Skip to main content

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది. 

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో చేతివృత్తులు చేసుకునేవారిలో ఆశలు, అంచనాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా వృత్తి పనివారలుగా ఉన్న కోట్లాది మందికి విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి చేకూరుతుందని మోడీ చెప్పారు. 18 సంప్రదాయ చేతివృత్తులవారికి శిక్షణ ఇచ్చి, వారికి సర్టిఫికెట్ కూడా జారీ చేసి.. వారి వృత్తికి ఉపయోగపడే టూల్ కిట్ కొనుగోలు కోసం 15 వేలు కూడా ఇస్తారని చెబుతున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ పూజా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని మోడీ స్వయంగా ప్రకటించారు. విశ్వసృష్టికి, సకల జగత్తు గమనానికి కారకుడైన విశ్వకర్మ పూజా మహోత్సవం రోజునే మోడీ పుట్టిన రోజు కావడంతో.. సెప్టెంబర్ 17కు దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో 17వ తేదీన హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో వృత్తిదారులతో సభ నిర్వహిస్తున్నారట. ఈ స్కీము విధి విధానాలు ఆ రోజున తెలియజేస్తారట. 

చితికిపోయిన చేతివృత్తులనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న కోట్లాది మందికి రెండున్నర శాతం వడ్డీ రాయితీతో ఎలాంటి పూచీకత్తు లేకుండానే మొదటి విడతగా లక్ష రూపాయలు, రెండో విడతగా 2 లక్షలు.. ఇలా మొత్తం 3 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారు. చేతివృత్తులైన వడ్రంగం, కమ్మరం, కంచరి పని, కంసాలి, శిల్పం వంటి విశ్వబ్రాహ్మలు చేసుకునే వృత్తులతో పాటు.. పడవల తయారీదారులు, ఆయుధాలు తయారు చేసేవారు, పరికరాలు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, రిపేరు చేసేవారు కుండలు తయారుచేసే కుమ్మరులు, మోచీ, మేదర, మేస్త్రీపని, బొమ్మలు లేదా ఆట వస్తువులు తయారు చేసేవారు, బార్బర్లు, పూల దండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీ, చేపలు పట్టేవారికి వలలు వగైరా పరికరాలు సమకూర్చడం. ఇలా 18 రకాల వృత్తి పనివారికి ఆర్థిక సాయం ఇచ్చే కీలకమైన కార్యక్రమానికి సెప్టెంబర్ 17నే మోడీ శ్రీకారం చుట్టడం విశేషంగా మారింది. 

ఈ విధంగా సెప్టెంబర్ 17కు చారిత్రక, పౌరాణిక నేపథ్యం మాత్రమే గాక.. ప్రధాని జన్మదినం కూడా తోడవడంతో ఇది తెలంగాణలో కీలకంగా మారుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఏపీ విశ్వబ్రాహ్మణ పెద్దల విజ్ఞాపనను గౌరవించి సెప్టెంబర్ 17 విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Read this also: సెప్టెంబర్ 17.. విలీనమా, విమోచనమా, విద్రోహమా, సమైక్యతా దినమా, స్వాతంత్ర్య పర్వమా?

Comments

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు: