Skip to main content

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది. 

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో చేతివృత్తులు చేసుకునేవారిలో ఆశలు, అంచనాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా వృత్తి పనివారలుగా ఉన్న కోట్లాది మందికి విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి చేకూరుతుందని మోడీ చెప్పారు. 18 సంప్రదాయ చేతివృత్తులవారికి శిక్షణ ఇచ్చి, వారికి సర్టిఫికెట్ కూడా జారీ చేసి.. వారి వృత్తికి ఉపయోగపడే టూల్ కిట్ కొనుగోలు కోసం 15 వేలు కూడా ఇస్తారని చెబుతున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని మోడీ స్వయంగా ప్రకటించారు. విశ్వసృష్టికి, సకల జగత్తు గమనానికి కారకుడైన విశ్వకర్మ పూజా మహోత్సవం రోజునే మోడీ పుట్టిన రోజు కావడంతో.. సెప్టెంబర్ 17కు దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో 17వ తేదీన హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో వృత్తిదారులతో సభ నిర్వహిస్తున్నారట. ఈ స్కీము విధి విధానాలు ఆ రోజున తెలియజేస్తారట. 

చితికిపోయిన చేతివృత్తులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న కోట్లాది మందికి రెండున్నర శాతం వడ్డీ రాయితీతో ఎలాంటి పూచీకత్తు లేకుండానే మొదటి విడతగా లక్ష రూపాయలు, రెండో విడతగా 2 లక్షలు.. ఇలా మొత్తం 3 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారు. చేతివృత్తులైన వడ్రంగం, కమ్మరం, కంచరి పని, కంసాలి, శిల్పం వంటి విశ్వబ్రాహ్మలు చేసుకునే వృత్తులతో పాటు.. పడవల తయారీదారులు, ఆయుధాలు తయారు చేసేవారు, పరికరాలు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, రిపేరు చేసేవారు కుండలు తయారుచేసే కుమ్మరులు, మోచీ, మేదర, మేస్త్రీపని, బొమ్మలు లేదా ఆట వస్తువులు తయారు చేసేవారు, బార్బర్లు, పూల దండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీ, చేపలు పట్టేవారికి వలలు వగైరా పరికరాలు సమకూర్చడం. ఇలా 18 రకాల వృత్తి పనివారికి ఆర్థిక సాయం ఇచ్చే కీలకమైన కార్యక్రమానికి సెప్టెంబర్ 17నే మోడీ శ్రీకారం చుట్టడం విశేషంగా మారింది. 

ఈ విధంగా సెప్టెంబర్ 17కు చారిత్రక, పౌరాణిక నేపథ్యం మాత్రమే గాక.. ప్రధాని జన్మదినం కూడా తోడవడంతో ఇది తెలంగాణలో కీలకంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఏపీ విశ్వబ్రాహ్మణ పెద్దల విజ్ఞాపనను గౌరవించి సెప్టెంబర్ 17 విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Read this also: సెప్టెంబర్ 17.. విలీనమా, విమోచనమా, విద్రోహమా, సమైక్యతా దినమా, స్వాతంత్ర్య పర్వమా?

Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?