Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

ఆ నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీఆర్ఎస్ అధిష్టానం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మంత్రికి... మొన్నటివరకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడు కూడా ఇప్పుడు జత కావడం మంత్రికి కలిసొస్తుందా? తనకు కలిసి రావడం కోసం మంత్రి ఈ స్కెచ్ వేశారా? లేక అవతలి పార్టీని దెబ్బ తీయడానికే ఆయన్ని కలుపుకున్నారా? సుదీర్ఘమైన అనుభవం, ప్రజలతో మంచి కనెక్షన్ ఉన్న ఆ నాయకుడు కారెక్కితే బీఆర్‍ఎస్‍ కు భారీ మెజారిటీ ఖాయమా? మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కారు పార్టీలో కలిసి మెలిసి తిరగడానికి కారణమేంటి? బీఆర్‍ఎస్‍ లో చేరిన ఆ నేత లక్ష్యమేంటి? గులాబీ బాస్‍ ఇచ్చిన ఆఫర్‍ ఏంటి? Read this: కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" Read this: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం వనపర్తి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రావులను బీఆర్‍ఎస్‍లోకి తీసుకు రావడం వెనుక అధికార బీఆర్‍ఎస్‍ అధిష్టానం ఎంతో పకడ్బందీగా

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

మధుయాష్కీ, పొన్నం టికెట్ల పరిస్థితి ఇదే

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీనియర్లను లైట్ తీసుకుంటున్నారా? చాలా మంది సీనియర్ల రాజకీయ భవిష్యత్ డైలమాలో పడినట్టేనా? మొదటి లిస్టులో సీనియర్ల పేర్లు కనిపించకపోవడానికి కారణం అదే అంటున్నారు విశ్లేషకులు. ఇక రెండో జాబితా సీట్లలో పోటీ విపరీతంగా ఉండడంతో టికెట్లు దక్కే సంభావ్యత అనుమానంలో పడిందన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది.  టీ-కాంగ్రెస్ లో సీనియర్లంటే ఒకప్పుడు వారు చెప్పిందే వేదం. ఆ మాటకొస్తే.. ఎవరు రాసుకున్న వేదం వారిదే... అన్నట్టుగా ఉండేది పరిస్థితి. పార్టీ పగ్గాలన్నీ ఢిల్లీలోని హైకమాండ్ గుప్పిట్లో ఉండడంతో.. లోకల్ పీసీసీ చీఫ్ లు గానీ, పార్టీ ఇతర పోర్ట్ ఫోలియోల మాటలకు గానీ పెద్దగా చెల్లుబాటు అయ్యేది కాదు. ఢిల్లీలో వారు చెప్పిందే ఫైనల్ కాబట్టి.. ఇక్కడ వీరి మాటలకు పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టాక క్రమంగా రీతి-రివాజు మారుతూ వచ్చింది. తొలుత రేవంత్ ను కూడా పాత పద్ధతుల్లోనే గూట్లో చెక్కేందుకు ప్రయత్నించారు. అయితే హైకమాండ్ ను ఒప్పించకొని, మెప్పించుకున్న రేవంత్.. రాష్ట్ర పార్టీ మీద క్రమంగా అదుపు సాధించారు. రేవంత్ కు రాహుల్ స్వేచ్ఛగా న

టి-కాంగ్రెస్ లో ఎన్నడూ లేని జోష్.. కారణం ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఏ రేంజ్ లో ఉందంటే.. గెలుపుకు అర అంగుళం దూరంలోనే ఉన్నామన్న ఫీలింగ్ లో వారంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అధికారం అందుకోవడం ఖాయమైపోయిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తన సంతోషాన్ని, ఆనందాన్ని లోపలే దాచుకోవాల్సి ఉండగా.. బహుశా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతోనో ఏమో గానీ.. సీఎం కుర్చీ మీద కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేశారు జానా. మరి జానాలాగే మరికొందరు సీనియర్లు కూడా ఇదే వాయిస్ వినిపిస్తారా? కాంగ్రెస్ లో సీనియర్లకు ఎదురవుతున్న పరిస్థితులేంటి? టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముందే 6 గ్యారెంటీ పథకాల హామీతో జనంలోకి చొచ్చుకుపోతోంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో టీ-పీసీసీ తొలి జాబితా విడుదల చేసింది. అయితే అందులో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిలో నైరాశ్యం అలముకుందన్న వార్తలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. రెండో జాబితా బయటకు రావాల్సి ఉన్నా.. తొలి జాబితాలోనే తమకు చోటు లేనప్పుడు.. ఇంక రెండో జాబితాలో ఎక్కణ్నుంచి ఉంటుందన్న నైరాశ్య

మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

కంచే చేనే మేస్తే.. ఆ కాపు ఏం చేయాలి? రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే పక్షపాతం చూపి తప్పుకుంటే ఎవర్ని ఆశ్రయించాలి? ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు తెగబడి.. బెదిరింపులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? కరీంనగర్ లోని ఓ బాధిత రైతు.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెర లేపిన భూ కబ్జా భాగోతంతో బెంబేలెత్తిపోతున్నాడు. కరీంనగర్ లో ఉండలేక, ఉంటే బతుకుతానన్న గ్యారెంటీ లేక హైదరాబాద్ పారిపోయి వచ్చానంటున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదంటూ.. హైదరాబాద్ లో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే భూములకు రక్షణ దొరుకుతుందనుకున్న సామాన్య ప్రజలకు.. అలాంటి భరోసా ఏమీ కనిపించడం లేదన్న విమర్శలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. అందుక్కారణం పార్టీ పేరు చెప్పుకునో లేదా ఏదో ఒక అధికారి పేరు చెప్పుకునో మాఫియారాయుళ్లు భూములు కబ్జా చేయడం లేదిప్పుడు... ఏకంగా మంత్రులే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రంగంలోకి దిగుతున్నారట. రాష్ట్ర మంత్రి వర్గంలో చాలా కీలకమైన పోర్టుఫోలియో కలిగి ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగుల పేరు త

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి?  Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ నిపుణులు. కోవిడ

నిరంజన్‎రెడ్డి బర్త్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక సంచిక

తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న, ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 64వ బర్త్ డే వేడుకలు ఆత్మీయుల మధ్య ఎంతో హుందాగా, సాదాసీదాగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉదయం నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరంజన్ రెడ్డి అభిమానులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని భాగ్యనగర్ పోస్ట్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. మేగజైన్ మేనేజింగ్ ఎడిటర్ రాఘవరెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఎన్నికల్లోనూ నిరంజన్ రెడ్డి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన బర్త్ డే వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో అభిమానులు వనపర్తికి తరలి రావడంతో పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది.  Also Read: నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ స్కెచ్ Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

భారతీయ నారీ శక్తిని బయటపెట్టిన తాజా రిపోర్ట్

ఆడపిల్లలు అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు... తాము ఎందులోనూ, ఎవరితోనూ తీసిపోమని. అయినా పురుషాధిక్య సమాజం.. మహిళల మీద ఆంక్షలు విధించింది. మహిళల మేలు కోసమేనని ఒకసారి.. మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తే గనక మగాళ్ల పని ఖతం.. అనే పేరుతో ఇంకోసారి.. ఇలా అనేక కోణాల్లో మహిళల్ని అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే మాత్రం.. మహిళల్లో దాగున్న పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్టు ఏం చెబుతోంది? దాన్నుంచి మనవాళ్లు నేర్చుకోవాల్సిన అంశాలేంటి?  ఆడవాళ్లకు చెప్పించే చదువు దగ్గర నుంచి, వారికి సొంతంగా ఏదైనా బాధ్యతలు అప్పగించేదాకా.. ప్రతిచోటా వారికి ద్వితీయ ప్రాధాన్యమే దక్కుతోంది. అయితే ఈ మధ్య ఇలాంటి అభిప్రాయాల్లో మార్పులు జరిగినా.. ఆ మార్పులు రావాల్సిన స్థాయిలో మాత్రం రాలేదు. అందువల్ల ఆకాశంలో సగం అని గౌరవించుకునే మనమే.. వారి అవకాశాలకు గండి కొట్టేశాం. ఫలితంగా దేశ ఆర్థిక ఎదుగుదలలో వారి పాత్ర తగ్గిపోయింది. దాని ప్రభావం కొన్ని తరాల దాకా పాకిందంటే అతిశయోక్తి కాదు. అయితే మహిళలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. వారికి ఇవ్వాల్సిన ప్రాధ

రజాకార్ మూవీలో ఏముంది?

ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన సమయంలో జరిగిన పోరాటాలు... ఆ తరువాత భారత్‌పై జరిగిన దాడులను భావి తరాలకు తెలియజేసేలా కొందరు నిర్మాతలు, దర్శకులు సినిమాలను రూపొందించడం ట్రెండ్‌గా వస్తోంది. అలాంటి సినిమాలలో కొన్ని ప్రశంసలు అందుకుంటే... మరికొన్ని విమర్శలపాలవుతున్నాయి. ఆ కోవకు చెందినవే ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు. ఇప్పుడిక ఆ జాబితాలో రజాకార్ మూవీ చేరిపోయింది. భారత స్వతంత్రం అనంతరం తెలంగాణలో రజాకార్ల అరచకాలను తెలిపేలా ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మాత్రం దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రిలీజ్ అయిన రజాకార్ మూవీ టీజర్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. 1.42 నిమిషాల నిడివి గల ఈ టీజర్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలను రెండు వర్గాలుగా విడదీసేందుకే ఈ మూవీని తీస్తున్నారని కొందరు ఆరోపిస్తుండగా... లేదు లేదు... ఇదో పీరియాడి

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో

సెప్టెంబర్ 17.. విలీనమా, విమోచనమా, విద్రోహమా, సమైక్యతా దినమా, స్వాతంత్ర్య పర్వమా?

రేసు మళ్లీ మొదలైంది. రేసు పాతదే అయినా.. ఎప్పుడూ సరికొత్తగా ఉండేలా చూసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి. సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీల మధ్య ఇదో ప్రహసనంగా మారిందన్న తేలిక భావం కూడా ఏర్పడిందన్న అభిప్రాయాలున్నాయి. సెప్టెంబర్ 17 అనేది చారిత్రక ప్రాధాన్యత ఉన్న రోజే కాదు.. తెలంగాణ ప్రజలకు ఎంతో ఘనమైన సెంటిమెంట్ కూడా దీంతోనే ముడివడి ఉంది. తెలంగాణలో అధికార పార్టీ ఈసారి మళ్లీ ఎలాగైనా గెలిచి తీరేందుకు కసరత్తు చేస్తుంటే.. అటు విపక్షాలు కూడా తమ కలను సాకారం చేసుకునేందుకు అదే తరహాలో ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో  సెప్టెంబర్ 17ను ఏ పార్టీ ఏవిధంగా నిర్వహించాలని చూస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.  సెప్టెంబర్ 17వ తేదీకి ఉండే ప్రాధాన్యత ఈనాటిది కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 13 నెలల తరువాత గానీ హైదరాబాద్ సంస్థానం విలీనం జరగలేదు. అంటే భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17వ తేదీన కలిసిపోయింది. అప్పటిదాకా హైదరాబాద్ అనేది ప్రత్యేక సంస్థానంగా, ప్రత్యేక సైన్యం, ప్రత్యేక రైల్వే, ప్రత్యేక ఆర్టీసీ వంటి అనేక సౌకర్యాలతో ఉనికి చాటుకుంది. అనేక పోరాటాల ఫలితంగా, ఎందరో అమాయకుల ప్రజల బలిదానం ఫలితంగ

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు: