Skip to main content

యాభై రోజుల్లోనే పాస్ మార్కులు కొట్టేసిన రేవంత్

- కూర సంతోష్, సీనియర్ జర్నలిస్ట్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటింది. సీఎంగా రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. 2 హామీలు చేశామని చెబుతున్న ఆయన మిగతా అమలుకు కసరత్తు చేస్తున్నారు. మంత్రులకు సామాన్య ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్ సమిష్టి తత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు  అధికారుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భిన్నాభిప్రాయాలు, అసంతృప్తులకు మారు పేరైన కాంగ్రెస్ లో ఎవరూ నిరాశ చెందకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.

Read this also: ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్

Read this also: జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

తెగిన కంచెలు

సీఎంగా ప్రమాణం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్ ముందు ఉన్న కంచె తొలగింపజేశారు రేవంత్. గతంలో ప్రగతి భవన్ లోకి సామాన్యులకే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులకే అనుమతి ఉండేది కాదు. కానీ రేవంత్ ప్రజావాణి ద్వారా ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కల్పించారు. వారంలో 2 రోజులు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించడానికి స్పెషల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గతంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వాటి కోసం హైదరాబాద్ కు భారీగా జనం వస్తున్నారు. దీన్ని గమనించిన రేవంత్ క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కారం కోసం ప్రజాపాలన ప్రోగ్రాం అమలు చేశారు. అభయ హస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

పాలనపై పట్టు

రేవంత్ రెడ్డి పాలనకు కొత్త. ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా మాత్రమే పనిచేశారు. మంత్రి పదవి ఏనాడూ చెపట్టలేదు. అయితే రేవంత్ సీఎం అయిన వెంటనే సమీక్షలు నిర్వహిస్తూ పాలనపై పట్టు సాధించే ప్రయత్నం చేశారు. మరోవైపు పాలనలో ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. గతంలో బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించేవారన్న ఆరోపణలు ఉన్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. వారి స్థానంలో బాగా పని చేస్తారని పేరున్న వారిని నియమించారు. సమర్థత ఉండి లూప్ లైన్ లో ఉన్న అధికారులను మెయిన్ స్ట్రీంలోకి తెచ్చారు. గతంలో కొందరు అధికారుల హవా ఎక్కువగా ఉండేదని, ఇతర శాఖల్లో వారు చొరబడే వారని, ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు సెక్రటేరియట్ వర్గాలు.

మంత్రులకు స్వేచ్చ

ముఖ్యమంత్రి అంటే మంత్రులలో ముఖ్యుడు అని రాజ్యాంగం చెబుతోంది. అయితే కేసీఆర్ హయాంలో ఇది లేదు. కేసీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవారు. మంత్రులు నామమాత్రంగా ఉండేవారు. కేబినెట్ అంటే కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు మాత్రమేనని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే రేవంత్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు పూర్తిగా స్వేచ్చ ఇచ్చారు. దీంతో వారు సెక్రటేరియట్ లో తమ శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూ, నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందమే సందర్శించింది. ఆర్థిక శాఖ, ఇరిగేషన్, సివిల్ సప్లై, రవాణా మంత్రులు తమ శాఖల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవి నామమాత్రం కాదని నిరూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. సహచరుడు భట్టికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. కీలకమైన సమీక్షల్లో ఆయన్ను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను భట్టితో పాటు కలిశారు రేవంత్ రెడ్డి. ఆర్థిక పరిస్థితిపై ఇద్దరు కలిసి చర్చించారు. మరోవైపు ప్రధానిని తనొక్కడినే కలవకుండా భట్టిని కూడా తీసుకెళ్లారు. కేంద్రమంత్రులను కలిసేందుకు వెళ్లినప్పుడు సంబంధిత మంత్రులను తీసుకెళ్తున్నారు. వారితోనే బ్రీఫింగ్ ఇప్పిస్తున్నారు.

రేవంత్ ను కలిసిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (BFSI) ప్రతినిధులు

కేంద్రంతో సత్సంబంధాలు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలోని మోదీ సర్కార్ తో మంచి సంబంధాలు ఉండవని ఎన్నికల సమయంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ వీటిని పటా పంచలు చేశారు రేవంత్. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరించారు. పెండింగ్ లో ఉన్న నిధుల విడుదలకు హామీ పొందారు. అమిత్ షాను కలవగానే రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులు కేటాయించబడ్డారు. రేవంతో చొరవతో రిపబ్లిక్ డే పరేడ్ లో రాష్ట్ర శకటానికి అవకాశం కలిగింది.  

పార్టీలో అందరికీ విలువ

రేవంత్ రెడ్డి సీఎం మాత్రమే కాదు. పీసీసీ చీఫ్ కూడా. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరైనా ఏప్పుడైనా ఏదైనా మాట్లాడుతారు. అసంతృప్తి గళం వినిపిస్తారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ లో అంతర్గత కొట్లాటలు ఎక్కువ అవుతాయన్న వాదనలు వినిపించాయి. అయితే ఈ వాదనలు పటాపంచలు చేశారు రేవంత్ రెడ్డి. తన కంటే ముందు నుంచి ఉన్న సీనియర్లను కలపుకొని పోతున్నారు. పార్టీలో అందరికీ విలువ ఇస్తున్నారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి.. భట్టి, రేవంత్ తో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి తమ స్నేహ బంధం గొప్పదని,  ప్రతిపక్షాలకు  ఇది అర్థం కాదన్నారు. గతంలో తనను తీవ్రంగా వ్యతిరేకించి, పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డి కూడా తనను పొగిడేలా చేసుకున్నారు రేవంత్.

వనరుల వేట

ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కాబట్టి గ్యారంటీలకు నిధుల సేకరణ కోసం చర్యలు ప్రారంభించారు రేవంత్. ప్రధాని మోదీని కలిసి, రాష్ట్రానికి విడుదల కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దుబారా ఖర్చులు చేయబోమని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని, తద్వారా పథకాలకు నిధుల కొరత రానీవ్వబోమంటున్నారు రేవంత్. కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకున్నారు. కాంగ్రెస్ వస్తే విదేశీ పెట్టుబడులు రావన్న విమర్శలు తప్పని నిరూపించడానికి స్వయంగా దావోస్, లండన్ వెళ్లారు. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

జర్నలిస్టులకు విలువ

ఇక చివరగా జర్నలిస్టులకు విలువ. కేసీఆర్ హయాంలో జర్నలిస్టులు ప్రశ్నించడమే నేరంగా ఉండేది. ఎవరైనా ప్రశ్నిస్తే ఏ చానల్ మీది, ఏ పత్రిక మీది అని అడగడమో..?  లేదా  సెటైర్లు వేయడమో..? దబాయించడమో జరిగేది. కానీ రేవంత్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు అందుబాటులో ఉన్నారు. గతంలో కొత్తగా సెక్రటేరియట్ లో నిషేదాజ్ఞలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు. మరోవైపు గతంలో ప్రభుత్వ సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. దాదాపు అందరు జర్నలిస్టులకూ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అందుతోంది.

చివరగా ఒక్కమాట.. రేవంత్ పాలనకు ఇప్పుడే మార్కులు వేయలేం. ఎందుకంటే ఇప్పుడు 50 రోజులు మాత్రమే గడిచాయి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. హామీల అమలుకు ఆయనే 100 రోజుల గడువు పెట్టారు. హామీల అమలు చేస్తే ఖచ్చితంగా ఆయన్ను అందరూ మెచ్చుకుంటారు. లేకుంటే విపక్షాలు, సాధారణ జనంతో పాటు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత