Skip to main content

ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్

ఆధునిక పోకడలకు దూరంగా ఉండే వెనుకబడ్డ కొడంగల్ నుంచి.. రాష్ట్ర అత్యున్నత పదవికి ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలాచాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు.. పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైన రెండో సీఎం రేవంత్ కావడం మరో విశేషం. ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాల గురించి ఓసారి చూద్దాం. 

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికైన సందర్భం ఒక ముఖ్యాంశమైతే.. పాలమూరు జిల్లా నుంచి సీఎంగా ఎన్నికవుతున్న రెండో వ్యక్తి కూడా రేవంతే కావడం మరో ముఖ్యాంశం. ఆంధ్రాలో విలీనం కాక ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు బూర్గుల రామకృష్ణారావు. ఆయన అప్పటి కల్వకుర్తి తాలూకాలోని పడకల్లు గ్రామంలో జన్మించారు. గొప్ప మేధావి, రచయిత, నిజాంపై పోరాడిన ధీరుడిగా కీర్తి గడించిన బూర్గుల తరువాత.. ఇంత కాలానికి మళ్లీ పాలమూరు ప్రాంతం నుంచి రేవంత్ రూపంలో మరో వ్యక్తి సీఎం అవుతున్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతుండడంతో ఆ ప్రాంతానికి మరోసారి ఆ ఖ్యాతి దక్కినట్టయింది. పాలమూరు నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారు. 

ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న టీ-పీసీసీ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి.. 1969లో నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించారు. వారిది పూర్తిగా వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి పేరు దివంగ‌త అనుముల న‌ర్సింహారెడ్డి. త‌ల్లి రామ‌చంద్ర‌మ్మ‌. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్న‌నాటి నుంచే రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. 2006లో మిడ్జిల్ మండల జడ్పీటీసీ సభ్యుడుగా విజయం సాధించడంతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వతంత్రుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి  కొడంగల్ ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన పునాది పడింది. 2014లో అదే టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014–17 మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన రావడంతో టీడీపీ ఉనికి కోల్పోతున్న తరుణంలో 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేశారు. అప్పుడే కాంగ్రెస్‌ లో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు తీసుకొని అధిష్టానానికి నమ్మినబంటుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ వ్యవహారాలను సొంత వ్యవహారాల కంటే చిత్తశుద్ధిగా చేస్తున్న వ్యక్తిగా అధిష్టానం ఆయన్ని గుర్తించింది. 

ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. అలా ఎంపీగా ఉన్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి, అటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కొడంగల్ నుంచి భారీ మెజారిటీతో గెలిచి.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని లిఖించారు. 2021 జూన్ 26న ఏఐసీసీ అధిష్టానం టీ-పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ ను ఎంపిక చేసింది. 2021 జూలై 7న టీ-పీసీపీ చీఫ్ గా ప్రమాణస్వీకారం చేసి కీలకమైన బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు రేవంత్. అలా అసెంబ్లీ ఎన్నికలకు భారీ స్కెచ్ వేసి సఫలీకృతం అయ్యారు రేవంత్. 

ముక్కూ మొహం తెలియని అపరిచితుడికి ఎవరైనా ఇంటి తాళాలు అప్పగిస్తారా? కానీ ఒక దేశాన్ని పాలించిన పార్టీగా.. ఏఐసీసీ నేతలు.. రేవంత్ కు టీ-పీసీసీ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా ఆ పేరైనా వారికి రాలేదు. అలాంటప్పుడు తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అందుకే ఏఐసీసీ నేతలు రేవంత్ ను రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. వారికి రేవంత్ పట్టుదల మీద, బీఆర్ఎస్ నేతల లోగుట్లపై ఆయనకున్న విషయ పరిజ్ఞానం మీద నమ్మకం కుదిరింది. దీంతో ఎవరేమన్నా తగ్గేదే లేదంటూ.. ఆయనకు పీసీసీ పగ్గాలు కట్టబెట్టి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అప్పటి నుంచి మొన్న ఎన్నికలు జరిగేదాకా అన్నీ తానై పార్టీని చక్కబెట్టారు రేవంత్. టీ-పీసీసీ చీఫ్ గా సరిగ్గా రెండేళ్ల 4 నెలలు గడిచేసరికి రిజల్ట్ చూపించారు రేవంత్. ఈ ఒక్కటి చాలదా... రేవంత్ లోని కెపాసిటీ ఎలాంటిదో? రేవంత్ గురించి మరో విషయం కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి ఆయన సీఎం కావాలనే టార్గెట్ 2029లో ఉందట. టీ-పీసీసీలో ఉండే పాత తరాన్ని సెట్ చేసుకోవడం లేదా.. క్రమంగా వారిని సైడ్ చేయడం. ఇందుకోసం కనీసం 2 టర్మ్ ల అసెంబ్లీ కాలం పడుతుందని ఆయన అంచనా వేసి పెట్టుకున్నారట. ఆ దిశగానే ఆయన ఆపరేషన్ కూడా చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. అటు అధిష్టానం ఇచ్చిన ఫ్రీడమ్ ని చక్కగా ఉపయోగించుకుంటూ.. తోక జాడించినవారిని హైకమాండే పక్కకు తోసేసేలా చేస్తూ టాప్ లెవల్ కి ఎదిగారు. అంటే మరో టర్మ్ సమయం ఉండగానే.. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తున్నారు. అనుకున్న టైమ్ కి అయిదేళ్లు ముందుగా సీఎం కావడం నిజంగా వండర్ ఫుల్ కదా. ఒక నాయకుడి పొలిటికల్ ప్రొఫైల్ లో ఇంతకన్నా సక్సెస్ పాయింట్ ఇంకేముంటుంది?

Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత