Skip to main content

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి? 

Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ నిపుణులు. కోవిడ్ టైమ్ లో ఇంగ్లాండ్ లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులలో స్మోకర్ల సంఖ్య నలుగురిలో ఒకరి నుంచి ముగ్గురిలో ఒకరికి పెరిగిందట. ఇది యూకే ప్రభుత్వం స్వయంగా తేల్చిన ఓ సర్వే రిపోర్టు. దిక్కుమాలిన పొగ కోసం స్లమ్ ఏరియాల్లో ఉండే నిరుపేదలు కూడా ఏటా పది శాతం ఆదాయాన్ని తగలేస్తున్నారట. ఇప్పుడు ఏటా దాదాపు 70 వేల పొగాకు వినియోగ మరణాలు ఒక్క యూకేలోనే సంభవిస్తున్నాయట.

క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న, దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రయత్నం కారణంగా.. ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. పొగ తాగే దురలవాటును ఉన్నపళంగా అరికట్టాలని లేకపోతే.. ఇప్పుడు వేప్స్ కు అలవాటు పడిన చిన్నపిల్లలు, ఎలక్ట్రిక్ సిగరెట్లకు బానిసలైనవారు రేపు అసలైన టుబాకో ప్రోడక్ట్స్ కు అడిక్ట్ అవుతారని.. రానున్న రోజుల్లో పిల్లలంతా పెద్దలుగా ఎదగక ముందే ఈ లోకం నుంచి అదృశ్యమైపోయే ప్రమాదం పొంచి ఉందన్న డేంజర్ బెల్స్ రిషి మోగిస్తున్నారు. బుధవారం మాంచెస్టర్లో కన్సర్వేటివ్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సునాక్ తన నెక్స్ట్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేశారు. 

ఇంగ్లాండ్ దేశమంతటా సిగరెట్లు కొనే వినియోగదారుల ఏజ్ ను ఏటేటా పెంచుకుంటూ పోయి క్రమంగా నెక్స్ట్ జెనరేషన్ కు అసలు సిగరెట్ అనేది తెలియకుండా చేయాలనేది రిషి సునాక్ ప్లాన్. ఇందుకోసం చాలా స్పీడ్ గా చర్యలు చేపట్టాలని, వీలైనంత తొందరలో పార్లమెంట్లో చట్టం ఆమోదింపజేసుకొని.. చాలా వేగంగా అమల్లోకి వెళ్లాలని కన్సర్వేటివ్ పార్టీ యోచిస్తోందట. ఆ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో ప్రధానిగా రిషి చాలా కీలకంగా మారడం విశేషం. అయితే ఈ విషయంలో పలు దేశాలు ఇప్పటికే కొంతవరకు ప్రోగ్రామ్ ను అమల్లోకి తీసుకొచ్చాయి. గతేడాదే న్యూజీలాండ్ యాంటీ స్మోకింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. 2008 తరువాత పుట్టినవారికి సిగరెట్లు అమ్మరాదనే చట్టాన్ని న్యూజీలాండ్ అమలు చేస్తోంది. అంటే 2009 జనవరి 1, ఆ తరువాత పుట్టినవారికి సిగరెట్లు అమ్మరాదనేది ఓ కటాఫ్ డెసిషన్. 14 ఏళ్ల లోపు ఉన్నవారికి న్యూజీలాండ్ లో సిగరెట్ అమ్మరాదు. ఇప్పుడదే బాటలో ఇంగ్లాండ్ కూడా పయనిస్తోంది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ లో 18 ఏళ్ల యువకుల నుంచి సిగరెట్ ను దర్జాగా కాల్చే హక్కు చట్టపరంగా అమల్లో ఉంది. అది త్వరలో ఇంగ్లాండ్ లో మారబోతోంది. 

పొగాకుతో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందని.. ప్రపంచాన్ని అదే భయపెడుతోందని.. దాన్ని అరికట్టాలనే ఓ బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నాయి. ప్రజలకు, పాలకులకు, రాజకీయ పార్టీలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా ప్రభుత్వాలేవీ ఈ మహమ్మారిని అరికట్టడానికి ఇప్పటివరకు కృషి చేయలేదు. అందుక్కారణం సిగరెట్ స్మోకింగ్ అనేది రిచ్ పీపుల్ కల్చర్ గానే కాక.. అతి సామాన్యులు సైతం స్మోకింగ్ లేకుండా ఉండలేని పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది. మరోవైపు సిగరెట్ కంపెనీలు బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. వారు చెప్పినట్టల్లా ఆడే ప్రభుత్వాలు అన్ని దేశాల్లోనూ కొలువుదీరి ఉన్నాయి. అలాంటివాటికి చెక్ పెట్టాలంటే భారీ ఆదాయానికి స్వయంగా గండి కొట్టడమే అవుతుంది. అందుకే ఇప్పటిదాకా స్మోకింగ్ మీద కంట్రోల్ విధించలేకపోయారు. కానీ ఇప్పుడు మన భవిష్యత్తరాల ప్రాణం మీదికే వచ్చిందని రిషి సునాక్ భావిస్తున్నారు. మరోవైపు ఒరిజినల్ సిగరెట్ల లాగే కాస్త తక్కువ ప్రమాదం అంటూ డూప్లికేట్ సిగరెట్లు కూడా మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. వాటికోసం పిల్లలు ఎగబడుతున్నారు. అవే డిస్పోజబుల్ వేప్స్. మరోవైపు ఎలక్ట్రికల్ సిగరెట్లు కూడా మార్కెట్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రమంగా ఒరిజినల్ సిగరెట్ల వినయోగం వైపు మళ్లించేవే తప్ప.. నిజంగా ఆ అలవాటును మాన్పించడానికి కాదన్న వాదన ఉంది. అందుకే డిస్పోజబుల్ వేప్స్ పని పట్టడానికి కూడా సునాక్ నిశ్చయించుకున్నారట. 

పొగాకు ఉత్పత్తుల మీద క్రమంగా కంట్రోల్ విధించబోతున్న కారణంగా ఏటా 17 బిలియన్ పౌండ్ల ఆదాయం మిగులుతుందని.. అంతకన్నా విలువైన మన భావితరాల ఆయుర్దాయం పెరుగుతుందని రుషి సునాక్ అంటున్నారు. త్వరలో వచ్చే బిల్లును పార్టీలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా అందరూ ఓటేయాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఇక రుషి నోట ఈ మాట వెలువడిందే ఆలస్యం.. స్టాక్ ఎక్స్చేంజీలోని అన్ని సిగరెట్ కంపెనీల షేర్లు పతనమైపోవడం ప్రారంభమైంది. క్యాన్సర్ నివారణ కోసం ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థలు.. రిషి తీసుకోబోతున్న స్టెప్పును స్వాగతిస్తున్నారు. అయితే దాని అమలు అనుకున్నంత సులభం కాదని.. ఎంతో చిత్తశుద్ధి, మరెంతో పరిణతితో పాటు... చాలా పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని... స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ ను స్మోక్ ఫ్రీ కంట్రీగా చేయడానికి పెద్దఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. దానికి 14వేల మంది మద్దతు లభించిందట. 50కి పైగా ఎంపీల మద్దతు కూడా లభించిందట. వారే కాక.. కౌన్సిలర్లు, ప్రభువులు, 20కి పైగా స్వచ్ఛంద సంస్థల మద్దతు కూడా లభించిందట. పొగాకు వినియోగంపై చాలా వేగంగా ఉక్కుపాదం మోపుతూ పోతే 2030 వరకు స్మోక్ ఫ్రీ కంట్రీ అవుతుందని సునాక్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఇంగ్లాండ్ లోని పేదలు, మురికివాడల్లో ఉండేవారు... 2050 వరకు స్మోకింగ్ కి దూరంగా ఉండడం అసంభవం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అడ్డదార్లలో లభిస్తున్న పొగాకు, గంజాయి వంటి వాటికి అడ్డుకట్ట వేయకుండా కేవలం చట్టాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఆ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఏమైనా రుషి ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడం మాత్రం దేశానికి చాలా మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తుండడం విశేషం. అంటే సునాక్ ఒకు శుభారంభాన్ని చేసినట్టేనంటున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా. 

ఇక ఇదే ఇష్యూను మన ఏపీతో పోల్చుకొని ఓసారి చూద్దాం. జగన్ తాను పవర్లోకి వచ్చాక దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పారు. పాపం.. తన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చి చూశారు కూడా. అప్పుడు తెలిసింది ఆయనకు.. మద్య నిషేధాన్ని అమలు చేయడం  ఎంత కష్టమో. దాన్ని అమలు చేసే ప్లానింగ్, మెకానిజం, చిత్తశుద్ధి.. ఇలాంటివేవీ ప్రదర్శించని జగన్.. దాన్ని సాకుగా తీసుకొని.. ఏకంగా ధరలు పెంచేసి మళ్లీ ఓ ఆదాయమార్గంగా ఎంచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తరువాత జగన్ మద్య నిషేధం మాట కూడా ఎత్తడం లేదు. అయితే న్యూజీలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాలు ఏ విధంగా పొగాకు వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కటాఫ్ డేట్ పెట్టుకొని నెక్స్ట్ జెనరేషన్ కు అందకుండా చేసేందుకు యోచిస్తున్నాయో.. ఇక్కడ కూడా అలాంటి ప్రయోగం ఏదైనా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలంటున్నారు నిపుణులు. అయితే మద్య నిషేధమైనా, పొగాకు నిషేధమైనా.. ఇప్పుడున్న తరాన్ని వదిలేసి.. రేపటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రకమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటూ పోతే.. క్రమంగా ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. మరి జగన్.. రిషి సునాక్ బాటను ఎంచుకుంటారా? 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత