాజరయ్యేవారి జాతకాలను పరిశీలించడం ద్వారా ఆ అవకాశాలను ముందుగానే అంచనా వేసి ఆ తరహా తర్ఫీదు పొందితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మంథా అనురాధ తన థీసిస్ ను సమర్పించారు. అనూరాధ ఐఐటీ టాపర్ గా నిలవడం విశేషం. ఇక రాశిచక్రంలో ఐదో స్థానాన్ని విశ్లేషించి.. అందులోని పాజిటివ్, నెగెటివ్ కోణాలను హరిణి తన ప్రజెంటేషన్ ద్వారా పేర్కొన్నారు. ఫార్మా ఇండస్ట్రీలో రాణించేవారి జాతకాలపై లోతైన పరిశోధన చేసి తన థీసిస్ ను సమర్పించారు గోపాలకృష్ణ. శాంతియుతమైన, విజ్ఞానయుతమైన సమాజానికి అవసరమైన ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెంచే జాతక చక్రాలపై ఎం.వెంకటరావు తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ ఉన్నత విద్యావంతులంతా జేకేఆర్ ఫౌండేషన్ అందించిన ఆస్ట్రాలజీని అభ్యాసం చేసి ఎదిగినవారే కావడం విశేషం. 

Also Read: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

Also Read: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్

జేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఆస్ట్రాలజీ తాము ఇప్పటికి వందలాది మందిని తీర్చి దిద్దామని.. వారంతా మెచ్యూర్డ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారని.. అలాంటి సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ రాజా అన్నారు. ఈ క్రమంలో ఫౌండేషన్ ద్వారా హనుమకొండలో కూడా ఇటీవలే తరగతులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది ఔత్సాహిక జ్యోతిష్య శాస్త్ర అభ్యాసకులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. 



త్వరలో ఆస్ట్రాలజీలో ప్రత్యేకమైన యూనివర్సిటీ
జేకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఆస్ట్రాలజీ విజ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ రాబోతుందని.. అందుకు తగిన నేపథ్య కార్యక్రమం అంతా పూర్తయిందని వాస్తు నిపుణుడు శరవణన్ పేర్కొన్నారు. త్వరలోనే యూనివర్సిటీ పేరు, దాని విధివిధానాలు, ఇతర అంశాలను జేకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజా ప్రకటిస్తారని చెప్పారు. 

ప్రజెంటేషన్ ఇస్తున్న వివిధ రంగాల్లోని ఆస్ట్రాలజీ నిపుణులు

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత