Skip to main content

మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

ఆ నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీఆర్ఎస్ అధిష్టానం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మంత్రికి... మొన్నటివరకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడు కూడా ఇప్పుడు జత కావడం మంత్రికి కలిసొస్తుందా? తనకు కలిసి రావడం కోసం మంత్రి ఈ స్కెచ్ వేశారా? లేక అవతలి పార్టీని దెబ్బ తీయడానికే ఆయన్ని కలుపుకున్నారా? సుదీర్ఘమైన అనుభవం, ప్రజలతో మంచి కనెక్షన్ ఉన్న ఆ నాయకుడు కారెక్కితే బీఆర్‍ఎస్‍ కు భారీ మెజారిటీ ఖాయమా? మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కారు పార్టీలో కలిసి మెలిసి తిరగడానికి కారణమేంటి? బీఆర్‍ఎస్‍ లో చేరిన ఆ నేత లక్ష్యమేంటి? గులాబీ బాస్‍ ఇచ్చిన ఆఫర్‍ ఏంటి?

Read this: కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం"

Read this: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

వనపర్తి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రావులను బీఆర్‍ఎస్‍లోకి తీసుకు రావడం వెనుక అధికార బీఆర్‍ఎస్‍ అధిష్టానం ఎంతో పకడ్బందీగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వనపర్తి నియోజకవర్గంలో క్రియాశీల రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న రావుల చంద్రశేఖర్‍ రెడ్డిని బీఆర్‍ఎస్‍ లోకి చేర్చుకోడానికి గులాబీ బాస్‍ పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది. రావుల చంద్రశేఖర్‍ రెడ్డి.. గతంలో కూడా పలుమార్లు వివిధ పార్టీల్లో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన మాత్రం తాను చివరికి బీఆర్‍ఎస్‍ లోనే చేరేందుకు సుముఖత చూపారు. వనపర్తి నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు చాలా మంది ఇప్పటికీ బీఆర్‍ఎస్‍ లోనే ఉన్నారు. ఇప్పుడు రావుల కూడా బీఆర్‍ఎస్‍ లో చేరడంతో వనపర్తి జిల్లాలో టీడీపీ పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి. రావుల, బీఆర్‍ఎస్‍ లో కలవడంతో వనపర్తి జిల్లాలో బీఆర్‍ఎస్‍ పార్టీకి మరింత బలం చేకూరినట్లైందన్న చర్చ ఆ జిల్లాలో జోరుగా సాగుతోంది. 

ఐతే రావుల బీఆర్‍ఎస్‍ లో చేరడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రావుల చంద్రశేఖర్‍ రెడ్డి బినామీ అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్‍ లో చంద్రబాబు జైలుకెళ్లడం, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో రావులను బీఆర్‍ఎస్‍ వైపు మళ్లేలా చేశాయన్న టాక్‍ వనపర్తిలో జోరుగా సాగుతోంది. రావుల కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో, ఆయనకు బీఆర్‍ఎస్‍ నుంచి రాజ్యసభ, లేదా మహబూబ్‍ నగర్‍ పార్లమెంటు నుంచి బరిలో దించి ఎమ్మెల్యేల మద్దతుతో గెలిపించుకుంటామన్న గులాబీ బాస్‍ హామీతో రావుల బీఆర్‍ఎస్‍ గూటికి చేరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రావులను కారెక్కించుకునేందుకు గులాబీ పెద్దలు తెరవెనుక పెద్ద తతంగమే నడిపారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. చంద్రబాబు బినామీగా ముద్రపడ్డ రావులను.. నయాన కాకపోతే భయాన అయినా సరే కారెక్కించుకోవాల్సిందే అన్న నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ పాచిక పారిందంటున్నారు స్థానిక రాజకీయ పరిశీలకులు. ఆంద్రప్రదేశ్‍ లో చంద్రబాబు నాయుడును అక్కడి జగన్ సర్కారు చిక్కుల్లోకి నెట్టినట్టుగానే.. ఇక్కడ తాము కూడా... రావులకు అలాంటి పరిస్థితి తీసుకురాగలమన్న హెచ్చరికల కారణంగానే రావుల దారికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఐతే గతంలోనూ బీఆర్ఎస్ నుంచి రావులకు పార్టీలో చేరాల్సిందిగా పలు మార్లు ఆఫర్లు వచ్చినా... ఆయన సున్నితంగా తిరస్కరించారు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఆయన మాత్రం పార్టీలో చేరక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే రావుల చేరిక మంత్రి నిరంజన్‍ రెడ్డికి బాగా కలిసి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో నిరంజన్‍ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న మేఘారెడ్డి.. ఇప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. నిరంజన్‍ రెడ్డిని వ్యతిరేకిస్తూ మేఘారెడ్డి కాంగ్రెస్‍ లో చేరారు. ఐతే ఒకప్పుడు టీడీపీ నేత ఐన మేఘారెడ్డి రావుల చంద్రశేఖర్‍ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. టీడీపీ క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో స్వయంగా రావుల చంద్రశేఖర్‍ రెడ్డే... మేఘారెడ్డిని బీఆర్‍ఎస్‍ లోకి పంపించారన్న ప్రచారం సాగింది. ఐతే అలా రావుల మద్దతుతో బీఆర్‍ఎస్‍ లోకి వెళ్లిన మేఘారెడ్డి.. మంత్రి నిరంజన్‍ రెడ్డిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‍ లో చేరి టికెట్టు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న రావుల, కాంగ్రెస్‍ పార్టీలో చేరిన పెద్దమందడి ఎంపీపీగా ఉన్న మేఘారెడ్డికి రావుల మద్దతు ఉంటుందని... ఈ క్రమంలో రావుల వెంట ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకు మేఘారెడ్డివైపు మళ్లకుండా.. బీఆర్ఎస్ కే మళ్లించుకునేందుకు రావులను ప్రణాళిక బద్ధంగా గులాబీ పెద్దలు వ్యవహిరించి సఫలీకృతులు కావడం వనపర్తి రాజకీయాల్లో చర్చాంశంగా మారింది. 

వనపర్తిలో అధిక మెజారిటీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 2014 ఎన్నికల్లో చివరిసారి పోటీచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి 45 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. తర్వాత 2018లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి కూడా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం.. బీఆర్ఎస్ లో  చేరడం ద్వారా రావులకు ఇప్పటికిప్పుడు శాసనమండలి సభ్యత్వం ఇచ్చి.. తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి బరిలోకి దించుతామని ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచినట్లు సమాచారం. అయితే ఈసారి వనపర్తిలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేయాలనే ఉద్దేశంలో భాగమే.. రావులను బీఆర్‍ఎస్‍ లోకి లాగినట్టు వనపర్తి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి రావుల రాకతో నిరంజన్ రెడ్డి గెలుపు మరింత పక్కాగా మారుతుందని ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. మరి.. రావుల రాక ఫలితం ఎంతమేరకు నిరంజన్ రెడ్డికి బదిలీ అవుతుందనేది చూడాలి. 

నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

నోట్- ఈ వార్త ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. కామెంట్ రాయండి. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత