Skip to main content

Posts

ఒకే కాలనీలో 12 వేల మందికి నూతన గృహాలు

విజయనగరం జిల్లాలోని గుంకలామ్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 12,301 ఇళ్లతో నిర్మించబోయే వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీకి శంకుస్ధాపన జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎం.పి.లు వి. విజయసాయి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం.హరిజవహర్ లాల్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. 
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

వీకెండ్ స్టోరీ- ఆధునిక ఆదర్శ హిందూ వివాహం ఇదే

హిందూ సమాజ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైందో... అంత సానుకూలమైంది కూడా. అయితే అనుకూలతలు అటుంచి కేవలం సంక్లిష్టతలు మాత్రమే ఎత్తిచూపే ప్రబుద్ధులు తమ దుర్బుద్ధిని మార్చుకోవాల్సిన సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అందుకు కరీంనగర్‍లో జరిగిన తాజా పెళ్లే ఓ ఉదాహరణ.  డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూపారు.

weekend story- కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి

Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు IMP Story:   ఎంఐఎంతో పొత్తు కోసం తహతహ ఇందుకేనా? మానవ జిహ్వ చాపల్యానికి వీకెండ్స్ లో ఎన్ని మూగజీవాలు క్యూ కట్టి బలవుతున్నాయో ఊహించజాలం. అయితే మానవులు జిహ్వచాపల్యాన్ని అణచుకోకుండానే మూగజీవాలు సంతోషించే రోజు రానే వచ్చింది. దాదాపు పదేళ్లుగా జరుగుతున్న ప్రయోగాలకు ఎండ్ కార్డ్ పడుతోంది. మార్కెట్ లోకి కృత్రిమ చికెన్ వచ్చేసింది. భవిష్యత్తులో కోళ్లన్నీ ఆనందించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ్టి నుంచే (డిసెంబర్ 19) సింగపూర్లో కృత్రిమ చికెన్ "రెస్టారెంట్ 1880" లోకి అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. చికెన్ సెల్స్ నుంచి మాంసకృత్తులను డెవలప్ చేసి ల్యాబ్ లో తయారుచేసిన చికెన్ సింగపూర్ రెస్టారెంట్లలో ఇవాళ్టి డిన్నర్ నుంచే ఘుమఘుమలాడుతుంది. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న కుర్రాళ్లే ఈ కృత్రిమ చికెన్ తొలి వినియోగదారులు కావడం విశేషం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈట్ జస్ట్ కంపెనీయే సింగపూర్ లో దాని ఉత్పత్తిని తొలిసారిగా మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ సీఈఓ లీ-కా-షింగ్ సింగపూరియన్ కావడం గమ

తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ Weekend Story:   కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ప్రభుత్వాలు కంటికి కనిపించని కుట్రలకు పాల్పడతాయా? అలాంటి అవకాశం ఉంటుందా? రాజకీయాలను, వాటి చుట్టూ పెనవేసుకున్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏమైనా జరగొచ్చని అనిపించక మానదు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాలను కాస్త లోతుగా పరిశీలిస్తే లోపాలతో పాటు.. కొన్ని కుట్రలు కూడా జరిగాయన్న విషయం తెలుస్తుంది.  అధికార టీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా నమోదైంది. 35.73 శాతంతో 11,92,162 ఓట్లతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. 35.55 శాతంతో 11,86,096 ఓట్లు సాధించిన బీజేపీ రెండో స్థానంలో ఉంది. అంటే టీఆర్ఎస్ కు, బీజేపీకి 0.18 శాతం ఓట్ల స్వల్ప దూరం మాత్రమే ఉందన్నమాట. ఒక్క శాతం తేడా కూడా లేని ఓట్ల శాతంతో జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఇక 18.91 శాతంతో 6,30,867 ఓట్లు మాత్రమే పొందిన ఎంఐఎం 44 డివిజన్లలో జెండా ఎగరేసి మూడో స్థానంతో తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక కాంగ్రెస్ 6.61 శాత

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్".  Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ 1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు

జానారెడ్డికి గవర్నర్‍గిరీ?

జనమెరిగిన నాయకుడు జానారెడ్డికి….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటారనే పేరుంది. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే వ్యక్తి ఆయనే. గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం రాలేదు. అలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా? కమలనాథులు జానాకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారా.. ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్‍గిరీ కావాలని, తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వాలని అడిగారా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది.  నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో జానారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటి చెప్పాలని చూస్తున్న బీజేపీ నేతలు.. అందుకు సాగర్లో తగిన నాయకుడు జానారెడ్డే కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలని గట