Skip to main content

Posts

న గల్లీ తుమ్హారా.. న ఢిల్లీ తుమ్హారా..

ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో  ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో క

గీ పట్నపోల్లకు ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది.. అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భమిది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం కన్నా ఎక్కువ అనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. మరి ప్రజల్లో 50 శాతం పోలింగ్ కానప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించవచ్చా? అది మేలైన ప్రజాస్వామ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? కేంద్రమో, రాష్ట్రాలో దీనికోసం పూనుకోవాల్సిన అవసరం లేదా? (పాఠకులు ఇబ్బంది అనుకోకుండా తెలంగాణ స్లాంగ్ లో చదువుకోవాలని మనవి) గీ పట్నపోల్లకు ఏమైంది? యూత్ పోరలు, సదువుకున్నోల్లు, జాబుల్ జేసేటోల్లు యాడ వోయిండ్రు? మొన్నటి సంది జెప్తనే ఉన్నం గదా... ఓట్లేసుడంటే ప్రజాస్వామ్య పండుగ అన్జెప్తన్నం గదా.. మల్లేమాయె. అరె.. మొన్న బీజేపీ పెద్దసార్లయితే ఓ మునుం బెట్టి పట్నానికచ్చిండ్రు గదా. అమిత్ సార్ గల్లీ మార్చ్ సౌండూ.. డిల్లీదాక పాకింది గదా. గా షో జూత్తెనైతే ఇగ హైదరాబాద్ జనం పోలింగ్ బూత్ ల కాడ లైన్ల మీద లైన్లు గట్టి ఓట్లకోసం

ఎగ్జిట్ పోల్ సర్వే లేనట్టే

Also Read:   సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలెలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. అలాంటివారు 3వ తేదీ సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే. ఓల్డ్ మలక్ పేట బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు (కంకి కొడవలికి బదులు సుత్తె కొడవలి) అచ్చయ్యాయి. ఈ వార్త మీడియాలో హైలైట్ గా మారింది. దీంతో సీపీఎం నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఓల్డ్ మలక్ పేట ఎన్నికను అధికారులు రద్దు చేశారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరూ విడుదల చేయరాదని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో 3వ తేదీన రీపోలింగ్ తరువాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలవుతాయి.  Also Read:  గీ పట్నపోల్లకు ఏమైంది? వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హైదరాబాద్ ఎన్నికలపై వోటర్ నాడి రికార్డు చేసేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. విడతలవారీగా సర్వేలు నమోదు చేస్తూ ఆసక్తికరంగా మారుతున్న గ్రౌండ్ వివరాలను అంచనా వేస్తూ తుది నిర్ణయం వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నాయి.  Also Read:  హైదరాబాద్ పోల్ - హైటెన్షన్                          గ్రేటర్ పై సర్వేలు ఏం చెబుతున్నాయి?

హైదరాబాద్ పోలింగ్ - హై టెన్షన్

గ్రేటర్ ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ కన్నా టెన్షన్ వాతావరణం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. పలు చోట్ల అధికార, విపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇంకొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది మీద కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సనత్ నగర్ పోలింగ్ స్టేషన్ లోని బూత్ నెంబర్ 13లో ఓటేయడానికి వచ్చిన ఓటర్లతో గుర్తు గుర్తుంది కదా.. మర్చిపోకండి అంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్న సిబ్బందిని క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు నిలదీశారు. సిబ్బంది మీద కంప్లయింట్ చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మాదాపూర్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ రెండు పార్టీల మధ్య అక్కడ ఘర్షణ నెలకొంది. చాదర్ ఘాట్ లో ఆరు ఆటోల్లో బోగస్ ఓటర్లను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఎంబీటీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓల్డ్ మలక్ పేటలోని బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు అచ్చవడంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేశారు. 3వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్న

గ్రేటర్ పోల్: ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్

డిసెంబర్ 1న జ‌రిగే జీహెచ్ఎంసీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260:  పురుషులు 38,76,688, స్త్రీలు 35,65 896, ఇతరులు 676 మొత్తం వార్డుల సంఖ్య 150 పోటీ చేసే అభ్యర్థులు 1122:      టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149,  కాంగ్రెస్ 146,  టి.డి.పి 106,  ఎం.ఐ.ఎం 51,  సి.పి.ఐ 17,  సి.పి.ఎం 12,  రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76,  స్వతంత్రులు 415 ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య  60,  స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్ ల సంఖ్య 30 పోలింగ్ సిబ్బంది 48,000 రిటర్నింగ్ అధికారులు 150 సహాయ రిటర్నింగ్ అధికారులు 150 సాధారణ పరిశీలకులు 14 వ్యయ పరిశీలకులు 34 మైక్రో అబ్జర్వర్ లు 1729, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2277 మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683 పోస్టల్ బ్యాలెట్లకై అందిన దరఖాస్తులు 2831 డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. 6 గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి. ఉ. 6 నుండి 6:15 మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది. ఉ. 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయ‌డం జ‌రుగుతుంది.  ఉ. 7గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం. సా. 6గంట‌ల‌కు పోలింగ్ పూర

వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్ లైన్ టికెట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రోజు 20 వేల టిక్కెట్లను జారీ చేస్తామని చెప్పారు. Readable:   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సర్వేలు ఏం చెబుతున్నాయి?                          హైదరాబాద్ లో రోహింగ్యాలు.. కన్ఫామ్

గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

గ్రేటర్ ఎన్నికలు జాతీయ అంశంగా మారడంతో అందరి దృష్టీ హైదరాబాద్ మీదనే పడింది. ఎవరు గెలుస్తారు.. ఎవరు గ్రేటర్ పీఠాన్ని ఏలుతారు.. అనేది అందరి మదనీ తొలుస్తున్న అంశం. అందరికన్నా ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, దాని మిత్రుడైన ఎంఐఎం కు మరింత అవసరమైన సబ్జెక్టు. దీని మీద గ్రౌండ్ సర్వేలు కూడా పలు ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. నవంబర్ మొదటి నుంచి ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో పనిచేసి రిపోర్టులను రికార్డు చేస్తున్నాయి. రాజకీయ వ్యాఖ్యానాలు, వేడి పుట్టించే కామెంట్లు వాతావరణాన్ని గంభీరంగా మారుస్తూ... ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సంస్థల రిపోర్టులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు.  Also Read:  రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?                          ఒవైసీలతో స్నేహం కేసీఆర్ కు సవాలేనా? ఈ వీడియోలో ఇంకా పూర్తి వివరాలు, విశ్లేషణ ఉన్నాయి. చూడండి.